Home Blog Page 60

Sarabh Jyoth Singh తినడానికి ఏమైనా ఇవ్వండి.. ప్లీజ్‌: కాంస్య పతక విజేత సరభ్‌ జ్యోత్‌ సింగ్‌

0

Sarabh Jyoth Singh పారిస్‌ ఒలింపిక్స్‌లో (Olympic Games Paris 2024) భారత్‌ సత్తా చాటుతోంది. ఇప్పటికే మూడు పతకాలు కైవసం చేసుకున్న భారత్‌.. మరిన్ని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, మంగళవారం ‘ఇండియా హౌస్‌’లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్ విభాగంలో మను, (Manu Bhakar) సరభ్‌జ్యోత్‌ సింగ్‌ (sarabjot Singh) జోడీ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి ఇండియా హౌస్‌కు వెళ్లిన ఈ జోడీకి ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అంతలో సౌరభ్‌  ‘దయ చేసి తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని అడిగాడట. అంతే.. అక్కడున్న వారందరికీ నిమిషాల వ్యవధిలో పానీపూరీ, భేల్‌ పూరీ, దోసె సర్వ్‌ చేశారట.

Sarabh Jyoth Singh

ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు వివిధ ఆహార నియమాలు ఉంటాయి. మితాహారం తీసుకోవాలని, అది తినొద్దని, ఇది తినొద్దని కోచ్‌లు, సహాయ సిబ్బంది పదేపదే చెబుతుంటారు. దీంతో తినాలని మనసులో కోరిక ఉన్నా.. పతకం సాధించాలన్న లక్ష్యంతో వారంతా నోరు కట్టుకొని ఉంటారు. పతకం సొంతమైన తర్వాత నచ్చిన ఆహారం తినడానికి వారంతా ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో చెప్పేందుకు ఈ సన్నివేశమే నిదర్శనం. అలాంటి వారందరికీ ‘ఇండియా హౌస్‌’ సొంత ఇంటిలా మారింది. గేమ్‌ పూర్తయిన తర్వాత అథ్లెట్లు ఇక్కడ తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచక్కా లాగించేయొచ్చు. పారిస్‌ ఒలిపింక్స్‌లో పోటీపడుతున్న భారత్‌ అథ్లెట్ల కోసం తొలిసారిగా ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేశారు. అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇదో వేదిక. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల భారతీయ వంటకాలు ఉంటాయి.

మంగళవారం జరిగిన  కంచు పోరులో మను, సరబ్‌జ్యోత్‌ సింగ్‌ జోడీ 16-10తో కొరియాకు చెందిన లీ వొనో, వో యె జిన్‌ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Biryani Master Job : బిర్యానీ వంట మాస్టర్ కావాలంట! జీతం ఏకంగా లక్షల్లో!

0

Biryani Master Job చదువు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేది ఒక్క విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పేదరికాన్ని పారద్రోలి జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒక్కటే. అయితే ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. దీంతో చదువుకొని తప్పు చేశామా? అనే నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే చదువు లేకుండా కూడా చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా ఇలా లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. నెలకు 75 వేల జీతం ఇస్తారట.

Biryani Master Job

హైదరాబాద్ బిర్యానికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారైన హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలని తహతహలాడుతుంటారు. బిర్యానీ రుచిగా రావాలంటే వంట మాస్టర్ చేతుల్లో ఉంటుంది. మరి మీరు కూడా మంచి వంట మాస్టరా? అయితే మీకు ఓ బంపరాఫర్ ఉంది. ఏ చదువు లేకపోయినా సరే మీరు వండర్ ఫుల్ గా బిర్యాని వండితే చాలు. కళ్లు చెదిరే జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఓ యూజర్ బిర్యానీ మాస్టర్ చెఫ్ కావాలంటూ పోస్టు చేశాడు. ఆ వీడియోలో.. హైదరాబాద్ లోని మల్లాపూర్, నాచారం ఏరియాలో ఓ రెస్టారెంట్ లో బిర్యానీ వంట మాస్టర్ కావాలంటూ కోరారు. రోజుకు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఆయన కేవలం బిర్యానీ చేస్తే చాలు. ఇతడికి సహాయంగా పాత్రలు కడగడానికి, కూరగాయలు కట్ చేయడానికి అసిస్టెంట్ లను కూడా ఇస్తారు.

