Home Blog Page 57

NMMS 2024 Notification, Apply Online

NMMS 2024 Notification, Apply Online NMMS 2024 Online ApplicationAP NMMS 2024-25 Notification – Schedule – Syllabus – Online Application – Previous Papers – Material NMMS Notification 2024 AP NMMS Application Form 2024-2025 Notification bse.ap.gov.in AP National Means-cum Merit Scholarship Scheme Examination Application Form, Dates, Eligibility, Pattern, Syllabus Andhra Pradesh nmms exam date 2024-2025 NMMS Andhra Pradesh 2024 -2025: Application Form, Eligibility, Important Dates

AP NMMS 2024 Notification, Apply OnlineAP NMMS Exam 2024 Notification It is hereby notified that the State Level National Means-cum Merit Scholarship Scheme Examination for class VIII for the academic year 2024-25 will be conducted and the examination date will be announced later. The Examination conducted in Telugu, Urdu and English medium at all Revenue Divisional Head Quarters of 26 Districts in the State.

NMMS 2024-25 Exam Date: 08-12-2024

National Means-cum-Merit Scholarship Scheme Examination, 2024-25 Enrollment of less number of students Necessary instructions to the Head Masters of all Government, ZP, Municipal, Aided and Model Schools (without residential facility)- Req-Reg.

nmms 2024 notification
april 27, 2026, 1:35 am - duniya360

Ref:- This Office Press Note on Rc.No.03/E2/2023 dated 10-08-2023.

With reference to the subject cited, DGE inform all DEOs that as per the guidelines of Ministry of Education, New Delhi, the Government Andhra Pradesh State is Conducting National Means-cum-Merit Scholarship Scheme Examination for the students those who are studying VIII Class in Government, ZP, Municipal, Aided Schools and Model Schools (without residential facility). For this year the annual parental income is enhanced from Rs.1,50,000/- to Rs.3,50,000/-.

In this connection, I wish to bring to your notice that there is a decline in the number of students taking the said examination from your district. The scheme is meant for the students of below poverty. A total of 4087 scholarships were allotted to the state and based on the child population and enrollment of the students for class VII and VIII, these scholarships will be distributed district wise and redistributed category wise according to the state Government norms.

In view of the above DGE requests all the DEOs to kindly issue instructions to all Head Masters concerned to bring awareness among the students to ensure more registrations for National Means-cum-Merit Scholarship Scheme Examination from Government High Schools, ZP High Schools, Municipal High Schools, Model Schools (without residential facility) and Aided High Schools and give wide publicity through Print, Electronic and Social Media in your District.

The applications will be received through online procedure only.

ELIGIBILITY: A candidate who has/is

(i) Scored at least 55% of marks in case of OC/BC and 50% of marks in case of SC/ST or equivalent grade i.e., B+ for all categories in class VII Examination studied during the year 2023-24.

(ii) Studying in Government, Local Body (ZP/Municipal), Government Aided, AP Model (day scholars only) and MPUP (Running 8th class) schools only.

(iii) Whose parental annual income (both Parents put together) is below Rs.3,50,000/- from all sources for which candidates have to produce latest original Annual Income Certificate issued by the MRO, in case of Private employee and certificate issued by the employer in case of Government employee.

(iv) Candidate has to submit the original caste certificate and also Income certificate (issued by the MRO) to the Headmaster.

AP NMMS 2024-25 FEE:

Examination fee is Rs.100/- for OC and BC students & Rs. 50/- for SC and ST students. The examination fee has to be paid through SBI Collect only (follow user guide available in website www.bse.ap.gov.in).

AP NMMS 2024-25 Due Dates, Schedule:

Due dates for payment of National Means cum Merit Scholarship Examination fee and submission of Nominal roll along with fee receipts by the head masters. The above said Examination is for class VIII studying students.

Rc.No.03/E/2024 Dated: 05-08-2024 PRESS NOTE

It is hereby notified that the due dates for National Means-cum- Merit Scholarship Scheme Examination 2023 is extended as mentioned below. The examination will be conducted on 08-12-2024.

                                                                   DUE DATES
(a)Application online submission from05-08-2024
(b)Payment may be made from05-08-2024
(c)Last date for Upload the candidate’s application by the concerned Head Masters.06-09-2024
(d)Last date for Payment of fee.10-09-2024
(e)Last date for submission of printed Nominal Rolls along with other
enclosures in the O/o.The District Educational Office concerned by (HMs / Principals)
(f)Last date for approval of applications at DEO level

2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష 08-12-2024 న జరుగును. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/- దరఖాస్తులను ఆన్ లైను లో 05-08-2024 నుండి స్వీకరించబడును. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 06-09-2024 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 10-09-2024. పరీక్ష రుసుమును ఆన్లైన్ అప్లికేషన్ లో ఇవ్వబడిన SBI Collect లింకు ద్వారా మాత్రమే చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

 NMMS SCHEME:

  1. The Ministry for Human Resource Development, Government of India has launched centrally sponsored National Means-cum-Merit Scholarship Scheme (NMMSS). Under this scheme an examination will be conducted and selected candidates will get the scholarship.
  2. Every year 1,00,000 students will be selected throughout India. Out of which 4087 scholarships are being allotted to Residuary Andhra Pradesh and have been distributed among the districts basing on enrollment in VII & VIII Classes and Child population for each academic year.
  3. The Director of Government Examinations, Andhra Pradesh, Vijayawada is conducting NMMS examination from August 2008.
  4. This examination is conducted every year in the month of November for the students who are studying VIII class in Government / Local Body / Municipal / Aided Schools / Model Schools (without Residential Facility).
  5. The beneficiaries are being selected basing on the merit and as per the reservation norms followed by the state.
SCSTBC-ABC-BBC-CBC-DBC-EPH
15%6%7%10%1%7%4%3%

PATTERN OF EXAMINATION

MAT• 90 Multiple Choice Questions.
• 90 Marks & Each question carries one mark.
• No negative marking
SAT• 90 Multiple Choice Questions
• 90 Marks Covering social science, science and mathematics of class VII & VIII.
  Each question carries one mark
• No negative marking.

