Home Blog Page 58

Godavari Pushkaralu : వడివడిగా గోదావరి పుష్కరాలకు.. పనుల ప్రతిపాదనకు 16 మందితో ప్రత్యేక బృందం

Godavari Pushkaralu రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. చేపట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో కలెక్టర్‌ ప్రశాంతి 16 మంది కీలక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ తదితర శాఖల జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. రానున్న పుష్కరాలకు ఇప్పటి నుంచి చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేస్తుంది. 

Godavari Pushkaralu

బృందం ఏం చేస్తుందంటే..

పుష్కరాలు జరిగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటిస్తారు. ఘాట్ల పటిష్టత, విస్తరణ, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. గత పుష్కరాలకు ఒక్క రాజమహేంద్రవరానికే కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి అంతకు రెండు రెట్లకు మించి వస్తారని అంచనా. ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహణ, పనులపై మున్సిపల్‌ మంత్రితో కలిసి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

గంగా పుష్కరాల అధ్యయనం

గోదావరి పుష్కరాల కంటే ఏడాది ముందు గంగానది పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర పురపాలిక విభాగం అమలు చేస్తున్న విధానాలపై నివేదికను అనుసరించాలని నిర్ణయించారు. నిధుల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో స్పందించే అవకాశం ఉంది. పుష్కరాలకు పనులు సక్రమంగా జరగాలంటే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి పరిపాలన విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా ఎన్నికలు క్రతువు పూర్తి చేయాలని చూస్తున్నారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Temple For Alien : ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?

0

Temple For Alien గ్ర‌హాంత‌రవాసులు.. ఈ పేరు విన‌గానే ఏదో తెలియని ఉత్సుక‌త మ‌దిలో మెదులుతుంది. ఏలియ‌న్స్ భూమిపైకి వ‌స్తుంటాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ఎన్నో సినిమాలు కూడా వ‌చ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా ఏలియ‌న్స్‌పై ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని. అక్క‌డ కొన్ని ఏలియ‌న్స్‌ను సైతం బంధించార‌ని ఇలా ఎన్నో పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి.

Temple For Alien

అయితే వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్ప‌టికీ ఏలియ‌న్స్ నిజంగా ఉన్నాయ‌ని విశ్వ‌సించే వారు చాలా మంది ఉన్నారు. శాస్త్ర‌వేత్త‌లు సైతం ఈ విష‌యాన్ని బ‌లంగా విశ్వ‌సిస్తుంటారు. అయితే ఓ వ్య‌క్తి ఏకంగా ఏలియ‌న్స్‌కి గుడి క‌ట్టించేశాడు. హీరోయిన్ల‌కు గుడులు నిర్మించి పూజించే వారిలో ముందు వ‌రుస‌లో ఉండే త‌మిళ‌నాడులోనే ఏలియ‌న్‌కి కూడా గుడి నిర్మించ‌డం విశేషం.

త‌మిళ‌నాడులోని సేలం జిల్లాలోని మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్‌కు చెందిన లోగనాథన్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల శివాల‌యాన్ని నిర్మించాడు. అందులో శివ‌లిగంతోపాటు ప‌క్క‌నే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుళ్లతోపాటు గ్రహాంతరవాసి ప్రతిమకూ లోగనాథన్ పూజలు చేస్తున్నాడు. 2021లో మొద‌లు పెట్టిన ఈ గుడి నిర్మాణం తాజాగా పూర్త‌యింది. గుడిలో ఏలియ‌న్ విగ్ర‌హం ప్ర‌తిష్టించ‌డంతో ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ప్ర‌పంచంలో ఇలా ఒక ఏలియ‌న్ విగ్ర‌హానికి పూజ‌లు చేయ‌డం ఇదే తొలిసారి. అయితే తాను గ్ర‌హంతర వాసుల‌తో మాట్లాడి, వారి నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే గుడిని నిర్మించిన‌ట్లు లోగనాథన్ తెలిపారు. ప్రపంచంలో ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నాన‌ని అన్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Super Over Rules : టైగా ముగిసిన భారత్, శ్రీలంక తొలి వన్డే.. సూపర్ ఓవర్ ఎందుకు జరగలేదు.. అసలు కారణం ఏంటంటే?