అయితే బిర్యానీ కుక్ కు ఓ కండీషన్ పెట్టారు. చెఫ్ కు పాన్ గుట్కా తినే అలవాటు ఉండకూడదు. ఇక ఈ బిర్యానీ చెఫ్ కు ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? రోజుకు రూ. 2500 అంటే నెలకు రూ. 75 వేలు. అంటే ఏడాదికి రూ. 9 లక్షల జీతం అన్నమాట. బిర్యాని చెఫ్ కు చదువుతో సంబంధం లేకుండా లక్షల్లో జీతం వస్తుండడంతో చదువుకున్న నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి వేస్ట్ అంటూ ఉసూరుమంటున్నారు. చదువుకోకుండా వంట మాస్టర్ అయినా కూడా లక్షల్లో సంపాదించుకునే వాళ్లమని తెగ బాధపడిపోతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IND vs SL : నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?

0

IND vs SL First ODI at Colombo: నేడు శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్లు క్రికెట్ మైదానంలో కనిపించనున్నారు. వన్డే సిరీస్‌ లో రోహిత్ శర్మ కెప్టెన్‌ గా తిరిగి రానున్నాడు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్‌ లకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక అంత సులభం కాదు. శ్రీలంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ లో ఎవరు ఉండబోతున్నారు.? ఎవరి బలాబలాలేంటో ఓసారి చూస్తే..

IND vs SL

శ్రీలంకతో వన్డే సిరీ స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడంతో.. ఓపెనింగ్ పెయిర్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అంటే ఓపెనింగ్ జోడీ దాదాపు ఖాయమైనట్లే. దీని తర్వాత విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌లోకి రావడం ఖాయం. ఈ సిరీస్లో కొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లి తను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాయి. దీని తరువాత నాలుగువ స్థానానికి ఖచ్చితంగా కొంత సస్పెన్స్ నెలకొనిఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరికీ జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్‌ పంత్‌ కీపర్‌ గా వ్యవహరిస్తాడనే నమ్మకం ఉంది. అయితే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే అవకాశం ఉంది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు కోచ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేదే సందేహం.

ఆ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు అల్ రౌండర్స్ జట్టులో భాగం. కాబట్టి, వారిద్దరూ టీంలో ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే., వీరిద్దరికీ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా బాగానే ఉంది. దీని తరువాత, కుల్దీప్ యాదవ్ మూడవ స్పిన్నర్‌గా ఆడటం చూడవచ్చు. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల గురించి చూసినట్లైతే.. మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ లు ఉండనున్నారు.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ర్యాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Pooja Khedkar Lifetime Ban : వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం

0

  • పుణే సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగం ఆరోపణలు
  • యూపీఎస్సీ సెలెక్షన్ సమయంలోనూ తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణ
  • భవిష్యత్తులో సివిల్స్ లో పాల్గొనకుండా పూజా ఖేద్కర్ పై నిషేధం

Pooja Khedkar Lifetime Ban వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో ఆమె సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పూణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

Pooja Khedkar Lifetime Ban

అంతకుముందు, సెలెక్షన్ సమయంలో యూపీఎస్సీకి తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. పూజా ఖేద్కర్ మీద వచ్చిన ఆరోపణలపై ఇటీవలే కేంద్రం నియమించిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసి, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించింది.

మహారాష్ట్రకు చెందిన వైభవ్ కోకట్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ తో పూజా ఖేద్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖరీదైన ఆడి కారుతో పూజా ఖేద్కర్ ఫొటోను వైభవ్ కోకట్ పోస్టు చేశారు. దాంతో అందరి దృష్టి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పైకి మళ్లింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఆమె యూపీఎస్సీ సెలెక్షన్ కోసం చేసిన అక్రమాలు కూడా బయటపడ్డాయి.


