Wednesday, June 18, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsIND vs SL : నేడే శ్రీలంక,...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

IND vs SL : నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

IND vs SL First ODI at Colombo: నేడు శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్లు క్రికెట్ మైదానంలో కనిపించనున్నారు. వన్డే సిరీస్‌ లో రోహిత్ శర్మ కెప్టెన్‌ గా తిరిగి రానున్నాడు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్‌ లకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక అంత సులభం కాదు. శ్రీలంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ లో ఎవరు ఉండబోతున్నారు.? ఎవరి బలాబలాలేంటో ఓసారి చూస్తే..

IND vs SL

శ్రీలంకతో వన్డే సిరీ స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడంతో.. ఓపెనింగ్ పెయిర్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అంటే ఓపెనింగ్ జోడీ దాదాపు ఖాయమైనట్లే. దీని తర్వాత విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌లోకి రావడం ఖాయం. ఈ సిరీస్లో కొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లి తను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాయి. దీని తరువాత నాలుగువ స్థానానికి ఖచ్చితంగా కొంత సస్పెన్స్ నెలకొనిఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరికీ జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్‌ పంత్‌ కీపర్‌ గా వ్యవహరిస్తాడనే నమ్మకం ఉంది. అయితే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే అవకాశం ఉంది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు కోచ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేదే సందేహం.

ఆ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు అల్ రౌండర్స్ జట్టులో భాగం. కాబట్టి, వారిద్దరూ టీంలో ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే., వీరిద్దరికీ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా బాగానే ఉంది. దీని తరువాత, కుల్దీప్ యాదవ్ మూడవ స్పిన్నర్‌గా ఆడటం చూడవచ్చు. ఇక ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల గురించి చూసినట్లైతే.. మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ లు ఉండనున్నారు.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ర్యాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this