0

Super Over Rules : శ్రీలంక వర్సెస్ టీమిండియా (SL vs IND) మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 230/8 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా ఉండడంతో మ్యాచ్‌ సమమైంది. స్కోర్లు సమం అయిన తర్వాత రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఇప్పుడు చూద్దాం..

Super Over Rules

సూపర్ ఓవర్ అంటే ఏమిటి?

క్రికెట్ మ్యాచ్‌లో స్కోర్లు సమమైతే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైగా ముగుస్తుందన్నమాట. అంటే, అప్పుడు సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంటారు. అయితే, ఈ నిబంధన కేవలం వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ నియమం ప్రకారం, రెండు జట్లూ తలో ఓవర్ ఆడుతుంటాయి. ప్రతి జట్టు నుంచి 3-3 బ్యాట్స్‌మెన్స్ మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం పొందుతారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల పేర్లను ఇరు జట్లూ ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. జట్టు తన ప్రత్యర్థి కంటే ఎక్కువ పరుగులు చేసే వరకు సూపర్ ఓవర్ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

భారత్-శ్రీలంక మధ్య టై అయిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఎందుకు జరగలేదు?

వాస్తవానికి, ఐసీసీ నిబంధనల ప్రకారం, టై అయిన ప్రతి టీ20 మ్యాచ్ ఫలితాలను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించడం తప్పనిసరి. కానీ, ODI ఫార్మాట్‌లో, ఈ నియమం ICC టోర్నమెంట్‌లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో సూపర్‌ ఓవర్‌ మూడుసార్లు మాత్రమే జరిగింది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఈ టైడ్ వన్డే మ్యాచ్‌లో అభిమానులు సూపర్ ఓవర్ చూడకపోవడానికి అసలు కారణం ఇదే.

శ్రీలంక-భారత్‌ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా టై కావడంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలిచిన టీమిండియా 3-0తో శ్రీలంకను వైట్‌వాష్‌ చేసింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Strange Car విచిత్రమైన కారు.. మీ దగ్గర కోట్లున్నా దీన్ని కొనలేరు.. ఎందుకంటే?

Strange Car కొన్ని కార్లు ఉంటాయి, కేవలం కొంతమంది మాత్రమే కొనగలరు. రోల్స్ రాయిస్ కార్ల విషయానికొస్తే.. వాటిని ప్రతిష్ట కలిగిన వారికే అమ్ముతారు. అత్యంత సంపన్నులకు, ప్రతిష్టాత్మక వ్యక్తులకు మాత్రమే అమ్ముతారు. అయితే ఈ కారుని మాత్రం మన దగ్గర కోట్లున్నా కొనలేము. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వేరే పర్పస్ తయారు చేయబడిన కారు. అసలు ఏంటి ఈ కారు? దీనికెందుకంత ప్రత్యేకత? ఏముంది ఈ కారులో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.  

Strange Car

గతంలో రెనాల్ట్ కంపెనీ ట్విజీ పేరుతో ఒక కారుని లాంఛ్ చేసింది. ఆ తర్వాత దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ట్విజీకి రీప్లేస్మెంట్ గా వేరే కారుని తీసుకొస్తున్నట్లు రెనాల్ట్ కంపెనీ ప్రకటించింది. మొబిలైజ్ డ్యుయో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారుని 2024లో తీసుకొస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇది రెండు వెర్షన్స్ లో వస్తుంది. ఒకటి క్యాబ్ టైప్, మరొకటి ట్రాన్స్ పోర్ట్ కారు టైప్. మొదటి వెర్షన్ కారు ప్యాసింజర్ కారులా ఉంటే.. మరొక వెర్షన్ కారు 700 లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ బాక్స్ తో వస్తుంది. ఇది డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 