Duration for both MAT and SAT is 180 Minutes

Subject – Marks:

Physics – 12  Chemistry – 11  Biology – 12  Mathematics – 20  History – 10  Geography – 10 Pol. Science  – 10   Economics – 5

QUALIFYING PERCENTAGE:

  • 1) GEN, BC & PH: 40% (36 MARKS)
  • 2) SC & ST: 32% (29 MARKS)

NOTE: The student must Qualify both the tests i.e., Mental Ability Test (MAT) and Scholastic Aptitude Test (SAT) with at least 40% marks in aggregate taken together for these two tests.

SCHOLARSHIP AMOUNT:

  1. 1.The selected student shall receive a sum of Rs. 12,000/- per annum for which the selected student shall have to open a joint Savings Bank Account with their parents in any S.B.I or in any Nationalized Bank which has core banking facility/ESC facility. Accounts other than Savings bank will be rejected at the time of disbursement of Scholarship.
  2. Every Selected student should Register and submit his/her application on National Scholarship Portal i.e., www.scholarships.gov.in. After successful submission of application on portal, concerned Institute Nodal Officer (INO) should Verify the application through INO Login and the same should be verified by concerned District Nodal Officer (DNO) through DNO Login. Otherwise student will not get the scholarship forever.
  3. The student should verify Student Login frequently for payment status on National Scholarship Portal. Status is only available in Student Login.
  4. The Ministry of Education, New Delhi will sanction the scholarship amount and send the list to the SBI, New Delhi for disbursement of scholarship through Aadhaar Based Payment System.

Information can be obtained from the concerned School Head Master/ District Educational Officer. The application forms should be uploaded online in the website “www.bse.ap.gov.in”. Before filling the application form, the headmaster should go through the guidelines given in the website www.bseap.org. The information shall be available in www.bseap.org website also.

USER NAME AND PASSWORD ARE SAME (YOUR DISE CODE)

NMMS 2024-25 Online Application click here

Download NNMS 2024-25 Notification

Muhurtham in August త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి గుడ్ న్యూస్! ఆ 2 రోజులు స్పెషల్!

Muhurtham in August ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, గురు మూఢమి రావడంతో వివాహాది శుభకార్యాలకు అవాంతరం ఏర్పడిన విషయం తెలిసిందే. మూడు నెలలు నుంచి ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. నిన్నటితో ఆషాఢ మాసం ముగిసింది.. నేటి నుంచి సోమవారం (ఆగస్టు 5) శ్రావణ మాసం ప్రారంభంమై సెప్టెంబర్ 3 తో ముగియనుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఏదైనా మంచి పని చేయాలంటే ఖచ్చితంగా శుభ ముహూర్తం చూస్తుంటారు. శుభ ముహూర్తం లేకుంటే ఎలాంటి కార్యమైనా వాయిదా వేసుకుంటారే తప్ప దాన్ని నిర్వహించరు.  గృహ ప్రవేశాలు,  పెళ్లిళ్లు చేసుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ముఖ్యంగా ఆ రెండు రోజులు మరీ స్పెషల్ డే అంటున్నారు పురోహితులు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

Muhurtham in August

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది.. మూడు నెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. ఆగస్టు 7 నుంచి 28 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. కానీ మూఢం కారణంగా ఎక్కడా పెళ్లి భాజాలు మోగలేదు. శ్రావణ మాసం మొదలైంది.. నిన్నటితో మూఢం ముగిసింది. ఆగస్టు నెలలో వరుసగా ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు పురోహితులు. ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 శుభ ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ నెల 17, 18 తేదీలో అద్భుతమైన శుభ ముహూర్తం ఉందని పురోహితులు పేర్కొన్నారు. మామూలు  రోజుల కన్నా ఈ రెండు రోజుల్లో బలమైన ముహూర్తాలు అని అంటున్నారు. అందుకే  ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా వేలాది వివాహాలు జరగనున్నాయని చెబుతున్నారు.

మూడు నెలలుగా మంచి పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూసేవారికి ఇది గొప్ప శుభవార్త అంటున్నారు.  పెళ్లి చేసుకునేవారు, గృహ ప్రవేశం, శంకుస్థాపన, వ్యాపారం ప్రారంభించానుకునే వారు ఈ శుభ మూహూర్తం ఫిక్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రావణ మాసం శుభముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పురోహితులు, కళ్యాణ మండపాలు, బాజా భజంత్రీలు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యూటీ పార్లర్లు, ఈవెంట్ల నిర్వహకులు, ప్రింట్ ప్రెస్, జ్యులరీ, వస్త్ర దుకాణాలు, పండ్లు, పూల, క్యాటరింగ్ వాళ్లు సంతోషంలో ఉన్నారు. మూడు నెలల వరకు ఖాళీగా ఉన్న వీరంతా త్వరలో బిజీ కానున్నారు.పెళ్లిళ్లు కానీ, వ్యాపారాలు, గృహ ప్రవేశాలు మీకు సంబంధించిన ఏ శుభ ముహూర్తాలైనా పండితులను సంప్రదించి మీకు అనువైన తేదీని ఎంచుకోవచ్చు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Neuralink Chip : రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌.. విజయవంతంగా పనిచేస్తోందన్న మస్క్‌

0

Neuralink Chip మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్‌ను అమర్చినట్లు న్యూరాలింక్‌ (Neuralink) సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

Neuralink Chip

రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్‌లో దాదాపు 400 ఎలక్ట్రోడ్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు సహా ఇతర వివరాలేవీ బహిర్గతం చేయలేదు. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో ఎనిమిది మందికి ఈ చిప్‌ను అమర్చనున్నట్లు మాత్రం మస్క్‌ ధ్రువీకరించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.

