CrimeKarnataka హీరోయిన్ లాంటి భార్య.. ఊరిలో పలుకుబడి.....

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Karnataka హీరోయిన్ లాంటి భార్య.. ఊరిలో పలుకుబడి.. కానీ భర్త మాత్రం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కలకాలం కలిసి ఉంటామని చేసుకుంటున్న ప్రమాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భార్యా భర్తల బంధాన్ని దంపతులు తమ చేష్టలతో, మాటలతో తెంపుకుంటున్నారు. దీంతో మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. మానసికంగా మదనపడుతున్నారు. గొడవలు అవుతున్నా.. పిల్లల కోసం కలిసి ఉండాలన్న ధోరణితో కాపురాన్ని మరింత జఠిలం చేసుకుంటున్నారు. సమస్యను మరింత పెద్దది చేసుకుని ఒకరిపై ఒకరు చంపేంత కక్ష పెంచుకుంటున్నారు. కడకు జీవిత భాగస్వామిని కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది కర్ణాటకలో కూడా. అందమైన భార్య. ఊరందరికీ తెలిసిన మహిళ. చాలా పలుకుబడి ఉంది. కానీ భర్తకు ఆమెంటేనే గిట్టదు. మనస్పర్థలు కారణంగా భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని వీర్రాజు పేట శివారులోని బేటోలీ గ్రామంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు బోప్పన్న, శిల్పా సీతమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. శిల్పా సీతమ్మకు ఈ ఊరిలో పెద్ద మనిషి. గతంలో ఆమె గ్రామ పంచాయతీ సభ్యురాలిగా వర్క్ చేసింది. 2012 నుంచి 2017 వరకు బేటోలి గ్రామపంచాయతీ సభ్యురాలిగా పనిచేసింది. ఆమెకు గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. ఇదిలా ఉంటే భార్యా భర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్న వేర్వేరు కుంపటి. పిల్లల కోసం కలిసి జీవిస్తున్నారు. అయితే తనకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలంటూ శిల్పా కోరగా.. భర్త ససేమీరా చెప్పాడు. దీనిపై ఆమె కోర్టులో కేసు వేసినట్లు కూడా తెలుస్తుంది.

కేవలం పిల్లల కోసమే ఇద్దరు భార్యా భర్తలుగా కలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న కంచాలు, మంచాలు వేర్వేరని స్థానికులు అనుకుంటున్నారు. అయితే గత రాత్రి కూడా ఓ విషయంపై భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. ప్రతి నెల డబ్బుల కోసం తనను వేధిస్తుందని, ప్రతి విషయంలోనూ ఆమెతో తగాదాలు జరుగుతున్నాయని భావించిన భర్త .. శనివారం ఉదయం.. భార్యను కాల్చి హత్య చేశాడు. అనంతరం వీర్రాజు పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేశానని చెప్పాడు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు బోప్పన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this