ఈ కారుని అమ్మడానికి కాకుండా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కింద అద్దెకు ఇవ్వడానికి తయారు చేస్తున్నారు. అమ్మడానికి బదులు దీర్ఘకాలిక అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు తయారు చేస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజ్ లో కారు, మెయింటెనెన్స్, వారంటీ, ఇన్సూరెన్స్, ఛార్జింగ్ సొల్యూషన్స్ అన్నీ కలిపే వస్తాయి. ఎన్ని నెలలు అద్దెకు తీసుకుంటారో దాన్ని బట్టి నెలకు, రెండు నెలలకు, ఏడాదికి ఇలా అద్దె చెల్లించవచ్చు. ఆన్ లైన్ లో అడ్జస్ట్ చేసుకుని అద్దె చెల్లించి ఈ కారుని నడుపుకోవచ్చు. ఎవరికైనా సరే సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే ఇస్తుంది. అయితే ఈ కార్లు యూకేలో అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ గ్రూప్ కి చెందిన మొబిలైజ్ బెంటో, డ్యుయో మోడల్స్ కంపెనీలు తెలిపాయి.     

Strange Car డ్యుయో 45 మోడల్ మోటార్ టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ.గా ఉంది. అయితే ఈ కారుని యూరప్ లో14 ఏళ్ల లోపు వయసున్న మైనర్లు డ్రైవ్ చేయచ్చు. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపచ్చు. డ్యుయో 80 మోడల్ కారు గంటకు 80 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. దీనికి లైసెన్స్ ఉండాలి. ఇక దీని రేంజ్ విషయానికొస్తే ఫుల్ ఛార్జ్ తో 140 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ట్విజీ లానే ఇందులో కూడా రెండు సీట్లు ఉంటాయి. ట్విజీతో పోలిస్తే ఈ డ్యుయో కారు కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది 50 శాతం వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. ఈ కారు లైఫ్ అయిపోయేనాటికి 95 శాతం రీసైకిల్ చేయవచ్చునని రెనాల్ట్ కంపెనీ వెల్లడించింది.

ఒక కారు పార్కింగ్ చేసే ప్లేస్ లో ఇవి మూడు కార్లు పడతాయి. దీనికి రెండు డోర్స్ ఉన్నాయి. అయితే అవి బయటకు కాకుండా పై దిశలో తెరవబడతాయి. దీని వల్ల ఇరుకు వీధుల్లో.. రెండు కార్ల మధ్యలో ఉన్నా గానీ కారులోంచి దిగేందుకు సమస్య ఉండదు. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ కారుని అమ్మడానికి కాకుండా అద్దె ప్రాతిపదికన ఇవ్వడం గానీ లేదా ఓలా, ఉబర్ లా క్యాబ్స్ గా తిప్పడం గానీ చేస్తుందట. ప్రస్తుతానికి యూకేలో మాత్రమే రెంటల్ పర్పస్ తిప్పేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. సక్సెస్ అయితే ఫ్యూచర్ లో భారత్ సహా ఇతర దేశాలకు నెట్ వర్క్ ని పెంచుకునే అవకాశం ఉండవచ్చునని సమాచారం.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


How Much Water Should We Drink in a Day : ఒక రోజులో ఎంత నీరు తాగాలి?.. కొద్ది మందికి మాత్రమే తెలుసు!

0

How Much Water Should We Drink in a Day : నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని తరచుగా చెబుతారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ పోస్ట్‌లలో ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుందని, చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతుంటారు. అందువల్ల, ఈ విషయాల వల్ల, మనం కూడా చాలా ఎక్కువ నీరు తాగటం ప్రారంభిస్తాం. అయితే ఎక్కువ నీరు తాగటం, తక్కువ నీరు తాగినంత హానికరం అని మీకు తెలుసా. మీరు ఎంత నీరు తాగడం మంచిదో ఈ కథనం ద్వారా తెలుసుకోండి..

