Home Blog Page 67

Student Kit App Latest Version Download Now

Student Kit App Latest Version ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖకు సంబంధించిన Student Kit App అప్డేటెడ్ లేటెస్ట్ వెర్షన్ యాప్ ను ఈ పేజీ నుండి డౌన్లోడ్ చేసుకొండి.

school apps latest version

School Apps Latest Version main website Click Here

School App Latest Version Download

  • Download Now Click Here
  • Version: 1.6.2
  • Date: 31.07.2024

IND vs SL : శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌.. హాట్‌స్టార్‌, జియో సినిమాలో రాదు.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

0

India vs Sri Lanka : శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్ల రాక‌తో భార‌త జ‌ట్టు బ‌లం పెరిగింది.

IND vs SL

ఇక హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌తోనే విజ‌యాన్ని అందుకున్న గౌత‌మ్ గంభీర్ వ‌న్డే సిరీస్ పై ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల‌ను మొద‌లు పెట్టాడు. మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను సైతం వైట్‌వాష్ చేయాల‌ని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.

IND vs SL స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరుకుంది. ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఆడుతున్న తొలి వ‌న్డే సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు లంక జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది.

ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఎక్క‌డంటే..?
భార‌త జ‌ట్టు విదేశాల్లో ఆడే మ్యాచుల‌కు సంబంధించిన హ‌క్కులు అన్నీ సోనీ నెట్‌వ‌ర్క్‌ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. ఓటీటీలో సోనీ లివ్ లో ప్ర‌సారం అవుతాయి.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో శ్రీలంక వ‌న్డే సిరీస్ రాదు. కేవ‌లం సోనీ లివ్ ఓటీటీలో మాత్ర‌మే చూడొచ్చు. అయితే.. ఇందుకు స‌బ్‌స్ర్కిప్ష‌న్ తీసుకోవాలి. అయితే.. మొబైల్‌లో ఫ్రీగా చూడాల‌నుకుంటే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు. జియో టీవీ యాప్‌లో ఛానెల్స్‌లో సోనీ టీవీ నెట్ వ‌ర్క్ ఛానెల్స్‌ను ఎంచుకోని వ‌న్డే సిరీస్‌ను ఉచితంగా చూడొచ్చు.

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌..

తొలి వన్డే – ఆగస్ట్ 2
రెండో వన్డే – ఆగస్ట్ 4
మూడో వన్డే – ఆగస్ట్ 7

IND vs SL జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు మొత్తం కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Maharaja Movie కి విజయ్ సేతుపతి రెమ్యూనరేషనే తీసుకోలేదు! కానీ.. కోట్లలో లాభం!

Maharaja Movie వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. కంటెంట్ ఉన్న వాడికి హ్యాండ్సమ్ లుక్, ఫిట్నెస్ బాడీ ఉండనక్కర్లేదని నిరూపించిన హీరో. కేవలం హీరో ఇమేజ్‌కు కట్టుబడిపోలేదు. విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అలరిస్తున్నాడు. దక్షిణాది పరిశ్రమను చుట్టేసిన అతడు.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేరీ క్రిస్మస్, మహారాజ చిత్రాలతో పలకరించాడు. ఇందులో మహరాజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్లను అందుకుంది. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 110 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్ రాబట్టుకుంటుంది.

Maharaja Movie

అయితే ఈ సినిమాలో నటించేందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేద విజయ్ సేతుపతి. ఇక ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కానీ కథ కీ రోల్ ప్లే చేసింది. ఇందులో సెలూన్ షాపులో పనిచేసే బార్చర్‌గా ఆకట్టుకున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. కూతురు అంటే పంచ ప్రాణాలతో బతికే అతడు పోలీసుల దగ్గర చేసే డ్రామా, విలన్ల కోసం అతడు వేసే ప్లాన్ ఈ మూవీకి హైలెట్. లైంగిక వేధింపుల గురించి ఈ మూవీలో చూపించాడు దర్శకుడు నితిలన్ స్వామి నాథన్. ఈ మూవీని కేవలం రూ. 20 కోట్లు పెట్టి తెరకెక్కించారు సుధన్ సుందరం, జగదీష్ పళని స్వామి. ఇంతే బడ్జెట్‌తో సినిమా తీస్తామని నిర్మాతలు విజయ్ సేతుపతికి చెప్పగా ఓకే చెప్పారట. లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారట. దీనికి ఓకే చెప్పాడట విజయ్.