ఇదే కార్యక్రమంలో తొలి చిప్‌ను అందుకున్న వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌తో పాటు న్యూరాలింక్‌కు (Neuralink) చెందిన ముగ్గురు ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్‌ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్ర చికిత్సకు సంబంధించిన విషయాలను వివరించారు. చిప్‌ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్‌ను ఆపరేట్‌ చేయడానికి నోట్లో ప్రత్యేక స్టిక్‌ ఉపయోగించాల్సి వచ్చేదని అర్బాగ్‌ వివరించారు. ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని తెలిపారు.

చిప్‌ అమర్చిన తొలినాళ్లలో అర్బాగ్‌ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రోడ్‌లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్‌ (Neuralink).. సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసే విషయంలో అర్బాగ్‌ రికార్డు నెలకొల్పారని మస్క్‌ తాజాగా వెల్లడించారు.

మానవ మెదడులో తొలి చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్‌ (Neuralink) ప్రకటించింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌- కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్‌’ వీడియో గేమ్‌ను ఆడింది.

ఎలా పనిచేస్తుందంటే..

న్యూరాలింక్‌ బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Success Story : హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన

0

Success Story కేఆర్ భాస్కర్ కర్ణాటక వాసి. ‘పురాన్‌పోలి ఘర్‌ ఆఫ్‌ భాస్కర్‌’ బ్రాండ్‌ యజమాని. పురంపోలి అమ్మడం ద్వారా భాస్కర్ ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడు. ఇది ఒక రకమైన సాంప్రదాయ వంటకం. ఇది మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు. ఇది ఓ రకమైన స్వీట్ లాగా ఉంటుంది. ఇది తీపి, మృదువైన రొట్టె, లోపల తీపి నింపి ఉంటుంది. కె.ఆర్ భాస్కర్ కథ గురించి ఇప్పుుడు తెలుసుకుందాం..

Success Story

భాస్కర్ 12 ఏళ్ల వయసులో బెంగళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లపాటు హోటల్‌లోని టేబుల్స్‌, పాత్రలు శుభ్రం చేశాడు. ఆ తర్వాత 8 ఏళ్లపాటు నాట్య శిక్షకుడిగా కొనసాగాడు. అతను పాన్ షాప్ కూడా తెరిచాడు. కానీ దీని నుంచి పెద్దగా సంపాదించలేదు.23 సంవత్సరాల వయస్సులో, భాస్కర్ ముంబై వీధుల్లో సైకిల్‌పై పురాన్‌పోలి అమ్మడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచి అతడి అదృష్టం మారిపోయింది. కుకింగ్ షోలో ఎంపికయ్యా్కై గుర్తింపు తెచ్చుకుని క్రమంగా తన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నాడు.

ఈ రోజు భాస్కర్ దేశవ్యాప్తంగా ప్రతి 8 నెలలకు ఒక కొత్త అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నాడు. ఆయనకు కర్ణాటకలోనే 17 స్టోర్లు, 10కి పైగా ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ దుకాణాల ద్వారా అతని నెలవారీ సంపాదన దాదాపు రూ.18 కోట్లు. అతని వ్యాపారం రూ.3.6 కోట్ల నికర లాభం ఆర్జిస్తోంది. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో కెఆర్ భాస్కర్ కష్టపడుతున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. తాను బెంగుళూరులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేసేవాడిని క్రితం తెలిపాడు. కష్టపడి, అంకితభావంతో విజయం సాధిస్తారని భాస్కర్ కథ చెబుతోంది.

He started as a waiter in a hotel and now earns Rs.18 crores per month, Latest Telugu News, waiter , Karnataka, Puranpoli Ghar of Bhaskar, Puranpoli

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Foldable iPhone :యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్‌ వచ్చేస్తోంది!

0

Foldable iPhone అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి. ఆపిల్ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని పేర్కొంటూ మరో కొత్త లీక్ రిపోర్ట్ వెలువడింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్/మ్యాక్‌బుక్‌లో కూడా పనిచేస్తోందని వార్తలు కూడా వస్తు్న్నాయి. దీని అంతర్గత డిస్‌ప్లే 18.8 అంగుళాలు ఉంటుందని చెబుతున్నారు.

Foldable iPhone

ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటించారు. ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు హైబ్రిడ్ ఐప్యాడ్ మరియు మ్యాక్‌బుక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి నివేదికలో ఎక్కువ సమాచారం లేదు. ఇంతకు ముందు కూడా, ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి క్లెయిమ్‌లు చేసిన అనేక నివేదికలు ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ వచ్చే నెలలో జరగబోతోంది. ఈ సిరీస్ కింద 4 కొత్త ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కెమెరా డిజైన్‌లో మార్పు కనిపించవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ iOS 18తో ప్రారంభించబడుతుంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Wayanad Landslide : అంతకంతకు పెరుగుతున్న వయనాడ్ మృతుల సంఖ్య… ఎడతెరిపిలేని వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం

0
  • కేరళలో ప్రకృతి బీభత్సం
  • వర్షాలు, వరదలకు తోడు విరిగిపడుతున్న కొండచరియలు
  • వయనాడ్ లో ఇప్పటివరకు 93 మంది మృతి
  • ఇంకా శిథిలాల కింద అనేకమంది!

Wayanad Landslide ప్రకృతి అందాలకు నెలవైన కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 93 మంది మరణించినట్టు గుర్తించామని కేరళ రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఇంకా 98 మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొంది. 116 మంది గాయపడగా, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది.

