Friday, May 23, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra PradeshGodavari Pushkaralu : వడివడిగా గోదావరి పుష్కరాలకు.....

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Godavari Pushkaralu : వడివడిగా గోదావరి పుష్కరాలకు.. పనుల ప్రతిపాదనకు 16 మందితో ప్రత్యేక బృందం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Godavari Pushkaralu రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. చేపట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో కలెక్టర్‌ ప్రశాంతి 16 మంది కీలక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ తదితర శాఖల జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. రానున్న పుష్కరాలకు ఇప్పటి నుంచి చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేస్తుంది. 

Godavari Pushkaralu

బృందం ఏం చేస్తుందంటే..

పుష్కరాలు జరిగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటిస్తారు. ఘాట్ల పటిష్టత, విస్తరణ, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. గత పుష్కరాలకు ఒక్క రాజమహేంద్రవరానికే కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి అంతకు రెండు రెట్లకు మించి వస్తారని అంచనా. ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహణ, పనులపై మున్సిపల్‌ మంత్రితో కలిసి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

గంగా పుష్కరాల అధ్యయనం

గోదావరి పుష్కరాల కంటే ఏడాది ముందు గంగానది పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర పురపాలిక విభాగం అమలు చేస్తున్న విధానాలపై నివేదికను అనుసరించాలని నిర్ణయించారు. నిధుల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో స్పందించే అవకాశం ఉంది. పుష్కరాలకు పనులు సక్రమంగా జరగాలంటే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి పరిపాలన విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా ఎన్నికలు క్రతువు పూర్తి చేయాలని చూస్తున్నారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this