Street Dogs Saved Life భూ వివాదంలో నలుగురు వ్యక్తులు తనను సజీవంగా పూడ్చిపెట్టారని, అనంతరం వీధికుక్కలు మట్టిని తొవ్వడంతో తాను బతికి బయటపడ్డానని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Street Dogs Saved Life
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అతడిపై అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. రూప్ కిశోర్ మృతి చెందాడని భావించి నిందితులు ఓ పొలంలో అతడిని పాతిపెట్టి వెళ్లిపోయారు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తొవ్వాయి. రూప్ కిశోర్ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిశోర్కి తిరిగి స్పృహ వచ్చింది. దీంతో అతడు నడుచుకుంటూ స్థానికుల వద్దకు వెళ్లడంలో అతడిని వారు ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై రూప్ కిశోర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని అన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Horoscope Today ఈ నెల 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడి మీద కుంభ రాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఊహించని స్థాయిలో ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
Horoscope Today
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి మీద లాభస్థానంలో ఉన్న శని దృష్టి పడినందువల్ల ఉద్యో గాలపరంగా ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పడతాయి. రాజయోగాలు అను భవించడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సంతానపరంగా శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అంద డం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి దృష్టి ఆ శుక్రుడి మీద పడడం వల్ల వీరు ఉద్యోగాలపరంగా రాజయోగాలను అనుభవించడం జరుగు తుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, ఆశించిన బదిలీలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు, వీటికి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి.
సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడినందు వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉన్నత పద వులు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.
తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడమే ఒక రాజయోగం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన శని దృష్టి ఆ శుక్రుడి మీద పడడం విపరీత రాజయోగానికి దారి తీస్తుంది. దీనివల్ల సమాజంలోని అత్యంత ప్రముఖులైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు హోదాలు, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభాలు గడిస్తాయి.
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి దృష్టి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగా ర్థులకు ప్రభుత్వ లేదా బ్యాంక్ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది.
కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శనీశ్వరుడి దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు సైతం అందే సూచనలున్నాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
Cheating Partners ప్రేమ, పెళ్లి ఈ రెండూ చాలా పవిత్రమైనవి. అయితే లవ్ పార్టనర్ ని, లైఫ్ పార్టనర్ ని మోసం చేయడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే ఎక్కువగా ఎవరు మోసం చేస్తున్నారు? అబ్బాయిలా? లేక అమ్మాయిలా? ఇది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అసలు దీని గురించి స్టడీస్ ఏం చెప్తున్నాయి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
Cheating Partners
ఒక స్టడీ ప్రకారం 20 శాతం మంది మగవారు, 13 శాతం మంది పెళ్ళైన మహిళలు ఇతరులతో సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. సగటున 16 శాతం మంది మోసం చేస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది. అయితే ఈ స్టడీ ప్రకారం మగవాళ్లే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 9 శాతం మంది మహిళలు, 17 శాతం మంది మగవారు తమ భాగస్వాములకి నమ్మకద్రోహం చేశారని తేలింది. ఇందులో మరలా ఇతరులతో సంబంధం పెట్టుకున్న వారిని లిస్ట్ అవుట్ చేస్తే 15 శాతం మంది మహిళలు, 27 శాతం మంది మగవారు శారీరక సంబంధాలు పెట్టుకున్నారని తేలింది. సగటున 21 శాతం మంది మోసం చేస్తున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ 2010 నుంచి 2016 వరకూ వివిధ వయసు వారి మీద చేసిన జనరల్ సోషల్ సర్వే ప్రకారం.. అన్ని వయసు మగవారు తమ భాగస్వాముల్ని మోసం చేస్తున్నట్లు తేలింది. అయితే 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న అబ్బాయిలు నిజాయితీపరులని తేలింది. ఇక మహిళల్లో 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ భర్తలను మోసం చేసినట్లు తేలింది. ఇది సగటున 16 శాతంగా ఉంది. మహిళలతో పోలిస్తే భార్యలను మోసం చేసే మగవారు 26 శాతం మంది ఉన్నారు. మగవారిలో 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా భార్యలను మోసం చేస్తున్నారని తేలింది.