Wayanad Landslide

కాగా, వయనాడ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కేరళ పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో డ్రోన్లు, పోలీసు జాగిలాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు.

గత అర్ధరాత్రి వయనాడ్ ప్రాంతంలోని ముండకై వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను చురల్ మల వద్ద ఓ స్కూలు వద్దకు తరలించారు. అయితే తెల్లవారుజామున అక్కడ కూడా కొండచరియలు విరిగిపడడంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్నవారు గల్లంతయ్యారు. స్కూలు, పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి.

బురదతో కూడిన వరద ప్రవాహంలో చిక్కుకుని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేకమంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యాహ్నం కూడా ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Weight Loss Tips : భోజనానికి ముందు ఓ గ్లాసుడు నీళ్లు తాగారంటే.. కొన్ని రోజుల్లోనే నాజూకై పోతారు

0

Weight Loss Tips హోటల్ ఫుడ్‌తో పోల్చితే ఇంట్లో తయారుచేసిన ఆహారం అంత రుచిగా ఉండదు. అందుకే చాలా మంది ప్రతిరోజూ బయటి ఆహార తినడానికి ఆసక్తి చూపుతారు. ఫలితంగా జరిగిందేదో జరుగుతుంది. రోజురోజుకీ బరువు అమాంతం పెరిగిపోతుంటారు. సమతుల్య ఆహారం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది.

Weight Loss Tips

బరువు అదుపులో ఉంచుకోవాలంటే సరైన జీవితాన్ని గడపడం చాలా అవసరం. తగినంత నీరు, మితమైన నిద్ర కూడా అవసరం. ఓ అమెరికన్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే తినడానికి ముందు నీరు తాగాలని పేర్కొంది.

ఒక ప్రయోగంలో 12 వారాల పాటు భోజనానికి ముందు నీరు తాగిన వారు వేగంగా బరువు తగ్గారని తేలింది. దీనికి విరుద్ధంగా భోజనానికి ముందు నీరు త్రాగని వారు బరువు తగ్గనట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ప్రకారం అల్పాహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు ఉండాలి. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా తినాలనే కోరిక పుట్టదు. అందుకు ఉడకబెట్టిన గుడ్లను ఉదయాన్నే తినడం మంచిది.

పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఎక్కువ ప్రోటీన్ తినడం, కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. అలాగే ప్రాసెస్డ్ ప్రొటీన్ రిచ్ ఫుడ్ తినడం వెంటనే మానుకోవాలి.

మితమైన ఆహారం, వ్యాయామం, నీళ్లతో పాటు బరువు తగ్గడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. జీవక్రియ చెదిరిపోతే, బరువు తగ్గడం కష్టం. బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మంచి శరీరక సౌష్టవం పొందాలంటే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Work Adjustment in AP Schools Updates

Work Adjustment in AP Schools Updates రాష్ట్ర విద్యా శాఖ ఆగష్టు నెలలో పని సర్దుబాటు చేయనుంది.

Facial App(TIS TILE):
ఉపాధ్యాయుల ప్రధాన వివరాలు సమర్పించుటకై Facial Attendance యాప్ నందుTeacher Information System అనే కొత్త Tile ఎనేబుల్ చేయడమైనది.

Download Updated Attendance App for TIS Tile Click Here

అసలు డిగ్రీ, పీజీ, బి.ఈడీ లేని వారు సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు..డిగ్రీ, పీజీ లో నో సబ్జెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. బి.ఈడీ లో అదర్ మెథడాలజీ, పీజీ లో నో సబ్జెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి (IT Cell Info)

♦️B. ED చేయని వారు మెథడాలజి కోలమ్ లో డ్రాప్ డౌన్ లో OTHER METHODOLOGY పైన క్లిక్ చేయమని ఇప్పుడే ఐటి సెల్ వారు తెలియజేసారు…

♦️PG లేనివారు పిజి ఆప్షనల్ సబ్జక్టుల ఇన్ పిజి కోలమ్ దగ్గర డ్రాప్ డౌన్ లో NO SUBJECT CLICK చేయాలి…

  1. Facial App నందు లాగిన్ కావలెను.
  2. యాప్ నందు కిందన ఉన్న Teacher Information system టైల్ ను టచ్ చేయవలెను.
  3. Date of Birth,Date of joining in present school,Date of joining in present cadre,Date of appointment లను ఇచ్చిన కేలండర్ నుండి తప్పు లు లేకుండా సెలక్షన్ చేసుకుని సబ్మిట్ చేయవలెను
  4. Degree optionals నందు మీ డిగ్రీ లోని అన్ని ఆప్షనల్ సబ్జెక్టు ల వద్ద ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకోవలెను.
  5. ఒకవేళ మీకు డిగ్రీ లేకపోతే No Subject అని సబ్మిట్ చేయవలెను.
  6. మీ డిగ్రీలోని అన్ని ఆప్షనల్ సబ్జెక్టు లను తప్పక సబ్మిట్ చేయాలి.
  7. అలాగే PG సబ్జెక్టు వివరాలు కూడా సబ్మిట్ చేయాలి.
  8. B.Edలేదా తత్సమాన అర్హతలలోని Methodology లను బాక్స్ లపై క్లిక్ చేసి ఎంచుకొని సబ్మిట్ చేయవలెను.
  9. B.Ed లేనిచో “Other subject” తీసికొని సమర్పించవలెను.
  10. Designation: మీ ప్రస్తుత designation ఇచ్చిన డ్రాప్ డౌన్ నుండి సరిగ్గా ఎంచుకొనవలెను.
  11. ఫైనల్ గ సబ్మిట్ చేసి తిరిగి Tileపై నొక్కితే మీరు‌సబ్మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి.
    ఈ విధంగా ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేసిన డేటా ను మీమీ DDOలు చెక్ చేసి confirm చేయుదురు.

