Dream Nude Women రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుడా మనకు వచ్చే కలలు మన జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు. స్వప్నశాస్త్రంలో కూడా దీనికి సంబంధించి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అలాగే మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
Dream Nude Women
అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు వచ్చే కలలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అప్రయత్నంగా వచ్చే కలలో ఎంతో అర్థం ఉంటుందని అంటున్నారు. మరి రాత్రి పడుకున్న తర్వాత కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న యవతి కనిపిస్తే దేనికి సంకేతం.? జీవితంలో ఏం జరగబోతోందని అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఒకవేళ కలలో మీకు స్త్రీ దుస్తులు లేకుండా కనిపిస్తే మీకు నచ్చిన వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. మీకు నచ్చిన వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం.
* ఇక స్త్రీ తనను తాను నగ్నంగా చూసుకున్నట్లయితే.. తన గురించి ఏదో రహస్యాన్ని దాచిపెడుతోందని అర్థం. ఎవరికీ తెలియని ఏదో రహస్యం తనలో ఉంచుకుంటోందని అర్థం చేసుకోవాలి.
* పురుషులు తనకు నచ్చిన స్త్రీని నగ్నంలో కగలో చూస్తే.. ఆ స్త్రీ పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు మానసికంగా ఆమెకు ఎంతగానో దగ్గరయ్యారని భావం.
* నగ్నంగా ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఉంటుందని అర్థం. అలాగే కొంత కాల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభించనుందని అర్థం చేసుకోవాలి.
* ఒకవేళ మీకు కలలో అపరచిత వ్యక్తి నగ్నంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తే.. మీరు త్వరలోనే ప్రేమలో లేదా వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయని అర్థం చేసుకోవాలి.
* అయితే ఎవరైనా స్త్రీ నగ్నంగా ఉన్న సమయంలో దుస్తులతో కవర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తే.. అది మహిళలపై మీకున్న అభిప్రాయానికి చిహ్నంగా భావించాలి. మీరు మహిళల విషయంలో ఎంతో హుందాగా ఉంటారని అర్థం.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
పిటిషన్పై విచారణ జరుగుతుండగా, మీడియా సమావేశాలను నిర్వహించారంటూ ఆరోపణలు
ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ హైకోర్టులో పిల్
పిల్ను పరిశీలించిన హైకోర్టు సీజే ధర్మాసనం
AP High Court ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ .. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుండగానే తెలంగాణ రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీలో స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశాలను నిర్వహించారు.
AP High Court
ఈ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓ పక్క న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్పై విచారణలు జరుగుతుండగా, వీరు మీడియా సమావేశాలను నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిల్ ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం .. సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
IND vs SL టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన తర్వాత.. శ్రీలంకతో వన్డే సిరీస్కు రెడీ అయింది టీమిండియా. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన జోష్లో టీమిండియా ఉంటే.. టీ20 సిరీస్లో ఎదురైన ఓటమికి వన్డే సిరీస్లో బదులు తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్లో శ్రీలంక టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి లంకతో తొలి వన్డలో భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
IND vs SL
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు.. వన్డే, టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీల్లో కనిపించనున్నారు. టీ20 ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత.. తొలిసారి కోహ్లీ, రోహిత్ గ్రౌండ్లోకి దిగబోతుండటంతో భారత క్రికెట్ అభిమానులు కూడా ఈ సిరీస్పై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిద్దరు రావడంతో భారత వన్డే జట్టు సూపర్ స్ట్రాంగ్గా మారింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా టీమ్లోకి రావడంతో బ్యాటింగ్లో డెప్త్ పెరిగింది.
IND vs SL మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్తో బౌలింగ్ యూనిట్ కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఇక ఆల్రౌండర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర ఉండటం అదనపు బలం. మొత్తంగా.. ఒక బెస్ట్ టీమ్తో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మరో వైపు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సొంత గడ్డపై వాళ్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. టీ20 సిరీస్లో ఓడిపోయినంత మాత్రానా.. వన్డే సిరీస్లోనూ లంకను లైట్ తీసుకుంటే.. ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Nanditha Jennifer ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. 2005 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నటుడు శ్రీహరి అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా
రీమేక్ అయ్యింది. ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో వీరితో పాటు చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.
