Home Blog Page 388

ఈ హాజరు సూచనలు – బదిలీల అనంతరం చేయాల్సిన పద్దతి

    0

    మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ స్ట్రెంత్ లో తొలగించవలెను.

    అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను యాడ్ చేసుకోవలెను.

    మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన, సి.ఎస్.ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను.

    https://cse.ap.gov.in/DSE/officialLogin.do
     

    తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ స్ట్రెంత్ పై క్లిక్ చేయాలి.

    పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను.

    అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు యాడ్  టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని యాడ్ చేసుకోవలెను.

    పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

    E HAZAR INSTRUCTIONS AFTER TRANSFERS

    వెబ్ ఆప్షన్స్ రివైజ్ద్ షెడ్యూల్ విడుదల

      0
      • హెచ్.ఎం, ఎస్.ఏ (తెలుగు, హిందీ, పి.డి) వారు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి
      • కోర్టు కేసుల కారణంగా వీరికి మళ్ళీ మొదటికి ఆప్షన్స్ ప్రక్రియ

      న్యూస్ టోన్, అమరావతి: కోర్టు కేసుల కారణంగా హెచ్.ఎం, ఎస్.ఏ (తెలుగు, హిందీ, పి.డి) వారికి బదిలీల ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ఇది కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, హెచ్.ఎం లకు  సంబంధించి క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు వారు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి.  స్కూల్ అసిస్టెంట్ పి.డి కి కర్నూలు వారు మాత్రమే ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 22 నుండి 26 వరకు 5 రోజుల పాటు కొనసాగుతుంది అని సి.ఎస్.ఈ వారు ఇచ్చిన ఉత్తర్వు లలో పెర్కోన్నారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ లకు అనుగుణంగా సి.ఎస్.ఈ వారు బదిలీల ప్రక్రియ చేపట్టి ఉంటే బదిలీల ప్రక్రియ నవంబర్ లోనే ముగిసిపోయేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

      తీసికట్టుగా ఐటీఐల నిర్వహణ

        0
        • శిక్షణ, ఉపకార వేతనాల చెల్లింపులు అంతంతే
        • 2015-18 మధ్య కాగ్‌ పరిశీలనలో వెల్లడి

        న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలోని చాలా పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో బోధన, శిక్షణ, సదుపాయాల కల్పనలో నాణ్యత కొరవడినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. చాలా సంస్థల్లో అధునాతన పరికరాలు లేకపోగా.. ఉన్నవాటి నిర్వహణకూ నిధులు విడుదల చేయలేదని వెల్లడించింది. గుంటూరు, తిరుపతిలోని జిల్లా స్థాయి శిక్షణ కేంద్రాలతోపాటు నెల్లూరు, ఒంగోలు, బి.తాండ్రపాడు, కడప, అరకు, పాయకరావుపేట, ఏలూరు, విజయవాడ ఐటీఐల్లో 2015-18 మధ్య నిర్వహణ తీరును కాగ్‌ తనిఖీ చేసింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.

        ఒక్కో విద్యార్థికి శిక్షణ గ్రాంటును ఇంజినీరింగ్‌ ట్రేడులకు రూ.400, ఇతరులకు రూ.300ల చొప్పున ఎనిమిది ఐటీఐలకు రూ.3.22 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.27.51 లక్షలే మంజూరు చేసింది. బి.తాండ్రపాడు ఐటీఐకి మాత్రమే పాక్షికంగా ఉపకార వేతనాలు ఇచ్చింది. తనిఖీ చేసిన ఏడింటిలోనూ పరికరాల కొరత ఉంది.

        ప్రపంచ బ్యాంకు సహాయక వృత్తివిద్యా శిక్షణ, అభివృద్ధి ప్రాజెక్టు కింద ఉన్న కడప డీఎల్‌టీసీలో రూ.1.08 కోట్ల విలువైన పరికరాల కొనుగోలు టెండర్లలో నిబంధనలు పాటించలేదు.

        8 ఐటీఐల్లో 179 మంది బోధకుల పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన 92 మంది పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం రూ.14,000 ఇవ్వాలి ఉన్నా రూ.7 వేలు-రూ.12 వేల చెల్లిస్తున్నారు.

        విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ ఇప్పించడంలో చొరవలేదు. కేంద్రం కేటాయించిన నిధుల సకాలంలో వినియోగించలేదు.