Maharaja Movie ఇప్పుడు 20 కోెట్ల రూపాయలను పెట్టి సినిమా తీస్తే భారీ హిట్ అందుకోవడమే కాదు వసూళ్లను రాబట్టుకుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సాధారణంగా విజయ్ సేతుపతి సాధారణంగా ఒక్కో మూవీకి రూ. 10-12 కోట్లు తీసుకుంటాడని టాక్ నడుస్తుంది. కానీ లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఆయనకు భారీగా ముట్టనున్నట్లు తెలుస్తుంది. దీంతో నక్కతోక తొక్కినట్లయ్యింది. ఇక విజయ్ సేతుపతి మూవీల విషయానికి వస్తే.. గాంధీ టాక్స్ అనే మూవీతో పాటు విడుదలై పార్ట్ 2లో నటించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే ఫర్జీ వెబ్ సిరీస్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన ఈ వర్సటైల్ నటుడు.. ఇప్పుడు మరికొన్ని కథలను వింటున్నట్లు తెలుస్తుంది.





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Satya Sri Jabardasth ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!

0

Satya Sri Jabardasth హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు వేసి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి నవ్వించారు. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పాలంటే ఒకటో.. రెండో సినిమాలు చెప్తే సరిపోదు. ఆయన నటించిన సినిమాలన్నీ చెప్పాలి.. సినిమా సినిమాకు ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. అలాగే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు, సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పెద్దరాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Satya Sri Jabardasth

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అలాగే మోహన్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది.

ఈ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. సత్య శ్రీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. చమ్మక్ చంద్ర స్కిట్స్‌లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వుస్తుంది. ఆ మధ్య జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆతర్వాత తిరిగి జబర్దస్త్ లోకి వచ్చి ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోంది. సత్య శ్రీ తల్లి పెద్దరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో  సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సత్య శ్రీ సోషల్ మీడియా

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ

AP CM Chandrababu : ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు. గత ఐదేళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్ష చేపట్టారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ. 1025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు.

AP CM Chandrababu

దీనిపై కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై చర్చలు జరిపారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కవ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా.. కొత్తగా ఏఏ విధానాలు అవలంభించవచ్చనే అంశంపై అధికారులతో సమీక్షించారు. రీచ్ నుంచి నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని సీఎం పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని.. వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులను AP CM Chandrababu ఆదేశించారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Devara Second Song దేవర సెకండ్ సాంగ్ ఆ రేంజ్ లో! నాగవంశీ ట్వీట్ వైరల్!

Devara Second Song తారక్ ఈ మధ్య చేసినవన్నీ కూడా యాక్షన్ థ్రిల్లర్స్ ఏ ఉన్నాయి. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ లో క్యూట్ యాంగిల్ ను చూశారు ప్రేక్షకులు.. ఇక ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలే. ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా కాలమే అయింది. దీనితో ప్రేక్షకులంతా కూడా తారక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Devara Second Song

