Indian2 OTT ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.
Indian2 OTT
Indian2 OTT గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ నిర్మాతలకు సదురు ఓటీటీ సంస్థలకు తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు -2 వివాదం ముగిసిందని సమాచారం. ఇక మరోవైపు ఇండియన్ -2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే. దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం,థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ -2 ను ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
Delhi Rains దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.
Delhi Rains
దిల్లీ: దేశ రాజధాని నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ దిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిల్లీకి రావాల్సిన పలు విమానాల దారి మళ్లించినట్లు సమాచారం. రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు రాడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు, రావూస్ అకాడమీలో ముగ్గురు సివిల్స్ విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్ రాజిందర్నగర్లో సివిల్స్ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇటీవల ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ మోకాళ్లలోతు నీరు నిలిచిపోగా.. అందులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడంతో స్థానిక పోలీసులకు కొందరు విద్యార్థులు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమ్ఆద్మీ పార్టీ ఎక్స్లో పోస్టు చేసింది.
SC ST Reservations SC Judgement ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
april 27, 2026, 3:54 pm - duniya360
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగిన విషయం తెలిసిందే. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
వర్గీకరణ తప్పనిసరి అని కోర్టు తీర్పు
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ
SC ST Reservations SC Judgement ఎస్సీ ,ఎస్టీ రిజర్వేషన్ల కేసు బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ..
ఎస్సీ , ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించి ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో బీజం పడింది. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ను అమలు చేసింది. అయితే మాలమహనాడు వర్గీకరణను వ్యతిరేకించింది.. హైకోర్టులో న్యాయపోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేఖించింది. వివక్ష, వెనుక బడిన వాళ్లందరిని ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి.
అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధం అవడంతో అక్కడి హైకోర్టు సుప్రీం కోర్టులోని 2004 కేసుకు రిఫర్ చేసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం క్యాబినేట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. దాంతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటూ సుప్రీం కోర్టులో సుదీర్గ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8 న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈమేరకు తీర్పు వెలువడింది. ఏళ్ల కల నెరవేరింది.
Thalliki Vandanam Scheme Check Eligibility, Benefits and Application Process 2024 | చంద్రబాబు నాయుడు తన 2024 మానిఫెస్టోలో “తల్లికి వందనం” కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి 9 విద్యను కొనసాగించేందుకు సంవత్సరానికి రూ. 15,000 అందించడం ద్వారా, ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్ యువతకు మెరుగైన భవిష్యత్ సృష్టించడంలో టీడీపీ పార్టీ యొక్క ప్రతిబద్ధతను ప్రదర్శిస్తుంది. తల్లికి వందనం పథకం విద్యనే అభివృద్ధికి అడ్డంగా భావించే టీడీపీ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రతీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా, టీడీపీ సమాన అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Thalliki Vandanam Scheme
ఈ కార్యక్రమం రాష్ట్ర యువతను ఆర్ధిక పరిమితుల ద్వారా తగిలించకుండా తమ కలలను అనుసరించడానికి శక్తినిస్తుంది. ఈ దూరదృష్టి ప్రాజెక్ట్ ప్రతి పిల్లవాడి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉత్తమమైన, ధనికమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
Thalliki Vandanam Scheme వివరాలు
తల్లికి వందనం పథకం వివరాలు
Name of the scheme
Thalliki Vandanam Scheme
Launched by
The Telugu Desam Party (TDP)
Objective
To create a better future for young people through education
Mode
Online (application to be launched)
Beneficiaries
Students
Benefit
Rs. 15,000 per year per student
State
Andhra Pradesh
టీడీపీ పార్టీ ఎట్టకేలకు తమ పిల్లలను చదివించలేని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం Thalliki Vandanam Scheme ప్రారంభించింది 2024. తల్లికి వందనం పథకం 2024ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2024ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు డబ్బు గురించి చింతించకుండా తమ చదువును కొనసాగించవచ్చు. తల్లికి వందనం స్కీమ్ 2024 1 నుండి 12 తరగతులలో నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ రెగ్యులర్ ప్రాతిపదికన ట్యూషన్ చెల్లించలేని వారికి అందుబాటులో ఉంటుంది. తల్లికి వందనం పథకం 2024 కింద ఎంపిక కోసం పరిగణించాలనుకునే వారు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తును పూర్తి చేయాలి.
అర్హత ప్రమాణం
దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడిగా ఉండాలి.