        NO QUALITY IN ITI TRAINING -CAG

        ఉపాధ్యాయ ఖాళీలు..2,537

          0

          • తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1,936 మంది
          • 1,547 ఖాళీల బ్లాక్‌
          • తుదిదశకు చేరుకుంటున్న బదిలీల ప్రక్రియ

          ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌ టోన్: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. పాఠశాల విద్యా శాఖ సవరించి జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం బదిలీకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఆ జాబితాపై ఉపాధ్యాయులు తెలిపిన అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో 1,547 ఉపాధ్యాయ కొలువులను బ్లాక్‌ చేశారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1,936 మంది ఉన్నట్లు నిర్ధరించారు. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు 4,084 ఉండగా.. వీటిలో 2,537 ఖాళీలను ప్రదర్శించారు.

          ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

          జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి 1,547 ఖాళీలను బ్లాక్‌ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను బ్లాక్‌ చేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు తమకు నచ్చిన పాఠశాలను కోరుకునే అవకాశం లేకుండా పోతుందంటున్నారు. ఇదే విషయమై డీఈవో రేణుకతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కొన్నింటిని బ్లాక్‌ చేశామన్నారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులకు అవసరమైన సంఖ్యలో మాత్రమే ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీకి సంబంధించి పది శాతం ఎక్కువ ఖాళీలను, ఎస్‌జీటీ కేటగిరీకి సంబంధించి ఐదు శాతం ఎక్కువ ఖాళీలు చూపాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎస్‌జీటీ కేటగిరీకి సంబంధించి ఐదు కంటే ఎక్కువ శాతం ఖాళీలను జాబితాలో చూపామన్నారు. ఇలా కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయకుంటే కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో, మరికొన్ని పాఠశాలల్లో తక్కువ స్థాయిలో ఉపాధ్యాయులు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లోనూ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

          TEACHER VACANCIES 2537

          నాడు-నేడు పనులతో ఒత్తిడి: ఫ్యాప్టో

            0

            న్యూస్ టోన్, అమరావతి: ‘నాడు-నేడు’ పనులతో ప్రధానోపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పనులు ముగియకుండానే తుది విడత బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో పని చేసినందుకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు.

            15 లోపు నాడు-నేడు పనులను పూర్తి చేయాలి

            నాడు-నేడుకు సంబంధించిన అన్ని పనుల ను ఈనెల 15లోపు పూర్తి
            చే యాలని ప్రధానోపాధ్యాయు లను జిల్లా విద్యాశాఖాధి కారి వి.ఎస్‌.
            సుబ్బారావు ఆదే శిం చారు. మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం మనబడి,
            నాడు-నేడు కార్యక్రమాలపై హెచ్‌ ఎంలతో ఆ యన సమీక్ష నిర్వహించారు. జల జీవన్‌
            మిషన్‌ పథకం కింద  అన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం  కల్పించేందుకు ఆర్‌డ
            బ్ల్యూఎస్‌ ద్వారా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పను లకు
            సంబంధించిన పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎం ఈవోలు రాందాస్‌
            నాయక్‌, సుజాత పాల్గొన్నారు.

            PRESSURE BY NADU NEDU WORKS

            బదిలీ అభ్యంతరాలపై పరిశీలన!

              0
              • స్వీకరణకు ముగిసిన గడువు
              • వేర్వేరు అంశాలపై ప్రశ్నించిన 332మంది

              న్యూస్ టోన్, గుంటూరు: ఉపాధ్యాయులు, ఐటీకోర్‌ సిబ్బంది తనిఖీలు ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అభ్యంతరాలపై యుద్ధప్రాతిపదికన పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో కేటగిరీ వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏయే క్యాడర్లలో ఎంతమంది బదిలీ అవుతారు? ఎంతమంది వినతి బదిలీ కోరుకున్నారు, వారికి వచ్చిన సర్వీస్‌, స్టేషన్‌ పాయింట్ల వివరాలతో సహా ప్రతిదీ జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరించింది. దీనికి శనివారంతో గడువు ముగిసింది.

              సాఫ్ట్‌వేర్‌లో మార్చలేదు

              తొలుత జీవో 56, 57 వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సవరణలు చేసి మరో కొత్త జీవో ఇచ్చారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయలేదు. దీంతో ఉపాధ్యాయులకు కలవాల్సిన సర్వీస్‌, స్టేషన్‌ పాయింట్లు కొందరికి కలవలేదు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని సాక్ష్యాధారాలతో కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపారు.