తాజాగా నాగవంశీ తారక్ ను ట్యాగ్ చేస్తూ.. “తారక్ ను ఇలా చూసి ఆరేళ్ళు అయింది కదా.. మళ్ళీ అలా క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈసారి.. మనకి ఇదే సరిపోతుంది కదా” అంటూ అరవింద సామెత రాఘవ సినిమాలోని ఫొటోస్ ను షేర్ చేశారు. దీనితో ఈ సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగిపోయింది. చూడబోతుంటే ఈ సినిమా నుంచి నెక్ట్ వచ్చే సాంగ్ అప్ డేట్.. ఇలాంటి లవ్ , రొమాన్స్ యాంగిల్ లోనే ఉంటూ.. వింటేజ్ తారక్ ను గుర్తుచేస్తుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే .. ఈసారి తారక్ లుక్స్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే . ప్రస్తుతం నాగవంశీ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతోంది. మూవీపై నెక్ట్ అప్ డేట్ ఏంటా ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ట్వీట్ తో సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచేశాడని చెప్పి తీరాల్సిందే . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ .

Devara Second Song ఇక అంతే కాకుండా.. జాన్వీ కపూర్ కూడా లేటెస్ట్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో.. దేవర మూవీ షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ పోస్ట్ ను కూడా షేర్ చేసింది. ఒక్కొక్కటిగా ఈ సినిమా నుంచి వస్తున్న న్యూస్ చూస్తుంటే.. ప్రేక్షకులు ఊహించిన దానికంటే కూడా.. నెక్ట్ లెవెల్ లో మూవీ ఉండబోతుందేమో అనే అంచనాలు.. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాగా సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకున్న తేదీ ప్రకారం రిలీజ్ అయితే కనుక.. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ కు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. మరి లేటెస్ట్ గా నాగ వంశి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

anna @tarak9999 ni ila cute chusi 6 years ayindhi kada … malli aa cute ga smile chesthu romance cheyatam chustharu ee sari… Manaki ade saripothundhi kada🤪 🤩 pic.twitter.com/vT5jAnCu9r

— Naga Vamsi (@vamsi84) July 31, 2024

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


10th Qualification Jobs ఉంటే చాలు? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీవే.. నెలకు 69 వేల జీతం

10th Qualification Jobs ఆర్థిక పరిస్థితి కారణంగా చాలామంది టెన్త్ పూర్తవగానే చదువు మానేస్తుంటారు. ప్రతిభ ఉన్నా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవతుంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుంటారు. పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు టెన్త్ పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. టెన్త్ అర్హతతో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) పలు ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

10th Qualification Jobs

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌లో నాన్‌ మినిస్టీరియల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. పురుష, మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 18 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 51.

పోస్టుల వివరాలు:

  • కానిస్టేబుల్‌(టైలర్‌)–18, కానిస్టేబుల్‌(కోబ్లర్‌)–33.

10th Qualification Jobs అర్హత:

  • టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత­తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18.08.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు రూ.21,700 నుంచి రూ.69,100

దరఖాస్తు ఫీజు:

  • అన్ రిజర్వ్డ్, ఈడబ్య్లూఎస్ వారు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది:

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ సినిమా ఓటీటీలోకి.. ఎందులో.. ఎప్పట్నించి..?

Payal Rajput Rakshana Movie : పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘రక్షణ’ అనే సినిమాతో జూన్ 7న థియేటర్స్ లో ప్రేక్షకులని పలకరించింది. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్, రాజీవ్ కనకాల.. పలువురు ముఖ్య పాత్రల్లో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రక్షణ సినిమా తెరకెక్కింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించింది.

Payal Rajput

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. రెగ్యులర్ గా ప్రతి వారం కొత్త సినిమాలు అందించే తెలుగు ఓటీటీ ఆహాలో ఆగస్టు 1 నుంచి రక్షణ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆహా ఓటీటీలో భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ ద్వారా రక్షణ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రక్షణ సినిమాని థియేటర్స్ లో మిస్ అయితే ఆహా ఓటీటీలో ఆగస్టు 1 నుంచి చూసేయండి.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Karnataka Health Minister : జైపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే

0

Karnataka Health Minister శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది. జైపూర్‌ నుంచి బయలుదేరిన రైలులో 90 కంపార్ట్‌మెంట్లలో మూడు టన్నుల బరువున్న మాంసం లభ్యమైంది. సమాచారం అందుకున్న గో సంరక్షకులు స్టేషన్‌కు చేరుకుని కుక్క మాంసం అంటూ నానా హంగామా చేశారు.

