Tuesday, September 9, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Crimeసోషల్ మీడియాలో పరిచయం.. రూ. 2 కోట్లు...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

సోషల్ మీడియాలో పరిచయం.. రూ. 2 కోట్లు కాజేసిన గ్యాంగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 తిరువనంతపురంకు చెందిన ఒక వ్యక్తికి సోషల్ మీడియాలో నలుగురు వ్యక్తులు పరిచమయ్యారు. అనంతరం ఆ నలుగురు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆ వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి రెండు కోట్ల రూపాయలను దోచేశారు. ఈ కేసులో కోజికోడ్ లోని నల్లాలంకు చెందిన సాధిక్ (48), ఇడుక్కి తొడుపుజాకు చెందిన షెఫీక్ (37), కోజికోడ్ వడకర ఇరింగల్కు చెందిన సాదిక్ (24), త్రిసూర్ పూకోడ్కు చెందిన నందుకృష్ణ (21)లను తిరువనంతపురం సిటీ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. 

ఆన్ లైన్ ద్వారా బాధితునికి నిందితులు దగ్గరయ్యారు. అనంతరం లాభాలు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లో  పెట్టుబడులు పెట్టాలని సలహాలు ఇచ్చారు. మొదట్లో లాభాలను చూపించి బాధితున్ని నమ్మించారు.  అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అప్లికేషన్లను బాధితుడి ఫోన్ లో ఇన్ స్టాల్ చేశారు. వారు చెప్పినట్లు చేసిన తర్వాత రెండు కోట్ల రూపాయలు కాజేశారు. 

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితుడు, నిందితుల మధ్య వాట్సాప్ చాటింగ్ ఆధారంగా తిరువనంతపురం సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ నిద్దిన్రాజ్ ఆధ్వర్యంలో  సైబర్ క్రైమ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ సీఎస్ హరి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు కాజేసిన డబ్బు రాష్ట్రంలోని వివిధ జాతీయ బ్యాంకుల శాఖల ద్వారా బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా కొంతమందికి కమీషన్ ఆశ చూపి వివిధ ఖాతాల్లోకి ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు. తిరువనంతపురం సిటీ వ్యాప్తంగా నిందితులు కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన ఖాతాదారుల  నెంబర్లు తీసుకుని ఇలాంటి క్రైమ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. 

అరెస్టయిన వారిలో మలప్పురం పాపన్నూరుకు చెందిన సాధిక్ ప్రధాన నిందితుడని తెలిపారు. సాదిక్ కు  మన్హు అని ప్రధాన అనుచరుడు ఉన్నట్లు విచారణలో తేలిందని.. అతను కంబోడియాలోని కాల్ సెంటర్ ద్వారా ఈ నేరాలన్నీ ప్లాన్ చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బ్యాచ్ ఇలా కాజేసిన సొమ్మును డిజిటల్ కరెన్సీగా మార్చి కంబోడియాకు పంపిస్తారని తెలిపారు. ఈ కేసులో ప్రమేయమున్న మరికొంతమంది నిందితుల కోసం విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వి. శిబు, సునీల్ కుమార్, సీనియర్ సివిల్ పోలీసు అధికారులు బి. బెన్నీ, పిఎస్ ప్రశాంత్, సివిల్ పోలీసు అధికారులు వి.విపిన్, ఆర్. రాకేష్, ఎస్.మణికంఠన్ తదితరులున్నారు.

Source:V6 News Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this