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి

0

Business Idea : నేటి నవ భారతదేశం ప్రతిరోజూ కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంది. ప్రధాని మోదీ స్టార్టప్ ఇండియా మిషన్ రోజురోజుకూ కొత్త ఊపందుకుంటున్నది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కథనం మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ రోజు మేము మీకు 15 లక్షల వరకు సంపాదించగల వ్యాపార ఆలోచన గురించి తెలియజేస్తాం. బొప్పాయిని పచ్చిగా ఉన్నప్పుడు, పండిన తర్వాత కూడా ఉపయోగిస్తారు. పండిన బొప్పాయి పండ్లలో చేర్చబడుతుంది. అయితే పచ్చి బొప్పాయిని కూరల్లో ఉపయోగిస్తారు. విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో స్థానిక (దేశీయ) రకాలు అలాగే విదేశీ రకాలు ఉన్నాయి. బొప్పాయి పండించే ముందు, కొన్ని ప్రధాన రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Business Idea

పూసా నన్హా: ఈ రకం 1983 సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది. ఒక మొక్క 25 నుండి 30 కిలోల బొప్పాయి పండ్లను ఇస్తుంది. దీని పండ్లు చిన్నగా.. మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. మొక్కల ఎత్తు సుమారు 120 సెంటీమీటర్లు. మొక్కల ఎత్తు నేల ఉపరితలం నుండి 30 సెం.మీ ఎత్తులో ఉన్నప్పుడు, అవి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

పూసా జెయింట్: ఇది 1981 సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది. దీని పండ్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇది కూరల తయారీకి అనువైన రకం. ఒక మొక్క 30-35 కిలోల పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ జాతి మొక్కలు 92 సెంటీమీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు, అవి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

పూసా డెలీషియస్ : ఇది 1986 సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది. ఒక మొక్క 40 నుండి 45 కిలోల బొప్పాయిని ఉత్పత్తి చేస్తుంది. రుచికరమైన పండ్లతో ఈ రకమైన మొక్కల ఎత్తు 216 సెంటీమీటర్లు. మొక్కల ఎత్తు 80 సెం.మీ ఉన్నప్పుడు, మొక్కలు ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి.

సూర్య: హైబ్రిడ్ రకాల్లో ఇది ప్రధానమైనది. ఒక పండు బరువు 500 నుండి 700 గ్రాముల వరకు ఉంటుంది. పండ్ల నిల్వ సామర్థ్యం బాగుంది. ఒక మొక్కకు పండ్ల దిగుబడి 55-56 కిలోలు.

Business Idea రెడ్ లేడీ 786: ఇది హైబ్రిడ్ రకాల్లో చేర్చబడింది. ఈ రకం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఒకే మొక్కలో మగ, ఆడ పువ్వులు పెరుగుతాయి. దీని కారణంగా, ప్రతి మొక్క నుండి పండ్లు లభిస్తాయి. మొక్కలు నాటిన 9 నెలల తర్వాత మాత్రమే ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం పండ్ల నిల్వ సామర్థ్యం ఎక్కువ. ఈ జాతి భారతదేశం అంతటా విజయవంతంగా సాగు చేయబడుతోంది. ఈ వెరైటీని నో యువర్ సీడ్స్ అనే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తోంది.

సంపాదన ఎంత ఉంటుంది?
Business Idea వివిధ రకాల బొప్పాయిల గురించి తెలుసుకుంటే తద్వారా వ్యాపారం చేయడం సులభం అవుతుంది. బొప్పాయి తోటల పెంపకానికి కనీసం 25 దశాంశాలు, గరిష్టంగా 2 హెక్టార్ల భూమి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటేందుకు దాదాపు రూ.6500 మూలధనం కావాలి. ఈ వ్యవసాయం ద్వారా రైతులకు రెండేళ్ల పాటు ప్రతి ఏటా ఎకరాకు రూ.12 నుంచి 15 లక్షల ఆదాయం వస్తోంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Sexual Harassment : ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..?