ఈ వయసు అమ్మాయిలే ఎక్కువగా మోసం చేస్తున్నారు:
18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మోసం చేసే అమ్మాయిలు 11 శాతం ఉండగా అబ్బాయిలు మాత్రం 10 శాతం మందే ఉన్నారు. దీన్ని బట్టి 18 నుంచి 29 ఏళ్ల వయసున్న అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిలను మోసం చేస్తున్నట్లు జనరల్ సోషల్ సర్వేలో తేలింది. 30 నుంచి 39 ఏళ్ల వయసున్న వారిలో 12 శాతం మంది అమ్మాయిలు మోసం చేస్తుండగా, 14 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 40 నుంచి 49 ఏళ్ల వయసు వారిని తీసుకుంటే 14 శాతం మంది మహిళలు , 16 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 50 నుంచి 59 వయసున్న వారిలో 15 శాతం మంది మహిళలు, 22 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 60 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో 16 శాతం మంది మహిళలు, 24 శాతం మంది పురుషులు మోసం చేస్తున్నారు.
Cheating Partners 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో 13 శాతం మంది మహిళలు భర్తలను మోసం చేస్తుండగా.. 26 శాతం మంది పురుషులు భార్యలను మోసం చేస్తున్నారు. 80+ వయసున్న వారిలో 6 శాతం మంది మహిళలు మోసం చేస్తుండగా.. 24 శాతం మంది మగవారు భార్యలను మోసం చేసినట్లు తేలింది. ఇండియా విషయానికొస్తే.. 2023లో పలు గణాంకాల ప్రకారం.. ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా పరాయి వారితో శారీరక సంబంధం పెట్టుకున్నవారిలో 23 శాతం మంది పురుషులు ఉండగా.. 13 శాతం మంది మహిళలు ఉన్నారు. 95 వేల మంది మీద చేసిన సర్వేలో 91 శాతం మంది మహిళలు, 77 శాతం మంది మగవారు వేరే వ్యక్తులతో భావోద్వేగ, శారీరక సంబంధం పెట్టుకున్నారని ఒక సర్వేలో తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 10 మంది భారతీయ స్త్రీలలో 7 మంది విసుగు చెంది భర్తలను మోసం చేస్తున్నారని ఒక స్టడీలో తేలింది.
Average Student Nani Movie Review : డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో పవన్ కుమార్ హీరోగా నటించడమే కాక తనే ఈ సినిమాని నిర్మిస్తూ డైరెక్షన్ చేసాడు. సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ హీరోయిన్స్ గా ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించగా శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై ఈ సినిమాని నిర్మించారు. యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.
Average Student Nani
కథ విషయానికొస్తే.. నాని(యావరేజ్ స్టూడెంట్ నాని) సరిగ్గా చదవడని ఇంట్లో నాన్న(రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా అమ్మ(ఝాన్సీ), అక్క(వివియా సంపత్) సపోర్ట్ చేస్తూ ఉంటారు. నానిపై అక్కకి ప్రేమ ఉన్నా నానికి అక్క ఇష్టం ఉండదు. బి.టెక్ ఎంట్రన్స్ లో నానికి ర్యాంక్ రాకపోవడంతో నాని అమ్మ ఏదో ఒకటి చేసి మెకానికల్ లో సీట్ సంపాదిస్తుంది. ఇక కాలేజీలో జాయిన్ అయ్యాక కాలేజీ డేస్, సీనియర్స్ ర్యాగింగ్ తో సాగుతున్న సమయంలో నాని తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. ఈ విషయంలో సీనియర్స్ తో నానికి గొడవలు అవుతాయి.
ఓ జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. ఓ సమయంలో సారా వేరే వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అదే సమయంలో నాని అక్కపై దాడి జరిగి కోమాలోకి వెళ్తుంది. అక్క తన కోసం చేసిన త్యాగం నానికి తెలుస్తుంది. దీంతో నాని చనిపోవాలనుకుంటాడు. మరి నాని ఏం చేసాడు? చివరికి నాని ఎవరితో ప్రేమలో ఉన్నాడు? నాని అక్క చేసిన త్యాగం ఏంటి? నాని అక్కపై ఎవరు దాడి చేసారు? నాని లైఫ్ లో సక్సెస్ అవుతాడా తెలియాలంటే తెరపై చూడాలి.
సినిమా విశ్లేషణ.. ఓ మాములు అల్లరి చిల్లరగా తిరిగే స్టూడెంట్ లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతాడు అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ యావరేజ్ స్టూడెంట్ నాని కూడా అదే కోవలోకి చెందింది. అల్లరి చిల్లరిగా తిరిగే నాని ఇంజనీరింగ్ లో ఎలా జాయిన్ అయ్యాడు? ఇద్దరి అమ్మాయిలతో ప్రేమాయణం ఎలా సాగింది అని చూపిస్తూనే అక్క, అమ్మ ఎమోషన్ ని బాగానే పండించారు. అలాగే చదువు వేరు, ట్యాలెంట్ వేరు. చదువు లేకపోయినా క్యారెక్టర్, ట్యాలెంట్ ఉంటే చాలు లైఫ్ లో సక్సెస్ అవ్వొచ్చు అనే పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు.