మన శరీర బరువులో 50-70 శాతం నీటి వల్లనే అని మీకు తెలుసా. కణాలు మన శరీరం యొక్క నిర్మాణ యూనిట్లు, సజీవంగా ఉండటానికి నీరు అవసరం. నీటి కొరత కారణంగా, కణాలలో ఉన్న ద్రవం కోల్పోవడం ప్రారంభమవుతుంది, దాని కారణంగా అవి సరిగ్గా పనిచేయలేవు. అందువల్ల, శరీరంలో సరైన మొత్తంలో నీరు ఉండటం ముఖ్యం. అలాగే, నీరు మన శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మనం చేసే ప్రతి శారీరక శ్రమ సమయంలో నీరు ఉపయోగించబడుతుంది. ఈ కారణంగా, వృధా నీటి కొరతను భర్తీ చేయడం అవసరం.

How Much Water Should We Drink in a Day

ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి?
మేయో క్లినిక్ ప్రకారం, ఒక వ్యక్తి ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్నకు సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకు తెలిసినట్లుగా, అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ప్రతి వ్యక్తి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వైద్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, దీని కారణంగా నీటి అవసరం కూడా భిన్నంగా ఉంటుంది. ఏసీలో కూర్చున్న వ్యక్తి కంటే ఎక్కువసేపు ఎండలో ఉండే వ్యక్తికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందువల్ల, ప్రతి వ్యక్తి తన భౌతిక, భౌగోళిక, వైద్య పరిస్థితి ఆధారంగా నీటి పరిమాణాన్ని నిర్ణయించాలి. యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రకారం, పురుషులు రోజుకు 3.7 లీటర్ల ద్రవాలను తీసుకోవాలి. అదే సమయంలో, మహిళలకు రోజుకు 2.7 లీటర్ల ద్రవం అవసరం. అయినప్పటికీ, ద్రవం నీటి నుంచి మాత్రమే కాకుండా, ఆహారం, ఇతర పానీయాల నుంచి పొందిన నీటిని కూడా కలిగి ఉంటుందని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Buddy Movie Review : ‘బడ్డీ’ మూవీ రివ్యూ.. అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తే..

Buddy Movie Review : అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్ జంటగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణంలో సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘బడ్డీ’. అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. బడ్డీ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Buddy Movie Review

కథ విషయానికొస్తే.. ఆదిత్య రామ్(అల్లు శిరీష్) ఓ పైలట్. పల్లవి(గాయత్రీ భరద్వాజ్) ఓ ATC (విమానాశ్రయంలో కూర్చొని పైలట్స్ తో ఫ్లైట్ ల్యాండ్ చేయించేవాళ్ళు)గా పనిచేస్తూ ఉంటుంది. దీంతో ఆదిత్య, పల్లవి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. పల్లవి ఆదిత్యని చూసినా ఆదిత్య మాత్రం పల్లవిని చూడడు. వీళ్లిద్దరు కలుద్దామనుకునే సమయానికి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల ఆదిత్య జాబ్ పోతుంది. ఆదిత్య జాబ్ తన వల్లే పోయిందని తనని కలిసి సారీ చెప్దామనుకునేలోపు పల్లవి కిడ్నాప్ అవుతుంది.

