Home Blog Page 397

పది విద్యార్థులకు నేరుగా తుదిపరీక్షలు

    0

    • ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి

    న్యూస్ టోన్, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బీవీఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన గుంటూరు డీఈవో గంగాభవానితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు మధ్యలో ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం విద్యార్థుల హాజరు 70 శాతం వరకు నమోదైందన్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడు రకాల అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించామని వివరించారు. తరగతి గదిలో మాత్రమే బోధించేవి, ఇంటి దగ్గర నేర్చుకునేవి, స్వతహాగా ఐచ్ఛికంగా నేర్చుకునే అంశాలున్నాయని తెలిపారు. ఐచ్ఛికంగా నేర్చుకునే 35 శాతం అంశాలను పరీక్షల్లో ఇవ్వబోమని, భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఈ సిలబస్‌ ఉపయోగపడుతుందని వివరించారు.

    టీచర్ల బదిలీలకు తాజా షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ

      0

      • వచ్చేనెల 24నాటికి ప్రక్రియ పూర్తి
      • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

      న్యూస్ టోన్, ఒంగోలు విద్య, నవంబరు 25 : ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.  పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసిన నేపథ్యంలో షెడ్యూల్‌ను పది రోజులు పొడిగించింది. మొదట ప్రకటించిన ప్రకారం డిసెంబరు 14తేదీకి బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా తాజా షెడ్యూల్‌ ప్రకారం 10రోజులు ఆలస్యంగా డిసెంబరు 24నాటికి పూర్తికానుంది. బదిలీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసినందున దరఖాస్తులను పునఃపరిశీలన చేయనున్నారు. 

      తాజా షెడ్యూలు ఇదీ.

      ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన తాజా షెడ్యూల్‌ ఈనెల 28 నుంచి అమల్లోకి వస్తుంది. 

      🔹ఈనెల 28, 29 తేదీలలో ప్రత్యేక బృందాలు బదిలీ దరఖాస్తులను పునఃపరిశీలిస్తాయి. 

      🔹ఈనెల 30 నుంచి డిసెంబరు 2వరకూ ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 

      🔹డిసెంబరు 3, 4 తేదీల్లో  ప్రాథమిక, సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 

      🔹డిసెంబరు 5, 6, 7 తేదీల్లో టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించి పరిష్కరిస్తారు. 

      🔹డిసెంబరు 8, 9, 10 తేదీల్లో ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 

      🔹డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకున్న పాఠశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇస్తారు. 

      🔹డిసెంబరు 16 నుంచి 21 వరకు కేటాయించిన స్థానాలతో వెబ్‌సైట్‌లో టీచర్ల బదిలీల ఉత్తర్వులు ఉంచుతారు. 

      🔹డిసెంబరు 22, 23 తేదీల్లో బదిలీల ఉత్తర్వులో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తారు. 

      🔹డిసెంబరు 24న ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత అధికారుల అనుమతితో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.

      టీచర్ల బదిలీల రివైజెడ్ షెడ్యూల్ 25.11.2020

        0

        అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సవరణ జీవో 59 ను అనుసరించి బదిలీల సవరణ షెడ్యూల్ ను కమీషనర్ శ్రీ చిన వీరభద్రుడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లోని ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

        ★ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28 -29
        ★ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 – డిశంబర్ 2
        ★ అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: డిశంబర్ 3 – 4
        ★ జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: డిశంబర్ 5 – 7
        ★ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: డిశంబర్ 8 – 10
        ★ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిశంబర్ 11 – 15
        ★ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిశంబర్ 16 – 21
        ★ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిశంబర్ 22 – 23
        ★ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిశంబర్ 24

        తేలని బదిలీల పంచాయతీ!

          0
          • తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781..
          • జీఓ 54కు సవరణలు..
          • స్కూల్‌  స్టేషన్‌సర్వీసు పాయింట్లపై 8 ఏళ్ల సీలింగ్‌ తొలగింపు..
          • తాజాగా 59 జీఓ విడుదల..
          • మారనున్న ఖాళీల జాబితా..