Karnataka Health Minister

కాగా.. పోలీసు శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి 84 మాంసం నమూనాలను సేకరించారు. జంతువుల జాతులకు సంబంధించిన విశ్లేషణ కోసం నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. జంతు మాంసం రవాణా ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధన సంస్థకు పంపించారు. ఇక్కడి నుంచి వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఆ మాంసం గొర్రెలదేనని నిర్ధారించారు.

Karnataka Health Minister  ఈ కేసులో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మాంసం రవాణాపై మొదటి ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ పనిని అడ్డుకున్నందుకు గోసంరక్షకుడిపై రెండవ ఎఫ్‌ఐఆర్.. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో గుమిగూడినందుకు గోసంరక్షకుడు, అతని సహచరులపై మూడవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిరోహి అనే ప్రత్యేక మేక జాతికి చెందిన మాంసం అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారి తెలిపారు. ఇది సాధారణంగా రాజస్థాన్.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో లభిస్తుంది. అయితే.. కర్ణాటకలో మటన్ సరఫరా తక్కువగా ఉండడంతో కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Wayanad Landslides : వరద భయం.. వీరిని వెంటాడింది.. వారిని కాపాడింది..!

0

Wayanad Landslides : వరద భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లి ఓ కుటుంబం కొండచరియల కింద నలిగిపోగా.. అదే భయం ఓ కుటుంబం నిండు ప్రాణాలు కాపాడింది. కేరళ (Kerala)లోని వయనాడ్‌లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులో (Wayanad Landslides) వెలుగుచూస్తున్న ఇలాంటి మానవీయ కథనాలు ఎందరో మనసుల్ని మెలిపెడుతున్నాయి.

Wayanad Landslides బంధువుల ఇంటికెళ్లి..

వయనాడ్‌ జిల్లాలోని చూరాల్‌మలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించే అవకాశం ఉందని ఈ ప్రాంతంలోని ఓ కుటుంబం భయపడింది. విపత్తు నుంచి తప్పించుకునేందుకు సోమవారం ముండక్కై సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. కానీ మృత్యువు వీరిని వదల్లేదు. కొండచరియల రూపంలో బలితీసుకుంది. ముండక్కై వద్ద మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ కుటుంబంలోని మొత్తం 11 మంది చిక్కుకుపోయారు. వీరిలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికి తీశారు. మిగతా 8 మంది ఎక్కడున్నారో ఇంకా ఆచూకీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

కుటుంబాన్ని కాపాడిన ఆమె ఆందోళన..

Wayanad Landslides ఇక, ముండక్కై గ్రామానికి చెందిన మహమ్మద్‌ అలీస్‌ కుటుంబం త్రుటిలో ఈ పెను విపత్తు నుంచి బయటపడింది. వర్షాల కారణంగా విపత్తును ముందే ఊహించిన అలీస్‌ భార్య షకీరా అక్కడి నుంచి వెళ్లిపోదామని పట్టుబట్టింది. తొలుత కుటుంబసభ్యులెవరూ ఆమె మాటలు పట్టించుకోలేదు. కానీ, తీవ్రంగా ఒత్తిడి చేయడంతో సోమవారం రాత్రి 16 కిలోమీటర్ల దూరంలోని మెప్పడికి వెళ్లి అక్కడ ఓ సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారు.

వారు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్క అలీస్‌ నివాసం మినహా వీరి చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లు కూలిపోయాయి. ప్రస్తుతం తమ ఇళ్లు శిథిలాలు, బురదలో కూరుకుపోయిందని, తన భార్య ఆందోళనే తమ కుటుంబం ప్రాణాలు కాపాడిందని అలీస్‌ తెలిపారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.