              ప్రధానంగా వచ్చినవి ఇవీ..

              * ఇద్దరం ఒకే డీఎస్సీలో ఎంపికయ్యాం. ఒకే రోజున ఉద్యోగంలో చేరాం. అయినా పాయింట్ల విషయానికి వచ్చేసరికి నా కన్నా ఐదు పాయింట్లు అదనంగా వచ్చాయి? అదెలా సాధ్యం? వివరణ ఇవ్వాలంటూ ఓ ఉపాధ్యాయుడి నుంచి అభ్యంతరం.

              * అవివాహితులకు ఐదు పాయింట్లు కేటాయిస్తారు. అయితే దరఖాస్తులో గతంలో ఏమైనా ఈ కోటాలో పాయింట్లు పొందారా అని అడగ్గా కొందరు పొరపాటున ఆ మేరకు పొందకపోయినా అవును అని నింపారు. తీరా ఈ పొరపాటున గుర్తించి కొందరు ఉపాధ్యాయులు సరిచేయాలని వచ్చి కోరుతున్నారు. కొందరు మాత్రం పక్కాగా దరఖాస్తు చేసినా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవటంతో పాయింట్లు కేటాయించలేదు.

              * కొందరు భార్యాభర్తలు(స్పౌజ్‌) కోటాను ప్రస్తుతం వినియోగించుకోవాలనుకోవటం లేదు. అయితే దరఖాస్తు చేసినప్పుడు ఆ కోటా వినియోగించుకోవాలనుకున్నాం. దాన్ని సరిచేయాలని కోరేవారు కొందరైతే మరికొందరు గతంలో స్పౌజ్‌ కోటా వినియోగించుకున్నారు. తిరిగి మళ్లీ ఆ కోటాలో బదిలీ కోరుకుంటున్నారని సహచర ఉపాధ్యాయులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

              * తొలుత 56, 57 జీవోలు జారీ చేసినప్పుడు ఒక పాఠశాలలో గరిష్ఠంగా పదేళ్లు పనిచేసినా ఎనిమిదేళ్లకు మాత్రమే పాయింట్లు గణించాలని ఆదేశాలున్నాయి. ఆ తర్వాత 57 జీవోలో దాన్ని ఎనిమిదేళ్లతో సంబంధం లేకుండా ఎన్నేళ్లు పనిచేస్తే అన్నేళ్లకు పాయింట్లు లెక్కించాలని సవరణ జీవో వచ్చింది. అయితే ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయకపోవటంతో తమకు ఎనిమిదేళ్లకే పాయింట్లు చూపించారని అదనంగా పని చేసిన సంవత్సరాలకు కూడా పాయింట్లు లెక్కించాలని కోరుతూ మరికొందరు అప్పీల్‌ చేసుకున్నారు.

              * క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులతో పాటు వైకల్యం కలిగిన వారు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ కోరుకుని అందుకు సంబంధించిన మెడికల్‌ ధ్రువపత్రం సమర్పించలేదు. దీంతో వారికి ఆ మేరకు పాయింట్లు కేటాయించలేదు. ఆ పత్రాలు అందజేయటంలో జాప్యం జరిగిందని వాటిని ప్రస్తుతం అందజేసి మరికొందరు పాయింట్లు కేటాయించాలని కోరుతున్నారు.

              * మొత్తం 332 అభ్యంతరాలు రాగా శనివారం నాటికి 179 అప్పీళ్లు పరిష్కరించామని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

              OBSERVED TRANSFER GRIEVANCES

              నేటి నుంచి విద్యార్థులకు ‘సండే స్టోరీ టైమ్‌

                0

                ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5 : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పఠనానైపుణ్యాలను పెంపొందించేందు కు ఇక మీదట ప్రతి ఆదివారం స్థానికంగా ఉండే పబ్లిక్‌ లైబ్రరీలు/ కాలనీలు/ వీధులు/వార్డుల్లో పిల్లలను సమావేశపర్చి పఠనాకృత్యాలను నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ‘సండే స్టోరీ టైమ్‌’ పేరిట నిర్వహించే ఈ కా ర్యక్ర మం నిర్వహణకు స్కూలు హెచ్‌ఎంలు, టీచర్లు స్వచ్ఛందంగా సహకరించాలని, అయితే వారి హాజరు నిర్బంధం కాదని స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న పబ్లిక్‌ లైబ్రరీలు/బుక్‌ కలెక్షన్‌ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న గ్రంథ పాలకులు, సచివా లయ వలంటీర్లు, ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, సమగ్ర శిక్షా సీఆర్‌పీలకు నిర్వహ ణ బాధ్యతలను అప్పగించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కూడా నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఇకమీద ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యార్థులందరూ సామూహిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 