దరఖాస్తుదారు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
అవసరమైన పత్రాలు
ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్
పాన్ కార్డ్
రేషన్ కార్డు
ఓటరు గుర్తింపు కార్డు
కిసాన్ ఫోటో పాస్బుక్
వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత
ఆంధ్రప్రదేశ్ Thalliki Vandanam Scheme యొక్క ప్రయోజనాలు
తల్లికి వందనం పథకం యొక్క ప్రయోజనాలు తక్షణం మరియు సుదూరమైనవి:
ఆర్థిక సహాయం:- ప్రతి బిడ్డకు రూ. విద్యా ఖర్చులను కవర్ చేయడానికి సంవత్సరానికి 15,000.
సమానత్వాన్ని ప్రోత్సహించడం:- ఆర్థిక అడ్డంకులను తొలగించడం ద్వారా, పిల్లలందరికీ వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను పొందేలా ఈ పథకం నిర్ధారిస్తుంది.
దీర్ఘకాలిక ప్రభావం:- విద్యావంతులైన జనాభా ఆవిష్కరణ, ఆర్థిక పురోగతి మరియు సామాజిక సామరస్యానికి పునాది.
తల్లికి వందనం పథకం 2024 దరఖాస్తు ప్రక్రియ
తల్లికి వందనం స్కీమ్ కోసం దరఖాస్తు ప్రక్రియ సూటిగా ఉండేలా సెట్ చేయబడింది, అయితే అధికారిక వెబ్సైట్ను ప్రారంభించడంపై నిరంతరంగా ఉంటుంది. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అర్హత ఉన్న కుటుంబాలు వీటిని చేయాలి:
Big Rain Alert in Telugu States దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. గత నెల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, అస్సాం, తెలుగు రాష్ట్రాలతో పాటు కేళాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా డ్యాములు, చెరువులు నిండి పొంగిపొర్లుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులకు, కాల్వలకు గండ్లు పడి గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు నుంచి మరో మూడు రోజులు పలు జిల్లాల్లో భారీవర్షాలు పడే సూచన ఉందని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
Big Rain Alert in Telugu States
తెలుగు రాష్ట్రాల్లో ఒకటీ రెండు రోజులు తప్ప వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజలు నుంచి ఎడతేరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Big Rain Alert in Telugu States పశ్చిమ భారత్ లో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోనూ తుఫాన్ సుడి ఏర్పడిందని.. దీని ప్రభావంతో మూడు రోజుల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఏపీలో రుతుపవనాల ప్రభావం గట్టిగానే ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు, మత్స్యాకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Vizianagaram జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై పోలీసు హోంగార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. హోంగార్డును అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి… బొండపల్లి పోలీసుస్టేషన్లో డ్యూటీ చేస్తున్న హోంగార్డు మొయిద సురేశ్ మంగళవారం సాయంత్రం బైక్పై ఇంటికి బయలుదేరాడు. దారిలో కొండకరకం దగ్గర్లో.. ఓ లవ్ కపుల్ కనిపించడంతో వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను ఎస్సైని అని, ఇద్దరిపై కేసు బుక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రియుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
Vizianagaram
ఆ తర్వాత హోంగార్డు సురేశ్ ఆ యువతిని ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిస్తానని నమ్మించాడు. ఆపై బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తిరిగి ఆమెను రామతీర్థం సర్కిల్లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేశ్ను అరెస్టు చేశామని.. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా దాడికి ఆదేశాలు
హత్య జరిగిన వెంటనే ఇరాన్ అధినేత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం
ముగ్గురు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెలువడుతున్న కథనాలు
Ismail Haniyehs assassination హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలంటూ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇస్మాయిల్ హత్యకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిందని, ఈ భేటీలో అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ దాడికి ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ముగ్గురు అధికారులకు ఆదేశాలు వెళ్లాయని, ఇందులో ఇద్దరు రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంది.కాగా హమాస్ అధినేత ఇస్మాయిల్ హత్య ఇజ్రాయెల్ పనేనని ఇరాన్, హమాస్ బలంగా నమ్ముతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ప్రమేయం లేదని ఖండించింది. అయితే విదేశాలలో శత్రువులను మట్టుబెట్టిన చరిత్ర ఇజ్రాయెల్కు ఉండడంతో ఇస్మాయిల్ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ విశ్వసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
Ismail Haniyehs assassination
హమాస్ చీఫ్ హతం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. మంగళవారం టెహ్రాన్లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లారు.