Nanditha Jennifer
ఇక ఈ సినిమాలో సిద్దార్థ్ ను ఇష్టపడే అమ్మాయిగా అతని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించే అమ్మాయిగా కనిపించిన నటి ఎవరో తెలుసా.? ఆమె పేరు నందిత జెన్నిఫర్. తెలుగులో ఒక ఒక్క సినిమా చేసింది. కానీ తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది. అలాగే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది ఈ అమ్మడు. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోల్లోనూ నటించింది ఈ అమ్మడు. పవిత్ర, వేర్ ఇస్ విద్యాబాలన్, నా రూట్ సెపరేట్ అనే సినిమాల్లో సాంగ్స్ లో గెస్ట్ గా కనిపించింది.
Nanditha Jennifer పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు 2007లో కాశీవిశ్వనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక సోషల్ మీడియాలో నందిత జెన్నిఫర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో నటిస్తుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో గ్లామర్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట చీరకట్టులో అదరగొడుతోంది.
AP DSP Transfers పీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగారన్న అభియోగాలు ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ (హెడ్ క్వార్టర్స్) కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివాద రహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీతో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
AP DSP Transfers
వైసీపీ హయాంలో లూప్ లైన్ లో, అప్రాధాన్యత విభాగాల్లో కొనసాగుతూ వచ్చిన డీఎస్పీలకు ఈ సర్కార్ లో కీలక పోస్టింగ్ లు, సబ్ డివిజన్ లను కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో .. టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Israel hamas coflict ఇజ్రాయెల్తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యతో మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముంటున్నాయా? ఇంతకీ ఎవరీ హమాస్ చీఫ్ హనియే. ఎందుకు ఇజ్రాయెల్ అతడిని వెంటాడి.. వేటాడి మట్టుబెట్టింది? దీనిపై ఇరాన్ ఎలా స్పందించనుంది..? ఇజ్రాయెల్పై ప్రతీకారానికి ఇరాన్ పథకరచన చేస్తోందా? దాన్ని తిప్పికొట్టేందుకే ఇజ్రాయెల్ ఇలా అగ్రనేతలను టార్గెట్ చేస్తోందా? అసలేం జరుగుతోంది?
శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇజ్రాయెల్ Israel hamas coflict
గాజాలో మిలిటెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది ఇజ్రాయెల్. వరుస ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు ఇరాన్లోనే హమాస్ చీఫ్గా ఉన్న ఇస్మాయిల్ హనియెను మట్టుబెట్టింది. దీంతో గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న హమాస్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిది. హమాస్ సంస్థ చీఫ్.. 62 ఏళ్ల ఇస్మాయిల్ హనియె ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. హమాస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది. టెహ్రాన్లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియె, ఆయన బాడీగార్డ్ ఇద్దరూ మృతి చెందారు. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్ ఇలా దాడులకు దిగి హమాస్ చీఫ్ను హతమార్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
హమాస్లో కీలక పాత్ర
Israel hamas coflict ఇస్మాయిల్ హనియె 1963లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో పుట్టాడు. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్లో చేరాడు హనియె. 1989లో పాలస్తీనా మొదటి తిరుగుబాటు అణచివేత సమయంలో హనియెను ఇజ్రాయెల్ మూడేళ్లపాటు జైల్లో పెట్టింది. 1990లో తొలిసారిగా హనియె పేరు వెలుగులోకి వచ్చింది. 1992లో మరికొంతమంది హమాస్ నాయకులతో పాటు బహిష్కరణకు గురైన హనియె.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. ఏడాది బహిష్కరణ తర్వాత గాజాకి తిరిగి వచ్చారు. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్కు హనియె అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలిస్తూ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో అనేక హోదాల్లో పనిచేశాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమయ్యాడు. ఆ తర్వాత.. హమాస్లో కీలక పాత్ర పోషించాడు హనియె.
