Monday, September 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsParis Olympics 2024 : పతకాలు సాధించిన...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

Paris Olympics 2024 : పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారీగా నగదు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Paris Olympics 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో షూటింగ్‌లో భారత్‌ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ పతకాలు సాధించినందుకు భారత్ అథ్లెట్లకు ఎంత రివార్డ్ ప్రకటించాయో ఇప్పుడు చూద్ధాం.

Paris Olympics 2024

భారతదేశంలో పతక విజేతలకు ఎంత డబ్బు వస్తుంది?
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారి క్రీడాకారులకు కనీసం 33 దేశాలు నగదు బహుమతులు ఇస్తాయి. వీటిలో 15 దేశాలు గోల్డ్ మెడల్ కోసం $1,00,000 (సుమారు రూ. 82 లక్షలు) కంటే ఎక్కువ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయి. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.

ఏ దేశం ఎక్కువ మొత్తం ఇస్తుంది?
Paris Olympics 2024 ఒలింపిక్ పతక విజేతలకు అత్యధిక రివార్డులు ఇచ్చే దేశం హాంకాంగ్. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హాంకాంగ్, బంగారు పతకానికి 768,000 డాలర్లు (దాదాపు రూ. 6.3 కోట్లు) చెల్లిస్తుంది. రజత పతకాలు సాధించిన అథ్లెట్లకు $380,000 (దాదాపు రూ. 3.1 కోట్లు) ఇస్తుంది. బంగారు పతకం కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఇజ్రాయెల్ 2,75,000 డాలర్లు (దాదాపు రూ. 2.2 కోట్లు) ఇస్తుంది. పెద్దమొత్తంలో నగదు ఇవ్వడంలో ఇజ్రాయెల్ రెండోస్థానంలో నిలిచింది. సెర్బియా 218,000 డాలర్లు (దాదాపు రూ. 1.8 కోట్లు)తో మూడో స్థానంలో ఉంది. ఆసక్తికరంగా, ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు 2021 టోక్యో గేమ్స్‌లో బంగారు పతకాలను గెలుచుకున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this