ఫస్ట్ హాఫ్ అంతా నాని అల్లరి, సారాతో ప్రేమాయణం, కాలేజీ ర్యాగింగ్ గొడవలు చూపించి ఇంటర్వెల్ ముందు సారా ఇంకొకరిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, అక్క కోమాలోకి వెళ్లడం చూపించి నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు అని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో అనుతో ప్రేమాయణం, సారా మళ్ళీ రావడం, నాని లైఫ్ లో సక్సెస్ అవ్వడం చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే ఒక మాస్ సాంగ్ మాత్రం థియేటర్స్ లో అదరగొడుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. డైరెక్టర్ పవన్ కుమార్ హీరోగా మారి ఓకే అనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పిస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ అందానికే పరిమితమయ్యారు. స్నేహ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కూడా మెప్పిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.
Average Student Nani సాంకేతిక అంశాలు.. పవన్ కుమార్ హీరోనే దర్శకుడు కావడంతో డైలాగ్స్ బానే ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. రొమాంటిక్ సాంగ్స్ విజువల్ గా బాగుంటాయి. మాస్ సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక హీరోనే నిర్మాత కూడా కావడంతో తన సబ్జెక్టు మీద కావాల్సినంత ఖర్చుపెట్టుకున్నారు.
మొత్తంగా యావరేజ్ స్టూడెంట్ నాని.. అల్లరి చిల్లరగా తిరిగే ఓ స్టూడెంట్ ప్రేమ కథలేంటి, లైఫ్ లో సక్సెస్ అయ్యాడా అని ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Viral Video : యూపీలోని సోన్భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్లోని తన ఇంటి నుంచి 3 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మహిళ.. యూపీలోని సోన్భద్రలోని గుహ లోపల నాగినిలా ప్రత్యక్షమైంది. ఆ మహిళ అచ్చం పాములాగే బుసలు కొడుతూ అసాధారణ స్థితిలో కనిపించింది. ఆ మహిళ నాగిని లాగే భూమిపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మహిళ నాగిన అవతారంలోకి మారిపోగా.. స్థానికులు ఆమెకు పూజలు చేస్తున్నారు. గుహలో గడిపిన తర్వాత స్త్రీకి దైవిక శక్తులు ప్రసాదించబడ్డాయని స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. దేవుని మహిమ వల్లే యువతి పాముగా మారిందని చెప్పుకుంటూ.. యూపీ నుంచి జార్ఖండ్ వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ గుహల్లో ఉన్న మహిళకు పూజలు నిర్వహిస్తున్నారు.
Viral Video
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. గుహలో ఆ మహిళ నేలపై పడి ఉండగా.. స్థానికులు వెళ్లి ఆమెకు పూజలు చేస్తున్నారు. అంతలో ఆమె తన నాలుకను పదే పదే బయటకు లోపలకు అనుకుంటూ అచ్చం పాము మాదిరిగానే ప్రవర్తిస్తూ కనిపించింది. గుహలో నేలపై పాములా పాకుతూ నాలుకను బయటకు చాపుతోంది. ఆ అమ్మాయి విచిత్ర చేష్టలకు అక్కడున్న కొందరు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆమె అవతారాన్ని వీడియోను రికార్డు చేశారు. ఈ సంఘటన కోన్ పీఎస్ పరిధిలోని రాణిదిహ్ గుప్తా ధామ్ గుహలో కనిపించింది.
ఆ మహిళ జార్ఖండ్ నుండి సోనభద్రకు ఎలా చేరుకుంది? అయితే, గ్రామస్తులు మహిళకు పూజలు చేసి పూలమాలలు వేయడం సోషల్ మీడియాలో వీడియోలు చూపించడంతో ఈ సంఘటనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, జార్ఖండ్లోని కరీవహదీహ్ ఖరౌండి ప్రాంతంలోని తన ఇంటి నుంచి ఆ మహిళ సోన్భద్రకు ఎలా, ఎప్పుడు చేరుకుంది అనేదానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. రెండు మూడు నెలల క్రితమే ఆమె కనిపించకుండా పోయిందని, అన్ని చోట్లా వెతికామని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎక్కడా కనిపించలేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు.ఆ తర్వాత కుటుంబసభ్యులు మహిళ ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి నాటకీయ కారణాన్ని అందించారు. ఒకరోజు ఆ మహిళ కుటుంబ సభ్యుల కలలోకి వచ్చి తన ప్రదేశాన్ని తెలియజేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. యూపీలోని సోన్భద్ర గుహలో ఉన్నట్టు ఆ మహిళ కలలో తెలిపిందని వెల్లడించారు.