హమాస్ శిబిరంలో కలవరం
జాతీయ ఎన్నికల్లో హమాస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న తర్వాత, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ 2006లో హనియెను పాలస్తీనా ప్రధాన మంత్రిగా నియమించారు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్ను పాలించాడు. వారం రోజుల హింసాకాండ కారణంగా ఏడాదికే ఆయన తన పదవిని కోల్పోయారు. 2007 జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. తన పదవి నుంచి తొలగించడం ”రాజ్యాంగ విరుద్ధం” అంటూ తిరస్కరించారు. పాలస్తీనా ప్రజలపై తమ బాధ్యతలను, తమ ప్రభుత్వం విస్మరించదంటూ గాజాలో పాలన కొనసాగించారు. అప్పట్నుంచి గాజాలో ఫతా-హమాస్ యుద్ధం జరుగుతోంది. దీంతో అబ్బాస్ ఆదేశాలను పక్కనపెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో కొనసాగాడు హనియె.
Israel hamas coflict 2017 మే 6న హమాస్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో గాజా స్ట్రిప్ను వీడి అప్పటి నుంచి ఖతర్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియె ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది. కుటుంబసభ్యులను కోల్పోయినా ఇజ్రాయెల్పై పోరాటం ఆగద్దొని అప్పట్లో హనియె అన్నాడు. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఇతడు కీలకంగా వ్యవహరించిన హనియెను ఇప్పుడు ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో హమాస్ శిబిరంలో కలవరం మొదలైంది.
మరోపక్క ఈ హత్యతో అంతర్జాతీయంగా మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. తమదేశంలో అతిథిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది. అదే జరిగితే ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే ఎక్కువ. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపింది.
లెబనాన్కుఇజ్రాయెల్ వార్నింగ్
Israel hamas coflict హనియె హత్యతో ఇజ్రాయెల్ లెబనాన్కు కూడా గట్టి హెచ్చరికలే పంపింది. ఈమధ్యే ఇజ్రాయెల్ లోని గోలన్ హైట్స్ మజ్దాల్ షమ్స్ ఫుట్బాల్ మైదానంపై లెబనాన్ రాకెట్ దాడులకు దిగింది. ఈ ఘటనలో 12 మంది పిల్లలు చనిపోయారు. దీనికి కూడా తగిన బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్లో హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ, ఆయుధాల సరఫరా పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది. దీన్ని కూడా ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు హమాస్ చీఫ్ హత్యతో వీరికి కూడా డెత్ వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్.
ప్రతీకారం తీర్చుకుంటామన్న హమస్
Israel hamas coflict హనియె మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇది కుట్రపూరిత చర్య అని.. దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే దిశగా హెచ్చరికలు చేసింది హమాస్. ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ ఇస్మాయిల్ హనియె మృతి చెందాడని హమాస్ స్పష్టం చేసింది. అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ కూడా తీవ్రంగా ఖండించారు. హనియె మృతి కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తెలుసుకుంది. అయితే, వాటిపై స్పందించేందుకు మాత్రం శ్వేతసౌధం నిరాకరించింది.
Madhura Judgement Today మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది. అదే సమయంలో, ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాలను ఉదహరించి, హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది.
Madhura Judgement Today
Madhura Judgement Today మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో దాఖలైన 18 పిటిషన్లను కలిపి విచారించాలా వద్దా అనేది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు నిర్ణయించనుంది. హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించనుంది. అంతకుముందు.. జూన్ 6న విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. హిందూ పక్షం నుంచి 18 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో, ముస్లిం పక్షం ఆర్డర్.. 7, రూల్ 11 ప్రకారం ఈ పిటిషన్ల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. హిందూ, ముస్లిం వర్గాలకు ఈరోజు కీలకం కానుంది.
