Home Blog Page 395

2009 నుండి ప్రమోషన్ వివరాలు కోరిన కమీషనర్

    0
    •  పీ.డీ, ఎస్.ఏ ల ప్రమోషన్ వివరాలు ఇవ్వండి

    న్యూస్ టోన్, ఇబ్రహీం పట్నం: అందరు డిఈఓ లు 2009 నుండి 2018 వరకు ప్రమోషన్ వివరాలను పంపాలని కమీషనర్ వారు ఆదేశించారు. ట్రాన్స్ఫర్లు లో అప్గ్రేడెడ్ పి.ఈ.టి మరియు ఎస్.ఏ (భాషా)  ఖాళీలు చూపించమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అడిగిన దరిమిలా ఎంతమంది ప్రమోట్ అయ్యారు , మరియు డిఈఓ పూల్ లో ఉన్న వారి వివరాలు పంపాలని కమీషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.

    నిష్ఠ శిక్షణ 10 వ మాడ్యూల్ రిజిస్ట్రేషన్

    0

    • డిసెంబర్ 01 నుండి మొదలు
    • డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాలి

    న్యూస్ టోన్, అమరావతి: నిష్ఠ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం లో భాగంగా 10 వ మాడ్యూల్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ను దీక్షా ఆప్ లో ఎనేబుల్ చేశారు. ఈ మాడ్యూల్ కు రిజిస్టేషన్ లు డిసెంబర్ 1 నుండి మొదలు అవుతాయి. ఈ మాడ్యూల్ ను డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అటు దీక్షా ఆప్ లో నిష్ఠ కోర్సు కు అసలు రిజిస్టర్ అవ్వని ఉపాధ్యాయులు షో కాజ్ నోటీస్ లు అందుకుంటున్నారు.

    10 వ మాడ్యూల్ లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

    ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష వాయిదా

      0
      • సైక్లోన్ ప్రభావంతో వాయిదా నిర్ణయం
      • డిశంబర్ 5 కు పరీక్ష వాయిదా

      న్యూస్ టోన్, అమరావతి: నివర్ తుఫాను ప్రభావం తో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ శ్రీ డి.హరి నారాయణ పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షను డిశంబర్ 5వ తేదీన శనివారంనిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులు అందరూ ఈ మార్పు ను గమనించాలని ఆయన కోరారు. అదే విధంగా డిశంబర్ 5వ తేదీన నిర్వహించు ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందనీ, సెంటర్ లలో కానీ, హాల్ టికెట్ లలో కానీ ఏ విధమైన మార్పులు ఉండవని తెలిపారు. ఆ రోజున విద్యార్ధులు పరీక్షా సమయం కంటే 2 గంటల ముందు ఎక్జామ్ హాల్ కు చేరుకోవాలని ఆయన సూచించారు.

      టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ

        0

        న్యూస్ టోన్, అమరావతి: తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్‌-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. విద్యార్థుల్లో మాతృభాష మీద ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 13న పోటీ ఉంటుందని, 20న విజేతలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

        125 డీఈడీ కళాశాలల మూసివేత

          0

          న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేటు డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌) కళాశాలలు భారీగా మూతపడ్డాయి. డీఈసెట్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నవారు కన్వీనర్‌ కోటా సీట్లలో 30 శాతం కూడా లేరు. యాజమాన్య కోటా, స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందేవారు తప్పనిసరిగా డీఈసెట్‌లో అర్హత సాధించాలన్న నిబంధనతో ప్రైవేటు కళాశాలలకు విద్యార్థులు దొరక్క మూసివేత తప్పలేదు.

          రాష్ట్రవ్యాప్తంగా 2019- 2020లో 537 ప్రైవేటు డీఈడీ కళాశాలలుండగా.. ఈ ఏడాది 125 విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాల విద్యాశాఖ 423 కళాశాలలకు అనుమతులు ఇవ్వగా వీటిలో 11 యాజమాన్యాలు తమకు విద్యార్థులను కేటాయించవద్దంటూ స్వచ్ఛందంగా మూసివేశాయి.  

