న్యూస్ టోన్, విద్య : ట్రిపుల్ ఐటి లలో ప్రవేశానికి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడమైనది అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్ష 28-11-2020 వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ పరీక్షకు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో 48,422 మంది బాలురు మరియు 40,550 మంది బాలికలు హాజరవుతున్నారు. ఇందులో 86,617 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుండి మరియు 2,355 మంది విద్యార్ధులు తెలంగాణ నుంచి హాజరవుతున్నారు. మొత్తం 638 పరీక్ష కేంద్రాలకు గానూ 630 పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లోనూ మరియు 8 పరీక్ష కేంద్రాలు తెలంగాణాలోనూ ఏర్పాటు చేయడమైనది. ఈ పరీక్ష ద్వారా నాలుగు IIIT లలో ఉన్న 4000 సీట్లను మరియు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం మరియు డా.వై.ఎస్.ఆర్. హార్టీకల్చ్బరల్ విశ్వవిద్యాలయాలలో గల 6,000 సీట్లను డిప్లొమా కోర్సుల కొరకు ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షలకు 53 మంది అంధ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, OMR షీట్లు మరియు పరీక్ష కేంద్రానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా జిల్లాలకు రవాణా చేయడమైనది. అలాగే జిల్లా కేంద్రాల నుండి పరీక్ష కేంద్రాలకు సమీపంలోనున్న పోలీస్ స్టేషన్లలో వీటిని భద్రపరచడం అయినది. ఈ పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్మ్మెంటల్ ఆఫీసర్ లు, రూట్ ఆఫీసర్ లు, ఇన్విజిలేటర్ లు మరియు మిగిలిన బోధనేతర సిబ్బంది నియామకాలు పూర్తి అయినవి అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ తెలిపారు.
డ్రై రేషన్ పంపిణీ సరిగా చేయని వారిపై చర్యలు
న్యూస్ టోన్, అమరావతి: విద్యార్థులకు పంపిణీ చేసే డ్రై రేషన్ పంపిణీ పారదర్శకంగా , ఎట్టి విచలనాలకు తావు లేకుండా , మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేయాలనీ, మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రై రేషన్ ను పంపిణీ చేయని క్షేత్రస్థాయి అధికారులపై క్రమశిక్షణా చర్యలు గైకొనాలని అందరు జిల్లా విద్యా శాఖాధికారుల ను కోరుతూ మధ్యాహ్న భోజన పథకం & పాఠశాల శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఆదేశాలు జారీ చేసారు
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలపై తుఫాను ప్రభావం
- 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.
- అయినప్పటికీ 30 శాతం విద్యార్థుల హాజరు.
- కోవిడ్ జాగ్రత్తలతో పాఠశాలలు
- విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ వెల్లడి.
న్యూస్ టోన్, అమరావతి : తుఫాన్ ప్రభావం పాఠశాలలపై పడింది. 5 జిల్లాల్లో పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిరోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతుండగా 5 జిల్లాల్లో సెలవులు కారణంగా దాదాపు 30 శాతం హాజరు నమోదైంది. గురువారం విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
గురువారం 10వ తరగతి విద్యార్థులు 23.31 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 31.36 శాతం విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు 28.13 శాతం హాజరయ్యారు. వర్షాల కారణంగా
కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో
పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ సెలవు సమాచారం వచ్చేలోగానే ఉదయం ఈ 5 జిల్లాల్లో 2 నుంచి 8 శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం అన్నారు.
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమం
★ 3 వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులలో ఫౌండేషన్ రీడింగ్ అక్షరాస్యత నైపుణ్యాలను ప్రోత్సహించడానికి “వుయ్ లవ్ రీడింగ్” (చదవడం మాకిష్టం) అనే ప్రత్యేక ప్రచారాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
★ ఈ మిషన్ మోడ్ ప్రచారంలో పిల్లలందరికీ పాఠశాల, ఇల్లు మరియు గ్రామంలో ఆనందకరమైన వాతావరణంలో చదవడానికి వివిధ మార్గాలు అందించబడతాయి.
★ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, రిటైర్డ్ వ్యక్తులు, విద్యావేత్తలు, ఎన్జీఓఎస్ తదితరులు ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది.
★ ఉయ్ లవ్ రీడింగ్” ప్రచారం నాలుగు దశల్లో అమలు చేయబడుతుంది.
★ 1. ప్రిపరేటరీ స్టేజ్ నవంబర్ 2020, డిసెంబర్ 2020, జనవరి 2021.
★ 2. ఫౌండేషన్ స్టేజ్ – ఫిబ్రవరి 2021, మార్చి 2021, ఏప్రిల్ 2021.
★ 3. అధునాతన దశ – మే 2021, జూన్ 2021, జూలై 2021.
