Saturday, June 21, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
CrimeRewa Incident: మహిళలను సజీవంగా పాతిపెట్టినందుకు ముగ్గురు...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Rewa Incident: మహిళలను సజీవంగా పాతిపెట్టినందుకు ముగ్గురు అరెస్టు.. మరో ఇద్దరు పరారీలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Rewa Incident Arrested: మధ్యప్రదేశ్‌ లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసిన కేసులో 5 మందిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే బాధిత మహిళ మమతా పాండే ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఘటన అనంతరం కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా దృష్టి సారించారు. ఆదివారం నాడు హీనౌతా కోథర్‌ లోని భూవివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణ స్థలంలో రోడ్డు నిర్మాణం విషయంలో గౌకరన్‌ పాండేతో తమ కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారు సురేష్‌ పాండే భార్య ఆశాపాండే (25) పోలీసులకు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గౌకరన్ పాండే, బావ విపిన్ పాండేలు వివాదాస్పద స్థలంలో రోడ్డు నిర్మించేందుకు హైవా నుంచి మట్టిని తీసుకొచ్చారు. దీని తర్వాత ఆశా పాండే తన కోడలు మమతా పాండేతో కలిసి డంపర్ డ్రైవర్‌ ను బాత్రూమ్ కూల్చివేయడాన్నీ నిరాకరించారు. హఠాత్తుగా డంపర్ డ్రైవర్ బురదను త్వరగా పడేశాడు. దాంతో బాధితులు మట్టిలో కూరుకుపోవడం జరిగింది. ఈ సంఘటనలో వెంటనే అక్కడ ఉన్న గ్రామస్థులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయానికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగవాన పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హనౌత కోథార్‌ గ్రామంలో కుటుంబ వివాదంలో ఇద్దరు మహిళలపై బురద చల్లిన కేసులో పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చికిత్స అనంతరం మహిళలు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మధ్యప్రదేశ్ పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల భద్రత ప్రభుత్వ ప్రధానాంశం అని., వారిపై ఎలాంటి అఘాయిత్యం చేసినా నిందితులను విడిచిపెట్టమని., వారికి కఠిన శిక్ష విధించబడుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this