          అనంతపురం విద్య, నవంబరు 24: ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781 చూపి బ్లాగ్‌లో పెట్టారు. బదిలీల జీఓ 54కు విద్యాశాఖ సవరణలు చేయటంతో మళ్లీ ఖాళీల జాబితా తయారీ మొదటికొచ్చింది. తాత్కాలిక జాబితాలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలకు జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై 10 రోజులకుపైగా జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లా సైన్స్‌ సెంటర్‌లో కుస్తీ పడుతున్నారు. ఈనెల 23న తాత్కాలిక ఖాళీల జాబితా తయారు చేశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 1,279, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2502 ఖాళీలు చూ పారు. మొత్తం 3781 ఖాళీలుగా తేల్చి, డీఈఓ బ్లాగులో పెట్టారు. స్టేషన్‌సర్వీసు పాయింట్లపై కొన్నిరోజులు సందిగ్ధత నేపథ్యంలో ఇటీవల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతనెల 12న విడుదల చేసిన బదిలీల జీఓ 54కు కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం జీఓ 59 విడుదల చేశారు. స్కూల్‌ స్టేషన్‌ సర్వీసు పాయింట్లపై ఉన్న 8 ఏళ్ల సీలింగ్‌ తొలగించారు. ప్రధానోపాధ్యాయుల విషయంలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి కావాలన్న నిబంధనను తొలగించి, ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓ 54కు సవరణల నేపథ్యంలో బదిలీ ఖాళీల జాబితాలో మా ర్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయుల ఖాళీల్లో మార్పులుంటాయి. దీంతో తుది ఖాళీల జాబితా తేలాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.

          టీచర్లు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారా.. ?

            0

            • డీఈవో సహా ఉన్నతాధికారుల వ్యాఖ్యలపై యూటీఎఫ్‌ ఆగ్రహం

            ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24: ఈ ఏడాది మార్చి నుంచి టీచర్లు పని లేకుండా ఉంటున్నారని, ఇంట్లోనే కూర్చొని జీతాలు తీసుకుంటున్నారంటూ విద్యాశాఖ డైరెక్టర్‌ వ్యాఖ్యలు చేసినట్టు డీఈవో సీవీ రేణుక వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని యూటీ ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, బి.గోపీ మూర్తి తెలిపారు. డీఈవో మంగళవారం నిర్వహించిన ఎంఈవోల టెలీకాన్ఫరెన్సులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల అన్ని ప్రభుత్వ కార్యాల యాలు మూతపడ్డాయని విషయం విద్యాధి కారులకు తెలియదా అని ప్రశ్నించారు.నాడు–నేడు నిర్మాణ పనులు, విద్యాకానుక కిట్ల పంపిణీని అమలు చేశారన్నారు. టీచర్లు ఏపని చేయలేదో డీఈ వోతో సహా ఉన్నతాధికారులు చెబితే బాగుంటుందని, అభ్యం తరకర వ్యాఖ్యలను తక్షణమే ఉపసహరించుకోవాలన్నారు.

            ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు వేళాయే

              0

              • 6 వేలకు పైగా దరఖాస్తులు రాక
              • 45 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు

              న్యూస్ టోన్, గుంటూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరంలో ‘పది’ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపునకు ఈసారి ప్రవేశ పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష రాయడానికి జిల్లాకు చెరదిన 6864 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు పదిలో పదికి పది గ్రేడు పాయింట్లు వచ్చినవారికి, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు దక్కేవి. ప్రస్తుత ప్రవేశపరీక్షకు ఆర్జీయూకేటీ సెట్‌-2020 నిర్వాహకుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఈనెల 28న జరిగే ఈ పరీక్షకు పరిశీలకులను నియమించారు. పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎవరికైనా హాల్‌టిక్కెట్లు అందకపోయినా, దానిపై ధ్రువీకరణ అధికారి సంతకం లేకపోయినా విద్యార్థులు ఏ పాఠశాలలో అయితే చదివారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై అటెస్ట్‌ చేయించుకుని రావాల్సి ఉంటుంది.

              ప్రతి విద్యా ర్థికి జగనన్న విద్యా కానుక కిట్లు

                0

                • రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రీ సెల్వి

                న్యూస్ టోన్, దావాజిగూడెం(గన్నవరం): విద్యా పథకాల అమ లులో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్య ధోరణిపై సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వె ట్రీసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎంపీపీ ఆదర్శ పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, వాటి నాణ్యత, యూనిఫాం కుట్టుకూలీ డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమపై ఆరా తీశారు. కొంత మంది విద్యార్థులు యూనిఫాం, బూట్లు, స్కూల్ బ్యాగ్ లు తీసుకురాక పోవడంతో అందరికీ విద్యాకానుక కిట్లు అందజే యాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు రం ఎంపీపీ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన వెట్రీ సెల్వి విద్యాకానుక కిట్లు పంపిణీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తున్న బియ్యం, చిక్కీలు పంపిణీ రికా ర్థులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. ఆమె వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవీ రాజ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రవీంద్రబాబు, ఎంఈఓ అదూరి వెంకటరత్నం, హెచ్ఎంలు ఎం విజయరామారావు, డి.నవభారతి పాల్గొన్నారు.