ఇది కేవలం ఒక నిముషం పని మాత్రమే.

Download Your TIS Report Card. Know the detailed process click here

TIS PDF డౌన్లోడ్ కొరకు లాగిన్ అవుతుందా ? లాగిన్ అయితే డౌన్లోడ్ అవుతుందా ?

ఈ రోజు WebEx మీటింగ్ మినిట్స్

కమీషనర్, పాఠశాల విద్య వారి మీటింగ్ వివరాలు Download from Here

విసిట్స్ & ఇన్స్పెక్షన్స్: ఈ నెల వచ్చే వారం నుండి కమీషనర్ మరియు సెక్రటరీ గారి విసిట్స్ అన్ని జిల్లా లలో ఉంటాయి. దీనికి సంబంధించి విసిట్స్ & ఇన్స్పెక్షన్స్ ఫార్మేట్ ముందుగానే కమీషనర్ గారు ఇస్తారు దానిలోని అంశాలను మాత్రమే కమీషనర్ మరియు సెక్రటరీ గారు వారి సందర్శనా సమయం లో పరిశీలిస్తారు. ఆకస్మిక తనికీలు ఉండవు. ముందుగా చెప్పే వస్తారు.

ప్రతికూల వార్తలు: పత్రిక లలో వచ్చే Adverse న్యూస్ కు సంబంధించి వెంటనే స్కూల్ ను సంబదిత మండల విద్యాశాకాధికారి సందర్శించి సమగ్ర నివేదికను అదే రోజు ఇవ్వాలి. ఎదైనా ఇష్యూ జరిగినపుడు ప్రెస్ కంటే ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి, కమీషనర్ లకు తెలిజేయాలి . దీనికి సంబంధించి పత్రికా ఖండన స్టాండర్డ్ ఫార్మేట్ కమీషనర్ గారు ఇస్తారు దానిని ఎడిట్ చేసి పత్రికా ఖండన ను ఇవ్వాలి

లెస్సన్ ప్లాన్ : అందరు ఉపాద్యాయుల దగ్గర తప్పని సరిగా లెస్సన్ ప్లాన్ లు ఉండాలి . దానిపై తప్పనిసరిగా ప్రదానోపాద్యాయుని సంతకం ఉండాలి వచ్చే సంవత్సరం అన్ని lesson plans సాఫ్ట్ కాపీలు ఇస్తారు.

ఉపాద్యాయుల సర్దుబాటు : వర్క్ అడ్జస్ట్మెంట్ అంతా ఆన్లైన్ లోనే చేస్తారు. మొదట అదే మండలం – అదే సబ్జెక్టు చేస్తారు తరువాత అదే మండలం – ఇతర సబ్జెక్టు చేస్తారు. అ తరువాత పక్క మండలం అదే సబ్జెక్టు చేస్తారు తరువాత పక్క మండలం ఇతర సబ్జెక్టు చేస్తారు.ఇంకా ఉపాద్యాయులు మిగిలి ఉంటె అప్పుడు డివిజన్ లెవెల్ లో చేస్తారు. బ్లైండ్ మరియు వచ్చే ఏప్రిల్ లో రిటైర్ అయ్యే వారికీ మినహాయింపు ఉంటుంది. వచ్చే వారం నుండి వర్క్ అడ్జస్ట్మెంట్ ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తారు.

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు : షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి ఎదైనా సమస్యాత్మక అంశాలు ఉంటె వెంటనే జిల్లా కార్యాలయమునకు తెలియజేయాలి. సంబదిత SHO తో మాట్లాడాలి.

స్టేట్ అవార్డ్స్ : గతం లో ఇచినట్లు గా కాకుండా మూడు రకాల కేటగిరి లలో రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు ఇస్తారు. 1.State Awards. 2. National Foundation for Teachers Welfare Awards 3. Recommended by Fellow Teacher కేటగిరి అయిన Recommended by Fellow Teacher అవార్డు కు ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా నుండి నామి నెట్ చేస్తారు. ఈ నెల 5 వ తేదీ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ.

SSC ఎగ్జామ్స్ : పదవతరగతి పరీక్షా కేంద్రాలు అవసరం అయితే మార్పు చేయవచ్చు. సి కేటగిరి సెంటర్స్ తగ్గించాలి. బ్లూ ప్రింట్ వెబ్ సైట్ లో ఉంది దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి ప్రకారం పిల్లలలను పరీక్షలకు సిద్ధం చేయాలి నామినోల్ రోల్ ను ఇప్పటినిండా రెడీ చేసుకుంటే తప్పులు జరగ కుండా ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ కు ఓల్డ్ సిలబస్ లోనే పరీక్ష ఉంటుంది

కొత్త స్కూల్స్ ఓపెనింగ్ పర్మిషన్ /renewals : MEO / DyEO / DEO స్టేజిలందు మూడురోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. రెకమండేషన్స్ క్లియర్ గా ఉండాలి

N T బుక్స్ : ఇంకా ఏదయినా requirement ఉంటె అర్జెంటు గా ఇండెంట్ పెట్టాలి

NOC వీసా : ఎవరైనా ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయులు లాంగ్ లీవ్ పెట్టి ఇతర దేశాలు వెళితే వారి స్తానం లో ఇంచార్జి గా ఎవరిని పెట్టారో వారి వివరాలు అప్లికేషన్ లో ఇవ్వాలి

స్కూల్ కాంప్లెక్స్ లు : స్కూల్ కాంప్లెక్స్ లు సమీక్షించాలి మండలానికి 4 లేదా 5 స్కూల్ కాంప్లెక్స్ లు ఉండాలి, అన్ని స్కూల్ కాంప్లెక్స్ లలో సుమారుగా సమాన జనాభా, సమాన స్కూల్స్ ఉండే టట్లు చూడాలి తప్పనిసరిగా ఉన్నత పాఠశాల మాత్రమే కాంప్లెక్స్ పాఠశాల గా ఉండాలి. మౌలిక వసతులు, ప్లే గ్రౌండ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కి వీలుగా ఉండాలి . MEO స్కూల్ కాంప్లెక్స్ HM స్కూల్స్ ఈ విధముగా వర్క్ ఫ్లో ఉండాలి. డెలిగేషన్ అఫ్ పవర్స్ ను స్కూల్ కాంప్లెక్స్ HM లకు ఇవ్వడానికి అధ్యయనం జరుగుతుంది.