                SUNDAY STORY TIME

                ఖాళీలు బ్లాక్ చేయకూడదు – ఫ్యాప్టో

                  0
                  • మంత్రిని కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
                  • మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వినతి

                  మార్కాపురంలో విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని రాష్ట్ర ఫ్యాప్టో కలిసి బదిలీలలో ఖాళీలు బ్లాక్ చేయకూడదని, ఎస్.జి.టి లకు తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరడం జరిగింది.మంత్రిని కలిసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ శ్రీ జి.వి.నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ జోసఫ్ సుధీర్ బాబు, శ్రీ బాబు రెడ్డి, యం.రఘునాథ రెడ్డి ఉన్నారు.

                  DONT BLOCK VACANCIES FAPTO


                  పాఠశాలల కేటగిరీలపైగందరగోళం

                    0
                    • పాయింట్లు రాలేదని అభ్యంతరాలు
                    • కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
                    • బదిలీలపై ఉపాధ్యాయుల ఆందోళన

                    ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా రూపొందించిన హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీల సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏవైౖనా అభ్యంతరాలు ఉంటే శనివారంలోగా తెలియజేయాలని డీఈవో వీఎస్‌ సుబ్బారావు కోరారు. అయితే దానిని పరిశీలించుకున్న ఉపాధ్యాయులు తాము పనిచేసే పాఠశాలకు తగినన్ని కేటగిరీ పాయింట్లు నమోదు కాలేదని, అవి తగ్గిపోతే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

                    న్యూస్‌ టోన్, ఒంగోలు నగరం: బదిలీలు కోరుకున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ జాబితాలోనే వారి పాయింట్లు నమోదు చేస్తారు. వికలాంగులు, వితంతువులు, అవివాహితులు, క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటి సమస్యాత్మక వ్యాధులున్న వారికి ప్రాధాన్యత పాయింట్లు లభిస్తాయి. అలాగే పాఠశాల కేటగిరీ అక్కడ పని చేసిన సంవత్సరాలను బట్టి మరికొన్ని పాయింట్లు కలుపుతారు. పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. రోడ్డు, బస్సు సౌకర్యంలేని గ్రామాల్లోని పాఠశాలలను 4వ కేటగిరీగా పరిగణిస్తారు. ఆ రెండు సౌకర్యాలు ఉండి, పట్టణానికి దూరంగా ఉంటే 3గా, పట్టణం, నగరానికి సమీపంలో ఉంటే 2గా, పట్టణంలో ఉంటే ఒకటో కేటగిరీగా గుర్తిస్తారు. వాటిని బట్టి పాయింట్లు వేస్తారు. అవి ఎక్కువ వస్తే జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అనుకూలమైన పాఠశాలను కోరుకునే అవకాశం లభిస్తుంది.

                    సమస్య ఇదీ…

                    జాబితా తయారీ తర్వాత ఉపాధ్యాయులు గుర్తించిన సమస్యను పరిష్కరించాలని ఎక్కువ మంది అభ్యంతరాలు తెలిపారు. గడువు ముగిసే సమయానికి మొత్తం 474 రాగా వాటిలో కేవలం పాఠశాల కేటగిరీపై 300 వచ్చాయి. ఉదాహరణకు కొనకనమిట్ల మండలంలో ఒక ఉపాధ్యాయుడు తాను పని చేసిన చోట 8 ఏళ్లు నిండడంతో బదిలీకి దరఖాస్తు చేశారు. ఆ గ్రామం 4వ కేటగిరీలో ఉండగా దానికి తగినట్లు పాయింట్లు నమోదు కాలేదు. దీనికి కారణం సకాలంలో సరైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడమే. పాఠశాల కేటగిరీలను పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సెలింగ్‌కు ముందు ఆ శాఖ నుంచి విద్యాశాఖ సమాచారం తెప్పించుకుంటుంది. బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయుడి వివరాలు మాత్రమే దానిలో నిక్షిప్తమవుతాయి. ఇప్పుడు అదే గ్రామంలో మరో పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కోరుకుంటూ దరఖాస్తు చేస్తే కేటగిరి వివరాలు అందుబాటులో లేక మూడో దాని కింద నమోదు చేస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణారెడ్డి మాట్లాడుతూ 2009లో కౌన్సెలింగ్‌ జరిగినప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం కేటగిరీ పాయింట్లు ఇవ్వాలన్నారు. ఆ జాబితా లేనందున ఇప్పుడైనా సేకరించి వాస్తవంగా నాలుగో కేటగిరీ పాఠశాలలో పని చేస్తున్న వారికి నష్టం లేకుండా చూడాలని కోరారు. డీఈవో వీఎస్‌ సుబ్బారావును వివరణ కోరగా జిల్లా కమిటీ ఆమోదించిన అన్ని పాఠశాలల కేటగిరీ జాబితా తమ వద్ద ఉందని, దానిని బట్టి పాయింట్లు కేటాయిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాల్లో సహేతుకమైన వాటిని పరిష్కరించి న్యాయం చేస్తామని చెప్పారు.

