Wednesday, June 11, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NationalKarnataka Health Minister : జైపూర్‌ నుంచి...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Karnataka Health Minister : జైపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Karnataka Health Minister శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది. జైపూర్‌ నుంచి బయలుదేరిన రైలులో 90 కంపార్ట్‌మెంట్లలో మూడు టన్నుల బరువున్న మాంసం లభ్యమైంది. సమాచారం అందుకున్న గో సంరక్షకులు స్టేషన్‌కు చేరుకుని కుక్క మాంసం అంటూ నానా హంగామా చేశారు.

Karnataka Health Minister

కాగా.. పోలీసు శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి 84 మాంసం నమూనాలను సేకరించారు. జంతువుల జాతులకు సంబంధించిన విశ్లేషణ కోసం నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. జంతు మాంసం రవాణా ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధన సంస్థకు పంపించారు. ఇక్కడి నుంచి వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఆ మాంసం గొర్రెలదేనని నిర్ధారించారు.

Karnataka Health Minister  ఈ కేసులో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మాంసం రవాణాపై మొదటి ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ పనిని అడ్డుకున్నందుకు గోసంరక్షకుడిపై రెండవ ఎఫ్‌ఐఆర్.. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో గుమిగూడినందుకు గోసంరక్షకుడు, అతని సహచరులపై మూడవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిరోహి అనే ప్రత్యేక మేక జాతికి చెందిన మాంసం అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారి తెలిపారు. ఇది సాధారణంగా రాజస్థాన్.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో లభిస్తుంది. అయితే.. కర్ణాటకలో మటన్ సరఫరా తక్కువగా ఉండడంతో కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this