హాంగ్ కాంగ్ లో డాక్టర్ అర్జున్ ఆర్గాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఓ డ్రగ్ డాన్ కొడుకుకి కావాల్సిన హార్ట్ పల్లవిది సరిపోతుందని తెలియడంతో ఆమెని కిడ్నాప్ చేయించి హాంగ్ కాంగ్ కి తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో పల్లవి కోమాలోకి వెళ్లడంతో ఆమె ప్రాణం ఆదిత్య గిఫ్ట్ గా ఇచ్చిన ఒక టెడ్డీ బేర్ లోకి వెళ్తుంది. మరి ఆ టెడ్డీ ఆదిత్య రామ్ ని ఎలా కలిసింది? తనే ATC అమ్మాయి అని చెప్పిందా? పల్లవిని ఆదిత్య టెడ్డీ సహాయంతో ఎలా కాపాడాడు? వీరి ప్రేమ గురించి ఒకరికొకరికి తెలిసిందా? అసలు ఆదిత్య జాబ్ ఎలా పోయింది, మళ్ళీ తిరిగొచ్చిందా? మళ్ళీ టెడ్డీ నుంచి పల్లవి ప్రాణం తన బాడీలోకి వచ్చిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. బడ్డీ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఇది తమిళ సినిమా టెడ్డీ లాగే ఉంది అని అంతా అనుకున్నారు. అయితే అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తుంది అనే బేసిక్ పాయింట్ అదే అయినా కథ, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా వేరు. ఫస్ట్ హాఫ్ ఆదిత్య, పల్లవి ఒకర్నొకరు చూసుకోకుండానే వీరిద్దరి ప్రయాణం, డాక్టర్ అర్జున్ గురించి చూపించడం, పల్లవి కిడ్నాప్ అయి ప్రాణం టెడ్డీలోకి రావడం, టెడ్డీ ఆదిత్యని కలవడం చూపిస్తారు. ఆదిత్య ఎలా కాపాడతాడు అని ఆసక్తికరంగా ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో టెడ్డీ చేసే విన్యాసాలు, ఆదిత్య హ్యాంగ్ కాంగ్ కి ఎలా వెళ్ళాడు? అక్కడ యాక్షన్ సీక్వెన్స్ లతో ఓ పక్క కామెడీ, మరో పక్క యాక్షన్స్ తో ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది.

Buddy Movie Review సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోవడం చాలా ప్లస్ పాయింట్. ఇక టెడ్డీ చేసే కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ లు పిల్లలకు బాగా నచ్చుతాయి. సినిమాలో వచ్చే తెలుగు పాటలు, జై బాలయ్య రిఫరెన్స్ లు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా తమిళ్ టెడ్డీ సినిమా చూడకుండా వెళ్తే మాత్రం బాగా నచ్చుతుంది ఈ బడ్డీ సినిమా. తమిళ్ టెడ్డీ సినిమా చూసి బడ్డీ సినిమా చూస్తే మాత్రం అదే సినిమా గుర్తుకు వస్తుంది. బడ్డీలో ముఖ్యంగా ఆకాశంలో ఉండే అబ్బాయి – భూమి మీద ఉండే అమ్మాయి అంటూ లవ్ స్టోరీని కొత్తగా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ లో జరగడం, విమానాశ్రయం సెటప్స్ పరంగా బాగానే చూపించినా చిన్న చిన్న లాజిక్స్ వదిలేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లు శిరీష్ పైలట్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించి నటనతో కూడా మెప్పించాడు. గాయత్రీ భరద్వాజ్ చాలా క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. ప్రిషా సింగ్ అందంతో పాటు బాగానే నటించింది. అలీ, ముకేశ్ రిషి ఓ పక్క అప్పుడప్పుడు నవ్విస్తూనే సీరియస్ యాక్టింగ్ చేసారు. నెగిటివ్ రోల్ లో అజ్మల్ అమీర్ బాగా నటించాడు. టెడ్డీ అయితే అదరగొట్టేసింది. మిగిలిన నటీనటులు అంతా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా, చాలా రిచ్ గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. ఇక విమానం సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. కథ పాతదే అయినా కథనం కొత్తగా రాసుకొని దర్శకుడిగా బడ్డీ సినిమాని తెరకెక్కించడంలో డైరెక్టర్ సామ్ ఆంటోని సక్సెస్ అయ్యాడు. ఇక బడ్డీ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ నిర్మించడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.