విద్యా మిత్ర : స్టూడెంట్స్ కిట్స్ ఇప్పటికే పంపిణి చేయబడ్డాయి. షూ సైజు లు చాలక పొతే మండల మేళా జిల్లా మేళా నిర్వహించి మార్చుకోవాలి . అప్పటికి ఇంకా అవసరం ఉంటె స్టేట్ కి తెలియజేయాలి.

ఒకేషనల్ ఎడ్యుకేషన్ : కేజీబీవీ లు మరియు PMSHRI స్కూల్స్ నందు ఒకేషనల్ ఎడ్యుకేషన్ బాగా జరిగే విధంగా చూడవలెను

TaRL : 3 నుండి 5 వతరగత లకు అన్ని స్కూల్స్ లో జరిపించవలెను

లిప్ (LIP ) : అన్ని ఉన్నత పాఠశాలల లో జరగాలి

PAL : జిల్లాలో ఉన్న 5 ల్యాబ్ లలో ట్యాబు లద్వారా బోధన జరగాలి

టీచ్ టూల్ : టీచ్ టూల్ Observations ను అందరు observers చేయాలి

లైబ్రరీ బుక్స్ : అన్ని స్కూల్స్ కు లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయబడ్డాయి . వాటిని బీరువాలలో దాయకుండా పిల్లలకు చదవాడినికి ఇవ్వాలి

స్కూల్ గ్రాంట్స్ : అన్ని పాఠశాల లకు ఇస్తారు . దానికి సంబంధించి నాడు నేడు లా ఒక app ఇస్తారు దాని లో బిల్స్ అప్లోడ్ చేయాలి

OoSC : బడి బయట పిల్లల వివరాలు ఖచ్చితముగా ఉండాలి. జిల్లాకు 4 seasonal హాస్టల్ ఇచ్చారు. వాటిలో పిల్లలలను జాయిన్ చేయాలి

రవాణా చార్జీలు : 1km పరిధిలో ప్రాధమిక పాఠశాల, 3km పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల మరియు 5km పరిధి లో ఉన్నత పాఠశాల అందు బాటు లేనటువంటి పిల్లలు కు నెలకు రూ.600/- లు చొప్పున 10 నెలలకు 6000/- ఇస్తారు

IERPS : వీళ్ళు చేసిన ప్రత్యేక అవసరాల గల పిల్లల సర్వే లో ఉన్న పిల్లలు UDISE లో ఉన్న పిల్లలకు తేడా ఉంది దానిని సవరించాలి

PM పోషణ = గోరుముద్ద : మధ్యాహ్న భోజన పథకం సక్రమం గా జరగాలి. న్యూట్రిషన్ గార్డెన్ అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి. హ్యాండ్ వాష్ ను ఏర్పాటు చేయాలి హ్యాండ్ వాష్ పోస్టర్ ను పిల్లలు చేతులు కడుగు ప్రదేశం లో అతికించాలి.

De Warming డే : ఆగష్టు 7 న అన్ని పాఠశాలలో De Warming &

CBSE స్కూల్స్ : జిల్లాలో ఉన్న 40 CBSE స్కూల్స్ లో 10 ఆగష్టు నుండి Formative Assessment ట్యాబు ల సహాయం తో CBSE Pattern లో పెట్టాలి. దానికి ట్యాబు లు రెడీ చెయ్యాలి పరీక్షలు చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించాలి

అకాడమిక్ క్యాలండర్: ఇప్పటికే విడుదల చేసిన అకాడమిక్ క్యాలండర్ ను తప్పని సరిగా ఫాలో అవ్వాలి . పాఠశాలల్లో మొదటి పిరియడ్ ను సంసిద్ధత కార్యక్రమాలకు మరియు చివరి పిరియడ్ ను వెనుక బడిన పిల్లలకు బ్రిడ్జి కోర్స్ ను నిర్వహించాలి

స్ట్రిక్ట్ టీచర్స్ : ప్రతి DyEO పరిధి నుండి 20 మంది ప్రిక్ట్ టీచర్స్ ను సెలెక్ట్ చేసి జిల్లా కార్యాలయం నకు ఆ జాబితా పంపించాలి

UDISE +: గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పిల్లలు చాలా తరగతు లందు తక్కువుగా వున్నారు కావున వారు ఏ స్కూల్ లో చేరారో వెరిఫై చెయ్యాలి. బౌతికంగా ఉన్న పిల్లలలు UDISE + లో ఉన్న పిల్లలలు సమానంగా ఉండాలి. చాలా ప్రైవేట్ స్కూల్స్ నందు చాలా తేడా ఉన్నది.

అటెండన్స్ : ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు నమోదు 100 కి 100 శాతం జరగాలి. కొన్ని స్కూల్స్ రిపీటెడ్ గా హాజరు వేయటం లేదు వాటి పై చర్యలు తీసుకోవాలి

మన బడి – మన భవిష్యత్తు : తక్కువ డబ్బులతో పని పూర్తి చేయగల పాఠశాలల పై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయాలి

Work Adjustment Draft Guidelines Work Adjustment Of Subject Teachers (SAs)/SGTs

Guidelines for Drafting Surplus Teachers:

Junior Most teacher in the school shall be taken as Surplus teacher.