0

Sexual Harassment : ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..? : ప్రస్తుత రోజుల్లో మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల ప్రతిరోజు అనేకమంది మహిళలు అత్యాచారం బారిన పడుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు మితిమీరిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బిసౌలిలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Sexual Harassment

ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిసోలిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోలో నగరంలోని స్థానికంగా ఉన్న దుకాణంలో యువతి ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉంది. ఆ యువతీ ఓవైపు తన వారితో తిరిగి మాట్లాడుతుండగా.. వెనుక వైపు ఉన్న వృద్ధుడు రెచ్చిపోయాడు. అమ్మాయి ఓ వైపు తన వారితో మాట్లాడుతుండగా.. మరోవైపు వృద్ధుడు ఆ అమ్మాయి జుట్టును పలుమార్లు పట్టుకుంటూ జుట్టు వాసనను చూసేందుకు ప్రయత్నం చేశాడు.

Sexual Harassment మొదటగా వీలు కాకున్న చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జుట్టును చేత్తో పట్టుకొని వాసన చూడడం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అయితే., తాను చేస్తున్న పనిని ఆ వృద్ధుడు ఎవరు గమనించట్లేదని భావించాడు. కాకపోతే ఈ తతంగం మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఇంత జరిగిన ఆ అమ్మాయికి విషయం తెలియకపోవడం విడ్డురం. ఆ వీడియోని దుకాణం సంబంధించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఆ వృద్ధుడి వై మండిపడుతున్నారు. నీ వయసు ఏంటి..? నువ్వు చేసే పనులు ఏంటి..? అంటూ గాటుగా విమర్శిస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరితీయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Foods for Eye Health : ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. కళ్ల సమస్యలు రానే రావు..

0

Foods for Eye Health కళ్లు సరిగ్గా కనిపిస్తేనే అన్నీ చూడగలం. సర్వేద్రియానాం నయనం అన్నారు పెద్దలు. శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కళ్లు కూడా ఒకటి. అందుకే కళ్లను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైనా ఆహారం తీసుకోవాలి. సాధారణంగా అందరూ విటమిన్ ఏ తీసుకుంటే.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు. కానీ విటమిన్ ఏ ఒక్కటి సరిపోదు. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి మరిన్ని పోషకాలు కూడా కావాలి. కంటి చూపు సరిగ్గా లేక చాలా మంది కళ్లద్దాలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలను సరైన పద్దతిలో తీసుకుంటే కళ్లద్దాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. మరి కళ్లను ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Foods for Eye Health

గుడ్లు:

గుడ్లు తినడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా కళ్లకు కూడా చాలా మంది. ఇందులో లూటిన్, గ్జియాన్తీన్, విటమిన్ ఏ, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లు తినడం వల్ల వయసు రీత్యా వచ్చే కొన్ని రకాల కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచే కోడి గుడ్డు ఇవ్వడం అలవాటు చేయండి.

చేపలు:

చేపలు తినడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్.. కళ్లు చూపుకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. కళ్లు పొడి బారకుండా కాపాడుతుంది. అంతే కాకుండా రెటీనా కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు హెల్ప్ చేస్తాయి.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు తినడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో బీటా కెరోటీన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కళ్లు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

క్యారెట్లు:

క్యారెట్లు ఆరోగ్యానికి, చర్మానికే కాకుండా కళ్లకు కూడా చాలా మంచిది. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కళ్లు సరిగా కనిపించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. క్యారెట్‌లో ఉండే బీటా కెరొటిన్, రెటీనా ఇతర కంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!