Buddy Movie Review మొత్తంగా ఓ అమ్మాయి ప్రాణం ఒక టెడ్డీ బేర్ లోకి వస్తే హీరోతో కలిసి తనని ఎలా కాపాడుకుంది అని ఫుల్ ఎంటర్టైనింగ్, ఎమోషన్ గా చూపించారు. పిల్లలతో ఈ సినిమాకు వెళ్తే థియేటర్లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


CM Revanth Fired on BRS MLAs ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైర్

0

CM Revanth Fired on BRS MLAs : అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. లాంగ్వేజ్ వేరు.. నాలెడ్జ్ వేరు, కేటీఆర్ ఇది తెలుసుకోవాలి. ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్.

CM Revanth Fired on BRS MLA’s

”అవగాహన ఉండాలి. అవతలి వారిని అవహేళన చేస్తే సరిపోదు కేటీఆర్. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటి? హైదరాబాద్ పై అవగాహన ఉంది కాబట్టి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే తప్పేంటి? ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం. కోమటిరెడ్డి, సంపత్ ను ఈ సభలో ఏం చేశారో మేము చూడలేదా? ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్దోస్తది.

CM Revanth Fired on BRS MLAs కమిషనర్లు రోడ్డు మీద ఉండాలి. లేదంటే నేనే రోడ్డు మీదకొచ్చి ట్రాఫిక్ నియంత్రిస్తా అని చెప్పాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే హైడ్రా. మాకు మంచి కావాలి. దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వరం కడితిరి లక్ష కోట్లు మింగితిరి. మేడిగడ్డ కూల్చితిరి. మూసీ రివర్ డెవలప్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలిచాం. మూసీ పరివాహకంలో ఉన్న నిరుపేదలకు ఆశ్ర్రయం కల్పిస్తాం. గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని కుక్క చేయాలి. మేము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. ఎందుకింత ఆక్రోశం? ఎల్లంపల్లి నుండి వస్తున్న గోదావరి నీళ్లకు బొక్క పెట్టి గజ్వేల్ కు తీసుకెళ్లారు. సచ్చిన పామును ఎందుకు అని నేను మాట్లాడటం లేదు.

CM Revanth Fired on BRS MLAs అరడజను మందిపై వేటు వేస్తే బుద్ధి వస్తుంది. గతంలో కోమటిరెడ్డి, సంపత్ లపై చర్యలు తీసుకోలేదా? లండన్ ఐ లాంటి.. హైదరాబాద్ ఐ టవర్ ను.. మీరాలం ట్యాంక్ లో ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్ ను పణంగా పెట్టారు. కృష్ణా ఫేస్ 3, గోదావరి ఫేస్ 1 తెచ్చింది కాంగ్రెసే. కొందరు గోదావరి నీళ్లు నెత్తిన పోసుకుని మేమే నీళ్లు తెచ్చామని డబ్బా కొట్టారు. చంద్రబాబుకు, వైఎస్సార్ కు భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారు. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డును మణిహారంలా వైఎస్సార్ ఇచ్చారు.

CM Revanth Fired on BRS MLAs ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తయారు చేసేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ లో రోడ్డుపై నీరు ఆగకుండా వాటర్ హార్వెస్టింగ్ లను ఏర్పాటు చేస్తాం. 141 ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది ఉంటారు. అఫీసులకే పరిమితమైన అధికారులతో ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం. అధికారులు రోడ్డుపైకి రాకపోతే.. నేను వస్తా అని చెప్పాను. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే.. మా ప్రభుత్వంలో క్రైమ్ రేటు తగ్గింది.