కలలో ఉన్న మహిళ ఇచ్చిన సూచనల ప్రకారం, కుటుంబ సభ్యులు యూపీలోని సోన్భద్రలోని గుప్తా ధామ్ వద్ద మహిళను కనుగొనడానికి వెళ్లారు. అయితే కుటుంబసభ్యులు గుహ వద్దకు చేరుకుని చూడగా మహిళ ఆచూకీ లభించలేదు. అప్పుడు వారు గుహ ద్వారం వద్ద కీర్తన లేదా భజన చేశారు. కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లుగా, ఆ మహిళ రెండు చేతులు, కాళ్లపై పాకుతున్న గుహ నుంచి బయటపడింది. ఆమె కూడా బుసలు కొడుతూ, పామును అనుకరిస్తూ, ప్రసారం అవుతున్న వీడియో చూపిస్తుంది. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు సోన్భద్రకు చేరుకుంటున్నారు. ఆమెకు స్థానికులు పూజలు కూడా చేస్తున్నారు.
इसको अंधविश्वास कहा जा सकता हैं क्या..?
भूरी आंखें, लपलपाती चीभ… गुफा से नागिन की तरह निकली महिला,तीन माह पूर्व हुई थी लापता_देखने के लिए जुटी भीड़…..!
यूपी के सोनभद्र में गुप्ताधाम गुफा में 3 माह पूर्व लापता हुई युवती बड़े-बड़े और नुकीले दांत, सांपों की तरह जीभ निकाल कर… pic.twitter.com/bGWQt6DGvC
Collector Visit to ZP High School గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ గత కొంతకాలంగా క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల్లో తనిఖీలు చేస్తూ వాస్తవ పరిస్థితిలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆమెకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
Collector Visit to ZP High School
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తనిఖీ చేస్తున్న సమయంలో పాఠశాలలో మొత్తం నాలుగు వందల మంది విద్యార్ధులున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. అయితే హాజరైంది మాత్రం మూడు వందల యాభై మంది మాత్రమే. ఒకే రోజు యాభై మందికి పైగా విద్యార్దులు అబ్సెంట్ అవ్వడంపై ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ నిలదీశారు. వర్షం కారణంగా విద్యార్ధుల హాజరు శాతం తగ్గిందని చెప్పడంతో కలెక్టర్ మరింత అవాక్కయ్యారు.
విద్యార్దుల హాజరు తర్వాత ఉపాధ్యాయుల సంగతి ఏంటని ఆరా తీశారు. అయితే ముప్పై మంది టీచర్లు స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. నాలుగు వందల మంది విద్యార్ధులకు ముప్పై మందా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్ధులుంటున్న బడుల్లో కూడా ముప్పై మంది టీచర్లే ఉండటాన్ని చూస్తున్నాం. మరి మీ దగ్గర అంత తక్కువ సంఖ్యలో విద్యార్ధులుండటానికి కారణమేంటని నిలదీశారు. అంతేకాదు విద్యార్ధుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలేంటని అడిగారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సమాధానం చెప్పలేకపోయారు.
Collector Visit to ZP High School ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండటం లేదన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువుగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువుగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్దులు ఉపాధ్యాయులు శాతం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు వాస్తవాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Bags for Rainy Season వర్షాకాలంలో వానలు కురుస్తూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నప్పటికీ ఉద్యోగులు ఆఫీసులకు వెల్లంది తప్పదు. స్కూల్ కి విద్యార్థులు పోక తప్పదు. ఆఫీసులకు వెళ్లే వారు అయితే తమ ల్యాప్ టాప్, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లడానికి బ్యాగ్ ను యూజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ బ్యాగులల్లో బుక్స్ తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీ బ్యాగులు తడవకుండా ఉండాలంటే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉండాల్సిందే. ల్యాప్ టాప్ వంటి విలువైన వస్తువులు వర్షంలో తడిస్తే వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. అదే ఓ రెయిన్ కవర్ ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రూ. 89కే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది.