Ismail Haniyehs assassination కాగా ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి దగ్గరగా వచ్చి వెనక్కి తగ్గాయి. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ కారణమంటూ ప్రతీకారంగా వందలాది క్షిపణులు, డ్రోన్తో ఇరాన్ దాడి చేసింది. వీటిని ఇజ్రాయెల్ ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.
Paris Olympics 2024 పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్లో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ పతకాలు సాధించినందుకు భారత్ అథ్లెట్లకు ఎంత రివార్డ్ ప్రకటించాయో ఇప్పుడు చూద్ధాం.
Paris Olympics 2024
భారతదేశంలో పతక విజేతలకు ఎంత డబ్బు వస్తుంది?
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన వారి క్రీడాకారులకు కనీసం 33 దేశాలు నగదు బహుమతులు ఇస్తాయి. వీటిలో 15 దేశాలు గోల్డ్ మెడల్ కోసం $1,00,000 (సుమారు రూ. 82 లక్షలు) కంటే ఎక్కువ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయి. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.
ఏ దేశం ఎక్కువ మొత్తం ఇస్తుంది?
Paris Olympics 2024 ఒలింపిక్ పతక విజేతలకు అత్యధిక రివార్డులు ఇచ్చే దేశం హాంకాంగ్. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్లో పాల్గొంటున్న హాంకాంగ్, బంగారు పతకానికి 768,000 డాలర్లు (దాదాపు రూ. 6.3 కోట్లు) చెల్లిస్తుంది. రజత పతకాలు సాధించిన అథ్లెట్లకు $380,000 (దాదాపు రూ. 3.1 కోట్లు) ఇస్తుంది. బంగారు పతకం కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఇజ్రాయెల్ 2,75,000 డాలర్లు (దాదాపు రూ. 2.2 కోట్లు) ఇస్తుంది. పెద్దమొత్తంలో నగదు ఇవ్వడంలో ఇజ్రాయెల్ రెండోస్థానంలో నిలిచింది. సెర్బియా 218,000 డాలర్లు (దాదాపు రూ. 1.8 కోట్లు)తో మూడో స్థానంలో ఉంది. ఆసక్తికరంగా, ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు 2021 టోక్యో గేమ్స్లో బంగారు పతకాలను గెలుచుకున్నారు.
Swiggy Veg Orders ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ (Swiggy) తాజా నివేదికలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలామంది మాంసాహారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, పలు నగరాల్లో శాకాహారాన్ని అత్యధికంగా ఆర్డర్ చేసుకుంటున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ముంబయి, హైదరాబాద్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Swiggy Veg Orders
దేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును ‘వెజ్జీ వ్యాలీ’గా స్విగ్గీ పేర్కొంది. తమకు దేశవ్యాప్తంగా వచ్చిన శాకాహార ఆర్డర్లలో మూడింట్లో ఒకటి ఈ నగరం నుంచి వచ్చినట్లు తెలిపింది. మసాలా దోస, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలాను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఇక ముంబయి రెండో స్థానంలో నిలిచింది. దాల్ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ వాసులు మసాలా దోస, ఇడ్లీని ఆస్వాదిస్తున్నారట.
Swiggy Veg Orders దేశంలో స్విగ్గీ స్వీకరిస్తున్న ఆర్డర్లలో టాప్ 10 వంటకాల్లో.. తొలి 6 స్థానాల్లో శాకాహార వంటకాలే ఉండడం విశేషం. వీటిలో మసాలా దోస, పన్నీర్ బటర్ మసాలా, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీ టాప్లో నిలిచాయి. వారంలో 60 వేల వెజ్ సలాడ్ ఆర్డర్లను స్విగ్గీ అందుకుంటోంది.
Squid Game Season 2 – 2021లో వచ్చిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచం మెుత్తాన్ని ఉర్రూతలూగించింది. మూడేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. ఇక సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. సీజన్ 2 శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?
Squid Game Season 2
‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ.. సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తొలి సీజన్ లాగే తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం అంటే 2025లో సీజన్ 3 తీసుకొస్తామని, అలాగే ఈ సిరీస్ కు ముగింపు పలుకుతామని తెలిపింది.
Squid Game Season 2 కాగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1ను 9 ఎపిసోడ్స్ తో తీశారు. 2021లో వచ్చిన ఈ సిరీస్ మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. క్షణక్షణం ఉత్కంఠ రేపే సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలుగించింది. అప్పట్లో మోస్ట్ పాపులర్ సిరీస్ గా నిలిచింది. చిన్న చిన్న గేముల్లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్స్ చేసే పోరాటాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కావడంతో.. అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి మీలో ఎంత మంది స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.