★ 4. వాలెడిక్టరీ స్టేజ్ ఆగస్టు 2021, సెప్టెంబర్ 2021, అక్టోబర్ 2021, నవంబర్ 2021.
1. ప్రిపరేటరీ దశ:
★ సమాజంలోని అన్ని స్థాయిలకు చదవడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నిర్వాహకులు. విద్యార్థుల పఠన సామర్థ్యం ఆధారంగా 4 స్థాయిలుగా బేస్లైన్ అసెస్మెంట్ మరియు విభజన నిర్వహించడం.
★ పాఠశాల లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలతో అన్ని తరగతి గదుల్లో తరగతి గది లైబ్రరీ / రీడింగ్ కార్నర్ ఏర్పాటు. బుక్ బ్యాంక్ కోసం పుస్తకాల సేకరణ కోసం ర్యాలీలు నిర్వహించడం మరియు పఠనంపై అవగాహన తీసుకురావడం.
★ కమ్యూనిటీ రీడింగ్ సెంటర్లు మరియు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లను సెలవుదినాల్లో మరియు పాఠశాల సమయము తరువాత ప్రచారం చేయటానికి గుర్తించడం. లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక వ్యవధిని ప్రత్యేకంగా నిర్వహించండి.
★ నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) జనవరి 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి. అన్ని సన్నాహక కార్యకలాపాలు నవంబర్ 2020 నుండి జనవరి 2021 వరకు పూర్తి కావాలి.
2. ఫౌండేషన్ స్టేజ్:
★ ఇది విద్యార్థులలో పఠన అలవాటు, పఠన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకమైన దశ. లైబ్రరీ బుక్ రీడింగ్ కోసం ప్రత్యేకమైన పఠన కాలాలను కేటాయించాలి. కాబట్టి లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రత్యేకంగా ఒక కాలాన్ని కొనసాగించాలి.
★ విద్యార్థులు ప్రత్యామ్నాయ రోజుల్లో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి. పాఠశాల / కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ / గ్రామంలో మాస్ రీడింగ్, క్లాస్రూమ్ రీడింగ్, పబ్లిక్ రీడింగ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయి, తరువాత వారి పనితీరును అంచనా వేయడానికి విద్యార్థులకు పఠన పోటీలు ఉంటాయి.
★ కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ సజావుగా పనిచేయడానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్ను కనుగొని ట్యాగ్ చేయాలి. నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి.
★ పాఠశాలలు పూర్తి రోజు 2 కాలానికి పనిచేస్తే లైబ్రరీ పుస్తక పఠనం కోసం కేటాయించాలి GO RT No. 220 లో పేర్కొనబడింది. అన్ని పునాది దశ కార్యకలాపాలు ఫిబ్రవరి 2021 నుండి 2021 ఏప్రిల్ వరకు పూర్తి కావాలి. పునాది దశ చివరిలో విద్యార్థులు సొంతంగా కథ పుస్తకాలను చదవగలగాలి.
3. అధునాతన దశ:
★ ఈ దశ ఒకే సమయంలో చదవడం మరియు గ్రహించడంపై దృష్టి పెడుతుంది. తెలియని పదాల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి నిఘంటువును ఉపయోగించడం. ఈ దశ చివరిలో, విద్యార్థులు సరళంగా చదవగలరు మరియు దాని అర్ధాన్ని అర్థం చేసుకోవాలి. కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లు ఈ దశలో కీలక పాత్ర పోషిస్తారు.
4. వాలెడిక్టరీ స్టేజ్:
★ డైలీ పుస్తక పఠన కాలాలను ఈ దశలో కొనసాగించాలి. నవంబర్ 2021 నెలలో ఎండ్ లైన్ అసెస్మెంట్ యొక్క ప్రవర్తన. విద్యార్థులందరూ సరైన అవగాహనతో సొంతంగా చదవగలుగుతున్నారని చూడటానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు.
★ అప్ గ్రేడర్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలి, విద్యార్థుల పనితీరును 3 వ పార్టీ అంచనా వేస్తుంది. డేటా అనలిటిక్స్ ఆధారంగా ప్రచారం యొక్క స్థిరమైన మోడ్లో రూపకల్పన చేయబడుతుంది.
ఐదు వర్సిటీలకు వీసీల నియామకం
- కోర్టు తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు షరతులతో ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్రెడ్డి, శ్రీవేంకటేశ్వర వర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, రాయలసీమ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ ఎ.ఆనందరావు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి ప్రొఫెసర్ ఎం.రామకృష్ణారెడ్డి, ద్రవిడ వర్సిటీకి ప్రొఫెసర్ తుమ్మల రామకృష్ణలను ఉపకులపతులుగా నియమించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విశ్వవిద్యాలయాల చట్ట సవరణపై న్యాయస్థానంలో పిల్ ఉన్నందున గవర్నర్ కార్యాలయం వీసీల నియామక దస్త్రాన్ని పక్కన పెట్టింది. దీనిపై, ఉన్నత విద్యా శాఖ తరఫున అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్లోనూ పేర్కొన్నారు.