          2020-21 సంవత్సరానికి డీఈసెట్‌కు 10,810 మంది దరఖాస్తు చేయగా.. 9,014 మంది అర్హత సాధించారు. 412 ప్రైవేటు కళాశాలల్లో 35,080, 14 ప్రభుత్వ కళాశాలల్లో 1,650 సీట్లు ఉన్నాయి. అర్హత సాధించిన వారంతా డీఈడీలో చేరినా మొత్తం సీట్లలో 25శాతం మాత్రమే భర్తీ కానున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ డైట్‌ కళాశాలలను ఎంచుకుంటున్నందున ప్రైవేటులో సుమారు 80 శాతం సీట్లు మిగిలిపోనున్నాయి.

          ఆర్జీయూకేటీ సెట్‌కు నిమిషం ఆలస్యం నిబంధన

            0
            • రేపు ప్రవేశ పరీక్ష

            న్యూస్ టోన్, అమరావతి: ఏపీ, తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనరు హరినారాయణ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 88,972 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో ఏపీకి చెందినవారు 86,617 మంది ఉన్నారని తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4వేల సీట్లు, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిప్లామా కోర్సులకు 6 వేల సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

            సంపూర్ణ విజ్ఞానం కోసమే ‘చదవటం మాకిష్టం’

              0
              • గుంటూరులో కార్యక్రమం ప్రారంభ సభలో విద్యాశాఖ మంత్రి సురేష్

              న్యూస్ టోన్, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడం, చదువులోని ఆనందాన్ని పరిచయం చేయడానికే ‘చదవటం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలు చదివితేనే సంపూర్ణ విజ్ఞానం లభిస్తుందన్నారు. గురువారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన చదవటం మాకిష్టం (వుయ్ లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరితతో కలసి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదవటం మాకిష్టం’ లోగో, కరపత్రాలు, గీతాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఉద్యమంలా తీసుకెళ్తామని సురేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు వీటన్నింటిని అనుసంధానిస్తూ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీగా నామకరణం చేస్తామని తెలిపారు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. వాటిని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. కాగా, ఇదే వేదికపై రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ విద్యాశాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

              బదిలీలకు మోక్షం

                0
                • ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా
                • ఆర్నెళ్ల నుంచి ఊరిస్తున్న ప్రక్రియ
                • వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మత, రెండేళ్ల సర్వీస్‌ ఉన్న వారికి మినహాయింపు
                • వచ్చే నెల 24 కల్లా కొత్త స్థానాల్లోకి టీచర్లు

                కాకినాడ, న్యూస్ టోన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఆర్నెళ్ల నుంచి టీచర్లను ఊరిస్తున్న ప్రక్రియకు మోక్షం లభించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో నెం.59 జారీ చేసింది. నిబంధనల మేరకు వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు, రెండేళ్ల సర్వీస్‌ ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు లభించింది. బదిలీలన్నీ అమరావతినుంచి పాఠశాల విద్య కమిషనరేట్‌ కార్యాలయంనుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. వచ్చేనెల 24కల్లా బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లో చేరనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో కొవిడ్‌ ఉధృతమవ్వడంతో రెండు దఫాలు బదిలీలు వాయిదా వేశారు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయుల జాబితా ప్రాథమిక  విద్యశాఖ కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాశాఖకు వచ్చింది. దాని ఆధారంగా డీఈవో కార్యాలయ సిబ్బంది దరఖాస్తులను  పునఃపరిశీలించి తుది పరిశీలన చేసి ఇటీవల సదరు జాబితా అమరావతికి పంపారు. జిల్లాలో అన్ని కేటగిరీల్లో 14,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులందరూ బదిలీకి అర్హులయ్యారు. ఇప్పుడు జరుగుతున్న బదిలీల్లో 7,425మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,127మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నారు. మిగిలిన వారికి రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌లకు అవకాశమిచ్చారు.

                ఏజెన్సీలో పనిచేయాల్సిందే..