CM Revanth Fired on BRS MLAs గోషామహాల్ పోలీస్ క్వార్టర్స్ స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ బిల్డింగ్ గా ఉంచుతాం. కొత్త ఉస్మానియా బిల్డింగ్ ను 30 ఎకరాల స్థలంలో నిర్మిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కిషన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కిషన్ రెడ్డికి రెండు సార్లు ఫోన్ చేశాను. బండి సంజయ్ ను కూడా తీసుకొని సెక్రటేరియట్ కు రండి అని చెప్పా. అభివృద్ధిపై చర్చిద్దాం అని చెప్పా. కానీ ఎందుకో రాలేదు. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరినీ తీసుకుని సెక్రటేరియట్ కు రండి. మా మంత్రులను కూడా పిలుస్తా. అందరం కలిసి అభివృద్ధిపై చర్చిద్దాం. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేదవాడు, ప్రజల మనిషి. ఆయనను కాపాడుకోవాలి. సిర్పూర్ కాగాజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు ఆర్థికంగా బాగా ఉన్నోళ్లు” అని సీఎం రేవంత్ అన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


OTT Action Thriller Movie లో దీనిని మించిన యానిమేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లేదు.. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్

OTT Action Thriller Movie కార్టూన్ , యానిమేటెడ్ ఫిల్మ్స్ ను కేవలం చిన్న పిల్లలు మాత్రమే చూస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి యానిమేటెడ్ చిత్రాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ కల్కి సినిమా నుంచి వచ్చిన యానిమేటెడ్ సిరీస్ బుజ్జి&భైరవ నే ఉదాహరణ. యాక్షన్ డ్రామాస్ , హీరో విలన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో చూసి చూసి బోర్ కొట్టేసి.. డిఫరెంట్ గా వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యానిమేటెడ్ ఫిల్మ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Action Thriller Movie

ఈ సినిమా కథ విషయానికొస్తే.. వెయ్యి సంవత్సరాల క్రితం భూమి , స్వర్గం కలిసి మంచి చెడులను కలిపే ఓ పవర్ ఫుల్ బాల్ ను క్రియేట్ చేస్తాయి. ఆ బాల్ కు ప్రాణం రాగానే తన చుట్టూ ఉండే ఎనర్జీని లాగేసుకుని.. ఇంకా పవర్ ఫుల్ గా మారుతుంది. దీని వలన భూమి అంత నాశనం అవుతుంది. అందుకే దేవుడు తన ఇద్దరు శిష్యులైన పిగ్గెట్ , సెన్ ను దానిని ఆపడానికి పంపిస్తాడు. కానీ ఆ బాల్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్న కారణంగా దానిని ఆపలేకపోతారు. దీనితో చివరికి దేవుడే ఓ పవర్ ఫుల్ ఛాంబర్ ను క్రియేట్ చేసి ఆ బాల్ నుంచి మంచి చెడులను సెపరేట్ చేస్తాడు. చెడు బాల్ ను నాశనం చేయడానికి.. మూడు సంవత్సరాల తర్వాత ఈ చెడు బాల్ పైన ఆకాశం నుంచి వచ్చే ఒక లైట్ పవర్ పడి.. ఆ పవర్ తట్టుకోలేక అది పూర్తిగా నాశనం అయిపోతుందనే శాపం పెడతాడు. ఈ క్రమంలో ఆ రెండు బాల్స్ ను మూడు సంవత్సరాల పాటు కలవనివ్వకుండా చూసుకోమని తన శిష్యులలో ఒకడైన పిగ్గెట్ కు ఇస్తాడు.

OTT Action Thriller Movie దీనితో సెన్ కు కోపం వస్తుంది.. దీనితో సెన్ ప్రపంచాన్ని పాలించాలని అందరి కంటే తానే ఎక్కువ శక్తివంతుడుగా ఉండాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం పిగ్గెట్ నుంచి మంచి బాల్ ను దొంగలించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో చెడు బాల్ అయినా డీమన్ బాల్ కూడా బయటపడుతుంది. ఆ డీమన్ బాల్ వెళ్లి.. ఓ రాజ్యంలోని రాణి గర్భాన పుడతాడు. దీనితో అతను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడనే భయంతో వెంటనే పిగ్గెట్.. డీమన్ ను చంపడానికి వెళ్తాడు. అక్కడ తన తల్లి వచ్చి అతనిని కాపాడుతుంది. ఆ రాజు రాణి తమ కొడుకుని వారితోనే ఉంచుకోవాలని అనుకుంటారు. కానీ మిగిలిన వాళ్లేమో ఆ పిల్లాడిని చంపేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనితో రాజు వెళ్లి దేవుడిని కలుస్తారు. సేన్ దగ్గర ఉన్న మరొక మంచి బాల్ నుంచి డ్రాగన్ కడుపునా.. మంచి అబ్బాయిల పుడతాడు. ఆ డీమన్ కుర్రాడి పేరు నిజా.. అతను పెరిగే కొద్దీ రాక్షసుడిలా బెహేవ్ చేస్తూ ఉంటాడు. మరో వైపు డ్రాగన్ కు పుట్టిన పిల్లాడు అలెక్స్. మరి వీరిద్దరి మధ్య గెలిచేది ఎవరు ? దేవుడు పెట్టిన శాపం వలన నిజా మూడేళ్ళ తర్వాత చనిపోతాడా లేదా ? అలెక్స్, లీసా ఫ్రెండ్స్ అవుతారా? తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “నిజా” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