వాళ్ళకు ప్రోత్సాహకాలు.. టీచర్లకు ఛీత్కారాలా
- నిర్మాణ సామగ్రిని మోయడానికే హెచ్ఎంలు, టీచర్లు పరిమితమా?
- విద్యాధికారుల ద్వంద్వ వైఖరి తగదు: యూటీఎఫ్
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 25: టీచర్ల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. జయకర్, బీ గోపిమూర్తి బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. జిల్లాలో తొలి విడత నాడు – నేడు కార్యక్రమం నిర్మాణ పనుల్లో హెచ్ఎంలకు అప్పగించిన పర్యవేక్షణ బాధ్యతలకు బదులుగా భవన నిర్మాణ సామగ్రిని మోయడానికి, వాటిని కాపలా కాయడానికి పరిమితమయ్యారని ఆరోపించారు. దీనికితోడు ఎంఈవో మొదలు కుని విద్యాశాఖ ఉన్నతాధికారులతో తిట్టించుకోవాల్సి రావడం దారుణమన్నారు. సిమెంట్, ఇసుక, సామగ్రి పాఠశాలలకు సరఫరా కాకపోయినా, కార్మికులు సహకరించకపోయినా ప్రధానోపాధ్యాయులు తమ కుటుంబ బాధ్యతలను పక్కన బెట్టి పనిచేసిన వాస్తవాలు విద్యాధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సామగ్రి పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాలను పరిష్కరించకుండా హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, దుర్భాషలాడడం దుర్మార్గమన్నారు. నాడు – నేడు ఇంజనీరింగ్ సిబ్బందికి, సీఆర్పీలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభు త్వం టీచర్లకు మొండిచేయి చూపడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. వేసవిలో నాడు – నేడు పనులకు హాజరైన టీచర్లకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, ప్రాణాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారుల బెదిరింపులు మానుకుని టీచర్లకు సహకరించేలా సిబ్బందిని ఆదేశించాలని యుటీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
హెచ్ఎంలు, టీచర్లంటే ఎంతో గౌరవం : డీఈవో రేణుక
జిల్లాలో ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టే చర్యలకు కాని, వారిని కించపర్చాలన్న ఉద్దేశ్యం కాని తనకు లేవని డీఈవో సీవీ రేణుక స్పష్టం చేశారు. టీచర్ల పట్ల తాను అభ్యంతరకర వ్యాఖ్యలను చేసినట్టు యూటీఎఫ్ జిల్లా నాయకుల ఆరోపణలపై డీఈవో బుధవారం వివరణ ఇచ్చారు. నాడు–నేడు పనులను ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంకిత భావంతో పర్యవేక్షిస్తున్నారని వివరించారు. రాష్ట్ర స్థాయిలో నాడు – నేడు నిర్మాణ పనుల ప్రగతిలో జిల్లా అగ్రస్థానంలో ఉండడానికి ఉపాధ్యాయులు, హెచ్ఎంల సహకారమే కారణమన్నారు. హెచ్ఎంలు, టీచర్ల పట్ల తనకు ఎనలేని గౌరవభావం ఉందని డీఈవో తెలిపారు.
టీచర్ల బదిలీల షెడ్యూల్ ఇదీ..
- డెమో సంగతి మరిచారు
- సర్వీసు పాయింట్ల పెంపు
న్యూస్ టోన్, మచిలీపట్నం : టీచర్ల బదిలీల షెడ్యూలును డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసింది గతంలో విడుదల చేసిన జీవో నెంబరు 50, 54, 59ల ఆధారంగా ఈ షెడ్యూలును ఖరారు చేశారు టీచర్ల బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం ఇది మూడోసారి. బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 16న ముగిసింది. 2017వ సంవత్సరం నుంచి టీచర్ల బదిలీలు జరగలేదు అయినప్పటికీ ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటేఅధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన టీచర్లకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలకు పాయింట్లు కేటాయించేందుకు అంగీకరించి అందుకనుగుణంగా మార్పులు చేసి, తాజా ఉత్తర్వులు జారీ చేశారు వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో జరిగే ఈ బదిలీ షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి
28నుంచి ప్రక్రియ ప్రారంభం
టీచర్ల ఆన్లైన్ దరఖాస్తులను 28, 29 తేదీల్లో పరిశీలిస్తారు. 30 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పాయింట్ల ఆధారంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తారు. డిసెంబరు 3, 4 తేదీల్లో అభ్యంతరాలను వెబ్ సైట్ లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాలుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలను డీఈవోకు సమర్పించాలి. డిసెంబరు 5-7 మధ్య అభ్యంతరాలను పరిశీలించి, డీఈవో, జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) సమాధానాలు ఇస్తారు. 10వ తేదీలోగా తుది సీనియారిటీ జాబితాలను పాయింట్ల ఆధారంగా ప్రకటిస్తారు. 11 నుంచి 15వ తేదీ వరకు టీచర్లు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. 16 నుంచి 21 వరకు కేటాయించిన పాఠశాలల జాబితాలను ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో ఈ జాబితాలను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దుతారు. డిసెంబరు 24న బదిలీ అయిన టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
డెమో సంగతి మరిచారు
ఇటీవల విద్యాశాఖ మంత్రి, అధికారులతో జరిగిన చర్చలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతిపాదన చేశారు. వెబ్ కౌన్సెలింగ్ పై డెమో ఇస్తామని, అందులో లోపాలుంటే మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేస్తామని నాడు ఉన్నతాధికారులు చెప్పారని, అయితే తాజా షెడ్యూలులో డెమో అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు.