                టీచర్ల బదిలీ షెడ్యూల్‌కు సవరణలు తప్పనిసరి

                  0

                  న్యూస్ టోన్, నవంబరు 24 : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల మేరకు టీచర్ల సాధారణ బదిలీ షెడ్యూల్‌ను సవరించను న్నారు. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు నుంచి ఐదు రోజులపాటు షెడ్యూల్‌ పొడిగించే అవకాశా లున్నాయి. దీనివల్ల గ్రేడ్‌ – 2 హెచ్‌ఎంల బదిలీకి గరిష్ట సర్వీసును ఐదేళ్ల స్టేషన్‌ సర్వీసుగా తీసుకోనుం డడంతో తప్పనిసరి బదిలీ జాబితా నుంచి సుమారు 25 మంది ప్రధానోపాధ్యాయులకు బదిలీ నుంచి ఉపశమనం కలగనుంది. మిగతా టీచర్లకు సంబంధించి 55 ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల పరిమి తిని, టోటల్‌ పాయింట్స్‌ 85 పరిమి తిని తొలగించారు. ఇక సర్వీసు సీనియార్టీ పాయింట్లను 15 నుంచి 16.5కు పెంచడం వల్ల జూనియర్లతో సమానంగా ఉన్న సీనియర్‌ టీచర్లు ఒక్కసారిగా బదిలీల్లో ముందుకు వచ్చే ప్రయో జనం లభించనుంది.  మంగళవారం జరగాల్సిన సీనియార్టీ జాబి తాల విడుదల ప్రక్రియను నిలిపివేయడంతో సవరించిన బదిలీ షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది.

                  సమ్మేటివ్ పరీక్ష ఈ ఏడాదికి ఒక్కటే

                    0

                    • ఫార్మేటివ్ పరీక్షల్లోనూ సడలింపులు
                    • పాఠశాల విద్యా శాఖ నిర్ణయం!

                    న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం, ముఖాముఖి తరగతుల నిర్వహణ కూడా విద్యార్థులందరికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాని నేపథ్యంలో.. ఆ ప్రభావం ఫార్మే టివ్, సమ్మేటివ్ పరీక్షలపై పడుతోంది. గతంలో ఏటా మూడు సమ్మేటివ్లు, 4 ఫార్మే టిట్లుండగా వాటిని ప్రభుత్వం కుదించింది సమ్మేటివ్ ను రెండుగా చేసింది. అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల పాఠశాల విద్యా శాఖ సమ్మేటివ్ ను ఒక్కదానికే పరిమితం చేసింది విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు మాత్రమే నిర్వ హించనుంది. మరోవైపు ఫార్మేటివ్ పరీక్షలు నాలుగింటిని కూడా రెండుకు కుదించింది. ఈనెల 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిం చినా అన్ని తరగతులను నిర్వహించలేని పరి స్థితులుండటంతో వాటిలో కూడా సడలింపులు చేపట్టింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 8, 9 తరగతులను రోజువిడిచి రోజు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే 6, 7 తరగతు లను కూడా రోజువిడిచి రోజు పెట్టనున్నారు ఇక ఎలిమెంటరీ తరగతుల ప్రారంభంపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను స్కూళ్లకు రప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాజరు నుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యార్థులందరికీ ఫార్మేటివ్ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో వాటి నుంచి కూడా సడలింపులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-1 డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్ష లను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించ నున్నారు తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సమ్మేటివ్ పరీక్షలు పెడతారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నలను కూడా తరగతుల్లో బోధించిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఇవ్వనున్నారు.

                    ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు బదిలీ

                      0

                      న్యూస్ టోన్, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల నిబంధనలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు ఒకటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. గతంలో 5 అకడమిక్‌ సంవత్సరాలు ఉండగా.. దానిని ఐదేళ్లుగా మార్పు చేసింది. ప్రస్తుత పాఠశాలలో ఎన్నేళ్లు పని చేస్తే అన్ని స్టేషన్‌ పాయింట్లు ఇస్తారు. గతంలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు పరిమితి విధించగా.. పని చేసిన కాలానికి పూర్తిగా పాయింట్లు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా వీటిని 16.5 పాయింట్లుగా మార్పు చేసింది. 33 ఏళ్ల వరకు సర్వీసుకు పాయింట్లు కేటాయిస్తారు.