Tuesday, September 9, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
CrimeScam in Bank బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు…...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

Scam in Bank బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు… ఏకంగా రూ.40కోట్లు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Scam in Bank ప్రస్తుతం కాలంలో చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే భావనలో ఉంటున్నారు. ఈ క్రమంలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు అయితే ఎంతో అమాయకంగా కనిపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. తమ అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి.. జనాలను నిండ ముంచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా అలానే బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా రూ.40 కోట్లను కొల్లగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Scam in Bank

హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో ఇండస్ ఇండ్ అనే బ్యాంకులో రామస్వామి అనే వ్యక్తి మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే డెలివరీ మేనేజర్ రాజేశ్ తో కలిసి బ్యాంకుకు రూ.40 కోట్లు నష్టం చేశారని ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రాంతీయ అధికారి మణికందన్ రామనాధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామస్వామి, రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి

Scam in Bank ఆర్థిక మోసాల్లో బాగా ఆరితేరిన బషీద్ డబ్బు కోసం రామస్వామితో కలిసి ప్లాన్ వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపాడు. రామస్వామి, రాజేశ్‌ లు ఆదిత్య బిర్లా సంస్థ అకౌంట్ లోని 40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఖాతాలకో బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్‌ ఆ నగదు ఇతర అకౌంట్లకు  బదిలీ చేశాడు. ఈ క్రమంలో అలా వచ్చిన డబ్బులతో నిందితుడు బషీద్‌ రెండు కార్లు కొనుగోలు చేశాడు. తాను చేసిన మోసానికి సాయం చేసిన బ్యాంకు మేనేజర్ రామస్వామికి కారును  గిఫ్ట్ గా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా ఉన్న బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి..నగరానికి తీసుకొచ్చారు.

ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబై నారీమన్‌పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖలో అకౌంట్ ఉంది. ఆ సంస్థ పర్మిషన్ లేకుండానే అకౌంట్ నుంచి జులై 12వ తేదీ నుంచి 40 కోట్లు విత్‌ డ్రా అయ్యాయి. ఈ క్రమంలోనే అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన  బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ బ్రాంచి మేనేజర్‌ రామస్వామి, బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌ డబ్బులను పక్కదారి పట్టించినట్లు తేలింది. జులై 15వ తేదీ నుంచి బ్యాంకు మేనేజర్‌ రామస్వామి విధులకు రావడం లేదు. అనుమానమొచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు రామస్వామి, రాజేశ్‌ను గతనెల 24వ తేదీన అరెస్టు చేశారు. వారిని విచారించగా బషీద్‌ హస్తం బయటపడింది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this