హిందూ పార్టీల వాదనలు…
రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈద్గా మొత్తం శ్రీకృష్ణుడి పవిత్ర క్షేత్రం.
షాహీ ఈద్గా మసీదు కమిటీ వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డు లేదు.
షాహి ఈద్గా మసీదు శ్రీ కృష్ణ ఆలయాన్ని కూల్చివేసి నిర్మించబడింది.
యాజమాన్య హక్కులు లేకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వక్ఫ్ బోర్డు ఈ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.
ముస్లిం పార్టీల వాదనలు
1968లో ఈ భూమిపై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని ముస్లిం పార్టీలు వాదిస్తున్నాయి.
60 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని తప్పు అనడం సరికాదు. అందువల్ల కేసు నిర్వహణ సాధ్యం కాదు.
ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం కూడా కేసు నిర్వహించబడదు.
Olympics 2024 Prize Money క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మతకంగా భావించే ఒలింపిక్స్ 2024 ప్రారంభం అయ్యింది. నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ వేడుకులకు ఈ సారి పారిస్ వేదికయ్యింది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొంటారు. ఇక ఈ ఏడాది మన దేశం నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు.. వేర్వేరు అంశాల్లో తమ సత్తా చాటడానికి పారిస్ వెళ్లారు. ఇప్పటికే మను బాకర్ రెండు పతకాలను ఇండియాకు అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. వీరిద్దరి సాధించిన విజయాల పట్ల దేశం యావత్తు పొంగిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Olympics 2024 Prize Money
అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి.. దేశం కీర్తిని ప్రపంచవేదికల మీద వేనోళ్ల పొగిడేలా చేసిన క్రీడాకారులకు, వారు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ.. ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. సుమారు 33 దేశాలు.. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందిస్తాయి. వీటిల్లో సుమారు 15 దేశాలు గోల్డ్ మెడల్ సాధించిన వారికి లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు 82 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చి ప్రోత్సాహిస్తాయి.
Olympics 2024 Prize Money ఇక ఇండియా విషయానికి వస్తే.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ).. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.
అయితే ఈ ఒలింపిక్స్ నాటికి ఐఓఏ ఈ ప్రైజ్మనీని పెంచింది. దీని ప్రకారం ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లలకు రూ.కోటి, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 75 లక్షలు, మిగతా వారికి 50 లక్షల రివార్డు అందించనుంది. ఇవి కాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా నగదు బహుమతి అందజేస్తాయి.
ఏ దేశం ఎక్కువ నగదు ఇస్తుందంటే..
ఒలింపిక్ పతక విజేతలకు అత్యధికంగా నగదు రివార్డు ఇచ్చే దేశం హాంకాంగ్. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్లో పాల్గొంటున్న హాంకాంగ్.. గోల్డ్ మెడల్ సాధించిన వారికి 7,68,000 డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ. 6.3 కోట్లు చెల్లిస్తుంది. అలానే రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు 3,80,000 అంటే దాదాపు రూ. 3.1 కోట్లు ఇస్తుంది. హాంకాంగ్ తర్వాత క్రీడాకారులకు పెద్ద మొత్తంలో నగదు రివార్డు ఇచ్చే మరో దేశం ఇజ్రాయేల్. ఈ దేశం ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు 2,75,000 డాలర్లు అంటే దాదాపు రూ. 2.2 కోట్లు ఇస్తుంది. ఆ తర్వాత స్థానంలో సెర్బియా నిలిచింది. ఈ దేశం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 218,000 డాలర్లు అంటే దాదాపు రూ. 1.8 కోట్లు ఇస్తుంది.