First preference will be given to schools with no Subject Teacher or SGT available.

Exclude any surplus teachers who are set to retire on or before April 30, 2025, from the adjustment process. Ensure that no 100% individuals with visual impairments (blindness) requiring work adjustments are assigned.

Criteria for preparation of seniority list of Surplus Teachers:

Cadre seniority of surplus teachers in inter management. If cadre seniority ties, the DOB will be considered.

Ensuring Subject Teachers Availability:

Subject teachers should be available in all High Schools after the completion of the work adjustment exercise.

work adjustment in ap schools

Work Adjustment in AP Schools Updates Of Subject Teachers (SAs)/SGTs:

Phase-I:

  • Intra Management with in Mandal
  • Same subject within Mandal
  • Inter subject within Mandal
  • SGTs qualified with in Mandal

Phase-II:

  • First preference within Management, within Division,
  • if still surplus have go for intra management.
  • Same subject with in Division
  • Inter subject with in Division
  • SGTs qualified within Division

Work Adjustment in AP Schools Important information to all the teachers

ఈ రోజు (03.08.2024) 2 pm తరువాత క్రింది అంశాలు ఫేషియల్ అటెండెన్స్ ఆప్ నందు POP UP అవుతాయి

1. Date of birth

2. Date of joining in present school

3. Date of joining in present cader

4. Date of Appointment

5. Optional subjects in Graduation

6. Optional subjects in Post graduate

7. Methodology in B.Ed

8. Present Designation

వివరాలు అన్ని ఎవరి లాగిన్ లో వారు popup అయిన వెంటనే విధిగా నింపాలి. ప్రతి టీచర్ పై వివరాలు అన్ని ఒక కాగితం పై వ్రాసుకొని తప్పులు లేకుండా నింపాలి. అందరూ టీచర్స్ ఈ రోజు సాయంత్రం లోపు ఖచిత్తం గా పూర్తి చేసి పంపాలని పాఠశాల విద్యా కమిషనర్ గారి ఆదేశాలు. ఈ వివరాలు ఆధారం గానే work adjustment జరుగుతాయి . పై వివరాలు అన్ని సిద్ధం గా ఉంచుకోగలరు.

Update Your Details in this updated app Click Here

Work Adjustment in AP Schools CSE సమాచారం

1) ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన వారిని అదే మండల పరిధిలో పని సర్దుబాటు చేస్తారు. ఆ మండల పరిధిలో తగినంత అవసరం లేనప్పుడు డివిజన్ పరిధిలో సర్దుబాటు చేస్తారు.

2) పురపాలక పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన వారిని సాధ్యమైనంతవరకు అదే పురపాలక పరిధిలో అవసరమైన చోట పని సర్దుబాటు చేస్తారు.

3) పదవ తరగతి విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాయడంపై ఒక వారం రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు.

4) పరీక్షా విధానం అమలుపై స్పష్టమైన నిర్ణయాన్ని ఒక వారం రోజుల్లో తెలియజేస్తామన్నారు.

5) ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని హేతుబద్దీకరణ ద్వారా సర్దుబాటు చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారు.

6) సంఘాల ప్రాతినిధ్యం మేరకు పాఠశాల విద్యలో పదోన్నతులు చేపట్టడానికి సుముఖతను వ్యక్తం చేశారు.

Webex Information

ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అర్జడీలకు, డీఈఓ లకు, మరియు ఎంఈఓ లకు నిర్వహించిన వెబ్ ఎక్స్ నందలి ముఖ్య విషయాలు.

1)UDISE+
యుడైస్ నందలి గ్యాప్స్ ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి.
తరగతిలో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు UDISE+ నందు ఆన్లైన్ తప్పనిసరిగా చేయాలి
వచ్చేవారం నుండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మరియు మినిస్టర్ గారు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉన్నది.
వారు యుడైస్ రోల్ గురించి పరిశీలించే అవకాశం కలదు.

2) Work Adjustments

Udise+ నందు గల రోల్ ఆధారం చేసుకొని పాఠశాలల యందు మిగులు ఉపాధ్యాయులను ఆన్లైన్ విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయుటకు మార్గదర్శకాలు తయారు చేయుచున్నారు.
వచ్చేవారం దీనికి సంబంధించిన విధివిధానాలు, ఆన్లైన్ మాడ్యూల్, షెడ్యూల్ మొదలగునవి విడుదల అగును.

4)SMC Elcetions

ప్రభుత్వం వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాల యందు SMC ఎన్నికలు సజావుగా నిర్వహించేటట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలెను.
SMC ఎలక్షన్ ముగిసే వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదు

3) EIS (TIS)

ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చెక్ చేసుకుని అందులో ముఖ్యంగా
1)పుట్టినరోజు వివరములు
2)ప్రస్తుత పాఠశాలలో జాయిన్ అయిన తేదీ
3)ప్రస్తుత క్యాడర్లో జాయిన్ అయిన తేదీ
4)ఉద్యోగంలో అపాయింట్ అయిన తేదీ
5)గ్రాడ్యుయేషన్ లెవెల్ లో సబ్జెక్టులు
6)పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సబ్జెక్టులు
7)బీఈడీ లో మెథడాలజీలు
8)ప్రస్తుత క్యాడర్
మొదలగు అన్ని వివరములు ఈరోజు సాయంత్రం లోపల తప్పులు లేకుండా పూర్తి చేసుకోవలెను.

ఎడిట్ ఆప్షన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేయబడును
.
5)Academic Calendar
ప్రభుత్వం వారి ద్వారా ముద్రించిన అకాడమీ క్యాలెండర్లు వచ్చేవారు ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును.