                ఇప్పటివరకు జిల్లాలో పలు విడతల్లో జరిగిన టీచర్ల బదిలీల్లో అధికశాతం మంది ప్లెయిన్‌ ఏరియాల్లోనే బదిలీ అయ్యేవారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2017లో జరిగిన బదిలీల్లో చాలామంది ఏజెన్సీకి బదిలీపై వెళ్లలేదు. దీంతో సబ్‌ప్లెయిన్‌, రిమోట్‌ ప్రాంతాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ సారి వారు చేసిన సర్వీస్‌ సీనియార్టీ ప్రకారం ఆన్‌లైన్‌లో బేరీజు వేసి, అటువంటి వారిని ఏజెన్సీకి బదిలీ చేయాలని ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. దీంతో ఏజెన్సీ ముఖం చూడని వారు తప్పని పరిస్థితిలో అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. 

                ఇదీ షెడ్యూల్‌

                అమరావతి నుంచి వచ్చిన బదిలీ జాబితా దరఖాస్తులను ఈ నెల 28, 29 తేదీల్లో డీఈవో కార్యాలయంలో పరిశీలిస్తారు. ఉపాధ్యాయులకు వచ్చిన సర్వీస్‌ పాయింట్‌ల ఆధారంగా ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితాను ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. సదరు జాబితాపై అభ్యంతరాలుంటే డిసెంబరు 3, 4 తేదీల్లో డీఈవో కార్యాలయంలో లిఖితపూర్వకంగా, సంబంధిత డాక్యుమెంట్‌లతో పరిష్కరించుకోవడానికి గడువు ఇచ్చారు. అనంతరం సిద్ధం చేసిన జాబితాను జేసీకి నివేదిస్తారు. దీనిపై జేసీ 5, 6, 7 తేదీల్లో పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పాయింట్ల ఆధారంగా డిసెంబరు 8, 9, 10 తేదీల్లో సీనియార్టీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 11 నుంచి 15 వరకు బదిలీకి దరఖాస్తు చేసిన వారు వెబ్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. 16 నుంచి 21 వరకు బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 22, 23 తేదీల్లో బదిలీ ఉత్తర్వుల్లో సాంకేతిక అవరోధాలుంటే వాటిని పరిష్కరిస్తారు. డిసెంబరు 24న బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

                కరోనా థర్డ్ వేవ్ తస్మా త్ జాగ్రత్త

                  0
                  • కోవిడ్ విజృంభణపై నిపుణుల హెచ్చరికలు
                  • 40వేలకు పైగానే రోజువారి కొత్త కేసులు

                  న్యూస్ టోన్, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో కోవిడ్ విజృంభణపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. థర్వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొద్దివారాల పాటు వైరస్ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐదు వారాల కిందట ఢిల్లీలో పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, ప్రస్తుతం తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ముప్పు తొలగిపోయినట్లు భావించడానికి వీల్లేదని వైద్యలు వెల్లడిస్తున్నారు అక్టోబర్ లో రెండోదశ ముగిసింది. నవంబర్ మధ్యలో మూడో దశ మొదలైందని నోయిడాలోని ఫార్టీస్ హెల్త్ కేర్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ అగర్వాల్ చెప్పారు. మూడోదశలో శ్వాసకోశ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఊపిరి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కోవిడ్ తర్వాత మరిన్ని సంక్లిష్టతలు కలుగుతున్నాయని చెప్పారు. బుధవారం సాయంత్రం నాటికి ఢిల్లీలో మొత్తంగా 5,45,787 పాజిటివ్ లు, 8,720 మరణాలు నమోద య్యాయి.

                  తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న నివర్ తుపాను

                    0
                    • రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది 
                    • తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో , చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్
                    • చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు
                    • శుక్రవారానికి తగ్గునున్న నివర్ ప్రభావం

                    రాగల రెండు రోజుల వాతావరణ వివరాలు: 

                    శుక్రవారం (27/11/2020) 

                    శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు.

                    శనివారం (28/11/2020)

                    కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.

                    • వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం
                    • లోతట్టు  ప్రాంత  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి 
                    • రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

                    అని  విపత్తుల శాఖ  కమిషనర్ కె.కన్నబాబు తెలియ చేశారు.