Scooty Car బైక్ లేదా స్కూటీ టూవీలర్ ఏదైనా గానీ ట్రాఫిక్ లో నడపాలంటే మహా కష్టం. అస్తమానూ కాలు కింద పెట్టాల్సి ఉంటుంది. కొంతమందికి ఇది విసుగు కలిగిస్తుంది. ఇక వర్షాలు పడితే అంతే సంగతులు. ఆ బురదలో కాలు పెడితే షూస్, ప్యాంటు నాశనమైపోతాయి. బండి నడపాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనమైపోతాయి. వర్షంతో, ట్రాఫిక్ తో.. మధ్యతరగతి వాళ్ళు నిత్యం పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్టు ఇప్పుడు మంచి మంచి ఆవిష్కరణలు వస్తున్నాయి. కారు కొనలేకపోతున్నామని బాధపడేవారి కోసమే ఈ కారు లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్. కాలు కింద పెట్టే పని లేదు. ఎంత దూరమైనా దర్జాగా, సౌకర్యంగా వెళ్ళచ్చు. పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ 2 వీలర్ స్కూటీలతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తుంది.
Scooty Car
త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ సీటు, డబుల్ సీటుతో వస్తుంది. వెనకాల ఒక వ్యక్తి కూర్చోవచ్చు. పిల్లలు ఉంటే పెద్దవాళ్ళతో పాటు ఒక పాప, బాబు కూర్చోవచ్చు. సీటు పెద్దగా ఉండడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. సీటుని ముందుకి, వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనక ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. హెల్మెట్, ఛార్జర్ వంటివి పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఎత్తైన ప్రదేశాల్లో రివర్స్ మోడ్ లో కూడా ఈజీగా ప్రయాణిస్తుంది. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1000 వాట్ మోటార్ పవర్ తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. 32 ఏహెచ్, 60 వోల్ట్స్ బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 30 కి.మీ.గా ఉంది. ఇది వయసులో పెద్ద వారికి బాగా సూట్ అవుతుంది. సింగిల్ సీటుది కావాలంటే సింగిల్ సీటు కొనుక్కోవచ్చు, డబుల్ సీటుది కావాలంటే డబుల్ సీటుది కొనుక్కోవచ్చు.
Scooty Car ఇక ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కారు విషయానికొస్తే సింగిల్ సీటుతో వస్తుంది. నాలుగు చక్రాలతో వస్తుంది. సీటు కింద డిక్కీ ఇచ్చారు. వెనక ఒక చిన్న బాస్కెట్ ఇచ్చారు. వయసులో పెద్ద వారికి ఇది యూజ్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. షాపింగ్ కి, ఆఫీసులకు వెళ్ళవచ్చు. డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాలు కింద పెట్టే పని ఉండదు కాబట్టి కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం అతను 88 వేలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కంపెనీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ వాహనాలను డెలివర్ చేస్తున్నారని.. రవాణా ఛార్జీలు లేకుండా వాళ్ళే సొంత ఖర్చులతో డెలివర్ చేస్తున్నారని ఈ వెహికల్ ని కొన్న వ్యక్తి వెల్లడించారు. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీలో ఉంది. మరి మీకు ఈ వాహనం కొనాలనుకుంటే కనుక పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Nani – Keerthy Suresh : కీర్తి సురేష్, నాని కలిసి నేను లోకల్, దసరా సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే సినిమాల కంటే కూడా వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. గతంలో కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదరాబాద్ కి వస్తే నాని ఇంటికే వెళ్తాను, వాళ్ళ వంటింట్లోకి కూడా వెళ్లి వంట చేసుకుంటాను. నాని ఫ్యామిలీ నాకు అంత క్లోజ్. నాని భార్య అంజనా కూడా చాలా క్లోజ్ అని చెప్పింది.
కీర్తి సురేష్ త్వరలో రఘు తాత అనే సినిమాతో తమిళ్ లో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కొడుకు అర్జున్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Nani – Keerthy Suresh
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాని కొడుకు జున్ను( నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్ గా చెప్పాడు అని తెలిపి హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని అర్జున్ చెప్పిన వాయిస్ క్లిప్ ని ఆ ఇంటర్వ్యూలో వినిపించింది. దీంతో నాని ఫ్యామిలీకి కీర్తి సురేష్ తో మంచి సాన్నిహిత్యం ఉందని మరోసారి అర్ధమవుతుంది. ఇక నాని కొడుకు గురించి కీర్తి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.