OTT Action Thriller Movie అయితే ఈ సినిమా రెండు పార్ట్శ్ గా అందుబాటులో ఉంది.. నిజా అనేది మొదటి పార్ట్ అయితే.. “నిజా రీబోర్న్” అనేది రెండవ పార్ట్. యానిమేటెడ్ మూవీస్ ఇష్టపడే వారు ఈ రెండు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ప్రస్తుతం నిజా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. “నిజా రీబోర్న్” మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు సినిమాలను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horoscope Today : ఆరోగ్యం విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today దిన ఫలాలు (ఆగస్టు 3, 2024): మేష రాశి వారికి ఈ రోజు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.

Horoscope Today

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

బాగా సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అనుకోకుండా వాహన యోగం పట్టడానికి అవకాశం ఉంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిబఝ పోతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో మెప్పిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతులు కలగడానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా సకాలంలో, సంతృప్తికరంగా నెరవేరుతుంది. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలున్నప్పటికీ లాభాలపరంగా దూసుకుపోతారు. నిరుద్యో గులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండక పోవచ్చు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్య తలు ఉంటాయి. సోదరుల కారణంగా స్థిరాస్తి వివాదాలు ఇబ్బందుల్లో పడతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయా లతో పాటు, చెడు పరిచయాలకు కూడా అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగు తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి దీటుగా అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

Horoscope Today చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ మిత్రుల తోడ్పాటుతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగుల మీద అదనపు పని భారం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మిత్రులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగు తాయి. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరు ద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు కాకుండా వేరే ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. రావలసిన డబ్బును, బాకీలను కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

Horoscope Today ఇంటికి ఇష్టమైన బంధువులు రావడం జరుగుతుంది. కుటుంబ జీవితం సందడిగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్నిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

నిరుద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి విషయంలో అంచ నాలను అందుకుంటారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవు తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. ఉద్యోగ ప్రయ త్నాల్లో కొద్దిగా నిరాశపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ వ్యవహారాలు చిన్న ప్రయత్నంతో చక్కబడతాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

Horoscope Today వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల సమస్యలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండి, విశ్రాంతి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు, నిర్ణయాలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. కొద్దిగా అనారోగ్య సమ స్యలు బాధిస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Gold Price Today : బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. వరుసగా 4వ రోజు షాకిచ్చిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

0

Gold Price Today : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.. శనివారం (03 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది. అంటే నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,700లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 150లు పెరిగి, రూ. 64,660లుగా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 100లు పెరిగి రూ.87,200లుగా నమోదైంది.

Gold Price Today

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,700లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,700లుగా నమోదైంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,960లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.70,850, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700, చెన్నైలో 22 క్యారెట్లు రూ.64,610, 24 క్యారెట్లు రూ.70,480, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700లుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.86,400లు కాగా, ముంబైలో రూ.87,300, బెంగళూరులో రూ.86,100, చెన్నైలో రూ.90,900, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.90,900 లుగా నమోదైంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.