Bags for Rainy Season
వర్షంలో బ్యాగు తడవకుండా ఉండాలంటే దాన్నికవర్ చేసేలా వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉంటే బెస్ట్. బ్యాగులోని వస్తువులు తడవకుండా ఉంటాయి. స్టూడెంట్స్ కు, ఉద్యోగులకు, ఇతర పనులకు వెళ్లే వారికి యూజ్ ఫుల్ గా ఉంటాయి. అనుకోకుండా వర్షం కురిసినా కూడా రెయిన్ కవర్ మీ వద్ద ఉన్నట్లైతే మీ బ్యాగు అందులోని వస్తువులు సేఫ్ గా ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్స్ పై 78 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇసిరోనా బ్యాగ్ కవర్ అసలు ధర రూ. 399గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 89కే సొంతం చేసుకోవచ్చు. వర్షం నుంచి దుమ్ము ధూళి నుంచి మీ బ్యాగును రక్షిస్తుంది. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ 100 శాతం వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తో వస్తుంది. అడ్జస్టబుల్ బకిల్, స్టర్బీ ఎలాస్టిక్, అడ్జస్టబుల్ హుక్ తో వస్తుంది. ఈ రెయిన్ కవర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్యాగుల కోసం ఏఆర్ఎస్ రెయిన్ కవర్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 499 ఉండగా 68 శాతం డిస్కౌంట్ తో రూ. 160కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తక్కువ ధరలో బోల్డ్ ఫిట్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 50 శాతం డిస్కౌంట్ తో 399 విలువ గల రెయిన్ కవర్ 199కే వచ్చేస్తోంది. దీన్ని మీరు కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
రాజమౌళి కెమెరా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడని వెల్లడి
SS Rajamouli టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రాజమౌళి దర్శక ప్రస్థానంపై తాజాగా రూపొందించిన మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీలో ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ డాక్యు ఫిలింలో జక్కన్న గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
SS Rajamouli
రాజమౌళి అద్భుతమైన నటుడు అని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. చిత్రీకరణ సమయంలో నటీనటులకు సీన్లను వివరించేటప్పుడు రాజమౌళి చాలా గొప్పగా నటించి చూపిస్తారని వివరించారు. అయితే కెమెరా ముందుకు వచ్చి నటించడానికి మాత్రం జక్కన్న ఎప్పుడూ ఆసక్తి చూపించడని ఎన్టీఆర్ తెలిపారు.
ఓ సన్నివేశం గురించి తాము ఏమనుకుంటున్నారో దాన్ని కళ్లకు కట్టినట్టు వివరించగల అతి కొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి ఒకరని అభివర్ణించారు. “రాజమౌళి చెబుతుంటే మీరు ఉద్విగ్నతకు గురవుతారు, మీరు చూపు కూడా తిప్పుకోలేరు, మీకు తెలియకుండానే ఆ సన్నివేశం తాలూకు భావాలు మీ ముఖంలో ప్రత్యక్షమవుతాయి… అంతగా మిమ్మల్ని సన్నివేశంలో లీనం చేస్తాడు” అని ఎన్టీఆర్ వివరించారు.
Gold and Silver Prices Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
Gold and Silver Prices Today
Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
బంగారం గురించి..
బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్ (Gold Coins), బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.
నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.
బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది.
కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.
Dog Attack : గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులుగా వీధుల్లో తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎక్కువగా దాడి చేసి తీవ్రంగా గాయపడుతున్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటన ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి ఒంటరిగా జీవిస్తోంది. రాత్రి భోజనం చేసి తన పూరిపాకలో మంచం మీద పడుకుంది. అర్ధరాత్రి కుక్కలు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి రాజ్యలక్ష్మిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. రాజ్యలక్ష్మి గట్టిగా కేకలు వేసిన రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కుక్కల దాడిలో లక్ష్మి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మి మృతదేహాన్ని చూసి.. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామస్తులు వణికిపోతున్నారు. వీధికుక్కలు ఇంట్లోకే చొరపడి దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dog Attack
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కాలనీలో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల అశ్విత, ఏడాదిలోపు చిన్నారి రిషిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన ఇద్దరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏడాదికి ఒక్కసారైనా కుక్కలను పట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి అధికారులు హడావుడి చేస్తున్నారని, వాటిని అడ్డుకునేది లేదని వాపోయారు. ఆసిఫాబాద్ జిల్లా ఖగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ కాలనీ, తైబానగర్, అశోక్ కాలనీ, ఓల్డ్ కాలనీ, ఇందిరా మార్కెట్ కాలనీల్లో రెండు రోజుల్లో 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.