                    CONFUSION ON SCHOOLS CATEGORY

                    వేకెన్సీలున్నా కనపడవు!

                      0
                      • 1500 పైగా బదిలీ స్థానాలు బ్లాక్‌ చేయడంపై టీచర్ల ధ్వజం

                      ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5: మూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిర్వహిస్తోన్న టీచర్ల సాధారణ బదిలీలకు జిల్లాలో పెద్ద సంఖ్యలో వేకెన్సీ లను బ్లాక్‌ చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇకనైనా మంచి స్థానానికి బదిలీ కోరుకోవచ్చునన్న ఆశలపై విద్యాశాఖ నిర్ణయాలు నీళ్ళు చల్లాయి. అందుబాటులో ఉన్న అన్ని వేకెన్సీలను బదిలీ కౌన్సెలింగ్‌కు చేర్చకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల వల్ల ఉపాధ్యా యులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అన్ని కేడర్లు, సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 4084 వేకెన్సీలు ఉండగా, ప్రస్తుత బదిలీ కౌన్సెలింగ్‌లో వీటన్నింటిని ప్రదర్శించకుండా కేవలం 2537 వెకెన్సీలను మాత్రమే చూపడం పట్ల టీచర్లలో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. 

                      ఎస్‌జీటీ కేడర్‌లో ఏకంగా 1199  వేకెన్సీలు బ్లాక్‌

                      ఒకే స్కూలులో 8 సంవత్సరాలు పనిచేసిన టీచర్లందరినీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో స్కూలు అసిస్టెంట్‌, ఎస్‌జీటీ, కేడర్లలో మొత్తం 1936 మంది టీచర్లు కంపలసరీ ట్రాన్స్‌ఫర్‌ ఉంది. ఇక మొత్తం 4084 వేకెన్సీలు జిల్లాలో ఉండగా వీటిలో సాధారణ బదిలీ కౌన్సెలింగ్‌కు కేవలం 2537 వెకెన్సీలు మాత్రమే చూపించి మిగతా 1547 వెకెన్సీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్లాక్‌ చేశారు. ఇలా బ్లాక్‌ చేసిన వేకెన్సీల్లో 1199 ఎస్‌జీటీ క్యాడర్‌ నుంచే ఉండడం గమనార్హం. ఎస్‌జీటీ కేటగిరిలో 1936 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా 2555 వెకె న్సీలు (ప్లెయిన్‌ ఏరియాలో) అందుబాటులో ఉంటే వాటిలో 1356 వెకెన్సీలను మాత్రమే ప్రదర్శించారు. 

                      సిఫార్సు బదిలీల కోసమేనా ?

                      పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రోడ్డు పక్క న ఉండే పాఠశాలల్లోని వెకెన్సీలనే బ్లాక్‌ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా బ్లాక్‌ చేసిన స్థానాలను రాజకీయ సిఫార్సులకు భర్తీ చేయ డానికి ఉద్దేశించినవేనని విమర్శించాయి. కాగా జిల్లా విద్యాశాఖ వర్గాలు మాత్రం టీచర్ల వాదనను ఖండి స్తున్నాయి. మారుమూల ప్రాంత పాఠశాలల్లోని వెకెన్సీ లు కూడా భర్తీ అయ్యేందుకే ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు బ్లాక్‌ చేసినట్లు వివరించాయి. దీని వల్ల అన్ని పాఠశాలలకు టీచర్లు సమన్యాయంగా అందు బాటులో ఉంటారని చెబుతున్నాయి. 

                      VACANCIES BLOCKED TEACHERS SHOCKED