6) Teachers Lesson plans

తరగతి గది నందు బోధించు ఉపాధ్యాయుని వద్ద ఆ రోజు, ఆ పాఠ్యాంశానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తప్పనిసరిగా తన వద్ద ఉంచుకొని బోధన సాగించవలెను.
ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన సహోపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ ను రాస్తున్నారా? లేదా? తరగతికి బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయంపై శ్రద్ధ వహించవలెను.

7) Below 10 enrollment

పాఠశాలల్లో పది లోపు విద్యార్థులు ఉన్న వాటిని గుర్తించి అందు విద్యార్థులను పెంచే విధంగా కృషి చేయవలెను, ఒకవేళ విద్యార్థులు పెరిగే అవకాశం లేకపోతే వాటిపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించబడును.

8) Facial Attendance

అందరూ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ తప్పక క్యాప్చర్ చేయవలెను.

Work Adjustment in AP Schools Updates

Cut of Date for Work Adjustment in AP Schools Updates : 04.08.2024

Check your school roll as on 04.08.2024 with your school DISE code Click Here

work adjustment in ap schools

As per instructions received from the Hon’ble CSE sir,all the teachers are instructed to update/verify your TIS data immediately.

work adjustment in ap schools updates
april 27, 2026, 1:35 am - duniya360

Work Adjustment in AP Schools Updates – Way forward in work adjustment module

The work Adjustment module is designed based on the data available in Teacher Information System (TIS) portal.

Some data discrepancies were identified during the review of the Work Adjustment module conducted with certain field functionaries.

This will be happened due to not updating following data points in Teacher Information System (TIS) portal by Teachers.

1.Date of birth

2.Date of joining in the present school

3. Date of joining in the present cadre of post

4. Date of appointment

5. Optional subjects in graduate level

6. Optional subject in PG level

7. Methodologies in B.Ed level

8. Present designation.

DEOs should ensure that all MTS Teachers should be registered in schools which they were allocated in TIS portal.

In this regard, the District Educational Officers to ensure that all the teachers must cross check and update their individual profiles in Teacher Information System (TIS) portal.

Mean time, the above fields updation will be provided in Facial Recognition App for immediate data updation for seamless process.

The DEOs should prioritize this task and must monitor personally.

School Holidays : విద్యార్ధులకు శుభవార్త.. స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 5 రోజులు సెలవులు.. ఆ ఒక్క పని చేస్తే

School Holidays సెలవు అంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఇప్పటికే వేసవి సెలవులు పూర్తి చేసుకుని.. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మన దగ్గర జూన్‌ నెల నుంచే స్కూల్స్‌ మొదలు కాగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం.. వేసవి వడగాల్పులు, ఎండ తీవ్రత కారణంగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభించారు. అయితే స్కూల్స్‌ ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలో విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. మరి ఇంతకు ఈ సెలవులు ఎందుకు.. ఏ రోజున హాలీడే ఉంది అంటే..

School Holidays

School Holidays ఆగస్ట్ నెల ప్రారంభం అయ్యింది. ఈ నెలలో స్కూళ్లకు, కాలేజీలకు చాలా సెలవులు రానున్నాయి. సాధారణంగా ఆగస్టు నుంచి పండగలు మొదలవుతాయి. వీటికి తోడు రెండో శనివారం, ఆదివారాలు కలిసి.. విద్యార్థులకు భారీగా హాలీడేస్‌ రానున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 4 ఆదివారం, ఆగస్ట్ 10.. రెండో శనివారం, 11 రెండో ఆదివారం. వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. ఈ రెండు రోజులు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. అలానే ఆగస్టు 18 ఆదివారం, 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

అయితే ఆగస్టు 15, 16, 18, 19 సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 ఒక్క రోజు హాలీడే తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి. ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్ లేదా కాలేజ్ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం.

సెలవుల జాబితా

  • ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం
  • ఆగస్టు 18 ఆదివారం
  • ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి

ఇక పైన పేర్కొన్న సెలవులు ఉద్యోగులకు కూడా మాగ్జిమం వర్తించే అవకాశం ఉంది. కనుక ఎక్కడికైనా లాంగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవాలని భావించే వారు.. ఈ సెలవులను వినియోగించుకుంటే చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేయండి.

Rats in Tirumala Rest Rooms : ‘తిరుమల వసతి గదుల్లో ఎలుకల సంచారం’: భక్తుడి ఫిర్యాదు

Rats in Tirumala Rest Rooms తిరుమలలోని వసతి గదుల్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని, గదిలో ఉంచిన శ్రీవారి ప్రసాదాలను అవి తింటున్నాయని చిలకలూరిపేటకు చెందిన భక్తుడు లక్ష్మణ్‌ తితిదే ఈవో జె.శ్యామలరావుకు ఫిర్యాదు చేశారు.

Rats in Tirumala Rest Rooms

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని వసతి గదుల్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని, గదిలో ఉంచిన శ్రీవారి ప్రసాదాలను అవి తింటున్నాయని చిలకలూరిపేటకు చెందిన భక్తుడు లక్ష్మణ్‌ తితిదే ఈవో జె.శ్యామలరావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల ఫిర్యాదులకు ఈవో సమాధానాలిచ్చారు. శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏయే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కడపకు చెందిన భాస్కర్‌ కోరారు. తిరుత్తణిలో తితిదే స్థలం ఆక్రమణకు గురవుతోందని నగరికి చెందిన నాగరాజన్‌ ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణకు చెందిన రాజేష్‌ చెప్పారు. తొమ్మిది నెలల క్రితం తితిదేలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఇంతవరకు రాత పరీక్ష నిర్వహించలేదని తిరుపతికి చెందిన దేవానంద్‌ ఫిర్యాదు చేశారు. వీటన్నింటికీ ఈవో స్పందించారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.