పది విద్యార్థులకు నేరుగా తుదిపరీక్షలు
- ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి
న్యూస్ టోన్, ప్రత్తిపాడు, న్యూస్టుడే: పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టరు ప్రతాప్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన గుంటూరు డీఈవో గంగాభవానితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు మధ్యలో ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం విద్యార్థుల హాజరు 70 శాతం వరకు నమోదైందన్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడు రకాల అంశాలతో అకడమిక్ క్యాలెండర్ రూపొందించామని వివరించారు. తరగతి గదిలో మాత్రమే బోధించేవి, ఇంటి దగ్గర నేర్చుకునేవి, స్వతహాగా ఐచ్ఛికంగా నేర్చుకునే అంశాలున్నాయని తెలిపారు. ఐచ్ఛికంగా నేర్చుకునే 35 శాతం అంశాలను పరీక్షల్లో ఇవ్వబోమని, భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఈ సిలబస్ ఉపయోగపడుతుందని వివరించారు.
టీచర్ల బదిలీలకు తాజా షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ
- వచ్చేనెల 24నాటికి ప్రక్రియ పూర్తి
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
న్యూస్ టోన్, ఒంగోలు విద్య, నవంబరు 25 : ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తాజా షెడ్యూల్ను విడుదల చేసింది. పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసిన నేపథ్యంలో షెడ్యూల్ను పది రోజులు పొడిగించింది. మొదట ప్రకటించిన ప్రకారం డిసెంబరు 14తేదీకి బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా తాజా షెడ్యూల్ ప్రకారం 10రోజులు ఆలస్యంగా డిసెంబరు 24నాటికి పూర్తికానుంది. బదిలీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసినందున దరఖాస్తులను పునఃపరిశీలన చేయనున్నారు.
తాజా షెడ్యూలు ఇదీ.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన తాజా షెడ్యూల్ ఈనెల 28 నుంచి అమల్లోకి వస్తుంది.
🔹ఈనెల 28, 29 తేదీలలో ప్రత్యేక బృందాలు బదిలీ దరఖాస్తులను పునఃపరిశీలిస్తాయి.
🔹ఈనెల 30 నుంచి డిసెంబరు 2వరకూ ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు.
🔹డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రాథమిక, సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
🔹డిసెంబరు 5, 6, 7 తేదీల్లో టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి పరిష్కరిస్తారు.
🔹డిసెంబరు 8, 9, 10 తేదీల్లో ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు.
🔹డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకున్న పాఠశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇస్తారు.
🔹డిసెంబరు 16 నుంచి 21 వరకు కేటాయించిన స్థానాలతో వెబ్సైట్లో టీచర్ల బదిలీల ఉత్తర్వులు ఉంచుతారు.
🔹డిసెంబరు 22, 23 తేదీల్లో బదిలీల ఉత్తర్వులో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తారు.
🔹డిసెంబరు 24న ఉపాధ్యాయులు వెబ్సైట్ నుంచి బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అధికారుల అనుమతితో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
టీచర్ల బదిలీల రివైజెడ్ షెడ్యూల్ 25.11.2020
అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సవరణ జీవో 59 ను అనుసరించి బదిలీల సవరణ షెడ్యూల్ ను కమీషనర్ శ్రీ చిన వీరభద్రుడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లోని ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
★ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28 -29
★ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 – డిశంబర్ 2
★ అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: డిశంబర్ 3 – 4
★ జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: డిశంబర్ 5 – 7
★ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: డిశంబర్ 8 – 10
★ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిశంబర్ 11 – 15
★ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిశంబర్ 16 – 21
★ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిశంబర్ 22 – 23
★ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిశంబర్ 24