0

IND vs PAK : వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొన‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఇప్ప‌టికే ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంద‌జేసింది. పాకిస్తాన్‌కు టీమ్ఇండియా వెళ్లే అవ‌కాశం లేద‌ని, హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఐసీసీని బీసీసీఐ కోరింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

IND vs PAK

గ‌త కొన్నాళ్లుగా భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో త‌ల‌ప‌డ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే త‌ల‌ప‌డుతున్నాయి. భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రెండు దేశాల అభిమానులే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు అని చెప్ప‌డంలో అతి శ‌యోక్తి లేదు.

ఇదిలా ఉంటే.. అభిమానుల‌కు మాత్రం ఓ కిక్ ఇచ్చే వార్త అందుతోంది. నివేదిక‌ల ప్ర‌కారం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్, పాకిస్తాన్‌లు గ్రూపు-ఏలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ్రూపు-ఏలో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జ‌ట్లు ఉన్నాయి. ఇక గ్రూపు-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికాలు ఉన్నాయి. గ్రూపులోని ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో మ్యాచ్ ఆడ‌తాయి. ప్ర‌తి గ్రూపు నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూప‌ర్‌-4కి చేరుకుంటాయి. సూప‌ర్‌-4 ద‌శ‌లో ఒక్కొ జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో మ్యాచ్‌లు ఆడ‌తాయి. టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ అర్హ‌త సాధిస్తాయి.

ఈ లెక్క‌న‌ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఒకే గ్రూపులో ఉండ‌డంలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఖ‌చ్చితంగా ఓ మ్యాచ్ జ‌రుగుతోంది. ఇక రెండు జ‌ట్లు కూడా సూప‌ర్ ఫోర్‌కు క్వాలిఫై అయితే.. అక్క‌డ మ‌రోసారి పోటీప‌డ‌తాయి. సూప‌ర్ ఫోర్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే అప్పుడు మూడో సారి ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తాయి.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Home Cleaning Machine ఇల్లు ఊడ్చే మెషిన్.. 30 వేలది ఆఫర్లో 9 వేలే! పనిమనిషి ఖర్చులు ఆదా!

0

Home Cleaning Machine హైదరాబాద్ లాంటి నగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోతే ఇంట్లో పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పనిమనిషిని మెయింటెయిన్ చేయాలంటే ఒకరి జీతం ఆవిడకి వెళ్ళిపోతుంది. పైగా అందరూ సరిగా పని చేస్తారా అంటే చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని నమ్ముకోవడం బెటర్. ఇల్లు ఊడ్చడానికి ప్రతి నెలా పనిమనిషికి ఎంత లేదన్నా ఒక వెయ్యి రూపాయల నుంచి 1500 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 10 వేల నుంచి 18 వేలు అవుతుంది. దీని కంటే ఇల్లు ఆటోమేటిక్ గా ఊడ్చే మెషిన్ కొనుక్కుంటే ఆ డబ్బులన్నీ ఆదా అవుతాయి. మార్కెట్లో రోబో వాక్యూమ్ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐలైఫ్ కంపెనీకి చెందిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఒకటి ఉంది. ఇది ఆటోమేటిక్ సెల్ఫ్ ఛార్జింగ్ తో వస్తుంది. షెడ్యూల్ టైం పెడితే ఆటోమేటిక్ గా డైలీ ఆ సమయానికి అదే క్లీన్ చేసేస్తుంది. టైల్స్, హార్డ్ ఫ్లోర్ మీద, కార్పెట్స్ మీద పని చేస్తుంది. దీన్ని రిమోట్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.

