Friday, June 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
CrimeCyber Crime వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Cyber Crime వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Cyber Crime : సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చారు. కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈసారి సైబర్ క్రిమినల్స్ కన్ను వృద్ధులపై పడింది. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయిస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నారు. కొత్త తరహా సైబర్ మోసాల గురించి కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ రామారావు వివరాలు వెల్లడించారు.

Cyber Crime

రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేసుకుని లక్షలు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. తొలుత వాట్సప్ వీడియో కాల్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ఎత్తిన వెంటనే అమ్మాయిలు కనిపిస్తారు. వారు నగ్నంగా ఉంటారు. వారి ఒంటి మీద నూలుపోగు కూడా ఉండదు. అమ్మాయిలు మూడు, నాలుగు నిమిషాలు వృద్ధులతో చాటింగ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే వాట్సాప్ కు ఆ వీడియోని పంపిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

Cyber Crime మేము పోలీసులం అంటూ వృద్ధులకు ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేస్తారు. 10 లక్షలు నుండి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారి మాటలకు భయపడి బాధితులు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటున్నారు. కాగా, రిటైర్ అయిన ఉద్యోగులని సైబర్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వచ్చి చెబుతున్నారు కాని ఫిర్యాదు మాత్రం చేయడం లేదని పోలీసులు తెలిపారు. బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ సీఐ రామరావు పేర్కొన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this