Home Cleaning Machine

ఇందులో మూడు మోడ్స్ ఉన్నాయి. ర్యాండమ్, ఎడ్జ్, స్పాట్ మోడ్ ఉన్నాయి. హార్డ్ ఫ్లోర్, గ్రానైట్ ఫ్లోర్లు, మొజాయిక్ ఫ్లోర్, చెక్క ఫ్లోర్, వెర్టిఫైడ్ టైల్స్, బాల్కనీ టైల్స్, సిమెంట్ నేల మీద కూడా పని చేస్తుంది. దుమ్ముని మొత్తం శుభ్రం చేసేస్తుంది. యాంటీ కొలిజన్, యాంటీ డ్రాప్, సక్షన్ పోర్ట్ ఫీచర్స్ తో వస్తుంది. బంపర్ సెన్సార్స్, సైడ్ బ్రషెస్, డస్ట్ ట్యాంక్ తో వస్తుంది. ఒక రోబో వాక్యూమ్ క్లీనర్, ఛార్జింగ్ డాక్, ఏసీ అడాప్టర్, ఎలక్ట్రో వాల్, రెండు హెపా ఫిల్టర్లు, రెండు సైడ్ బ్రష్ లు, ఒక డస్ట్ ట్యాంక్, ఒక క్లీనింగ్ బ్రష్, ఒక రిమోట్ కంట్రోల్ ఇస్తున్నారు. దీని అసలు ధర రూ. 22 వేలు ఉండగా ఆఫర్ లో రూ. 9,399కే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ కింద 1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. లిమిటెడ్ టైం డీల్ నడుస్తోంది. ఆ తర్వాత ఆఫర్ అయిపోతే ధర పెరిగిపోతుంది. కాబట్టి కొనాలనుకుంటే ఇప్పుడే కోనేయండి. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకునేలా ఐలైఫ్ కంపెనీకి చెందిన స్మార్ట్ రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దీని అసలు ధర రూ. 32,990 కాగా ఆఫర్ లో రూ. 16,900కే లభిస్తుంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది కూడా లిమిటెడ్ టైం డీలే. కాబట్టి కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఎయిర్ రోబో వాక్యూమ్ క్లీనర్ 30 వేల రుపాయలది ఆఫర్ లో 10,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది కూడా లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకునేలా ఎయిర్ రోబో కంపెనీకి చెందిన రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దీని అసలు ధర రూ. 34,990 కాగా ఆఫర్ లో రూ. 13,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీన్ని యాప్ తో, వాయిస్ తో రెండు రకాలుగా కంట్రోల్ చేయవచ్చు. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఆఫర్ అయిపోతే మళ్ళీ ఈ ధరకు దొరకదు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


PV Sindhu in Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ లో ప్రీక్వార్టర్ ఫైనల్స్ చేరిన తెలుగుతేజాలు పీవీ సింధు, ఆకుల శ్రీజ

0

  • నేడు బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్ లో సింధు విజయం
  • 21-5, 21-10 తేడాతో ఎస్తోనియా షట్లర్ క్రిస్టిన్ కూబాపై నెగ్గిన సింధు
  • టేబుల్ టెన్నిస్ గ్రూప్ మ్యాచ్ లో సింగపూర్ క్రీడాకారిణిపై నెగ్గిన ఆకుల

PV Sindhu in Paris Olympics పారిస్ ఒలింపిక్స్ లో తెలుగుతేజాలు పీవీ సింధు (బ్యాడ్మింటన్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్) ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన గ్రూప్-ఎం మ్యాచ్ లో సింధు 21-5, 21-10తో ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్ కూబాపై అలవోకగా నెగ్గింది.

PV Sindhu in Paris Olympics

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు ముందు పెద్దగా అనుభవంలేని క్రిస్టిన్ కూబా ఏమాత్రం నిలవలేకపోయింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం చూస్తే సింధు జోరు అర్థమవుతుంది. ఈ విజయంతో సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన సింధు ప్రీ క్వార్టర్స్ లో చైనాకు చెందిన హీ బింగ్జియావోతో తలపడనుంది.

ఇక టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా ముందంజ వేసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీక్వార్టర్స్ చేరింది. ఇవాళ జరిగిన గ్రూప్ మ్యాచ్ లో శ్రీజ 4-2 తేడాతో సింగపూర్ క్రీడాకారిణి జెంగ్ ను ఓడించింది.

ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో ప్రీక్వార్టర్స్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా ఆకుల శ్రీజ ఘనత సాధించింది.


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.