Saturday, June 21, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Life StyleHuman InterestHistory of East India Company: భారత్‌ను...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

History of East India Company: భారత్‌ను బానిసగామార్చి పాలించిన విదేశీ కంపెనీ.. ఇప్పుడు భారతీయుడి చేతుల్లో..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట క్రీ.శ. 1600లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని పరిపాలించే విధంగా మూలాలను నెలకొల్పింది. ఈ కంపెనీ పేరు మరియు వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ భారతదేశాన్ని బానిసగా మార్చిన ఈ కంపెనీ నేడు భారతీయుడికి బానిసగా మారింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం…

17వ శతాబ్దం ప్రారంభంలో భారతీయ సుగంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభమైంది.16వ శతాబ్దంలో స్పెయిన్ మరియు పోర్చుగల్ సామ్రాజ్యవాదం.. వాణిజ్య విషయాలలో ముందంజలో ఉన్నాయి. బ్రిటన్ , ఫ్రాన్స్ లు ఆలస్యంగా రంగంలోకి దిగినప్పటికీ వాటి ఆధిపత్యం వేగంగా పెరిగింది. వాస్తవానికి, పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా భారతదేశానికి వచ్చిన తర్వాత, అతను ఇక్కడి నుంచి ఓడలలో భారతీయ సుగంధ ద్రవ్యాలను తీసుకువెళ్లారు. యూరప్ అంతటా వాటి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. వాస్కోడిగామా అపారమైన సంపదను కూడగట్టుకున్నారు. యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాల దృష్టి మనదేశంపై పడింది. ఈ పనిని బ్రిటన్ తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది.

ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు ఉద్దేశ్యం…
బ్రిటిష్ సామ్రాజ్యవాదం మరియు వలసవాదాన్ని ప్రోత్సహించడానికి 17వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ లు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెద్దదిగా చేయడంలో అతిపెద్ద పాత్ర పోషించింది. ఈస్టిండియా కంపెనీ నిజానికి వాణిజ్యం కోసం ఏర్పడినప్పటికీ.. బ్రిటిష్ పాలన కూడా అనేక ప్రత్యేక హక్కులను కల్పించింది. ఈ అధికారాలలో యుద్ధం చేసే హక్కు కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో, సంస్థ దాని స్వంత పెద్ద మరియు శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. పోర్చుగల్ భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలను ఓడలో తీసుకువెళ్లేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నౌకలను లక్ష్యంగా చేసుకుంది. మొదటి ఓడను దోచుకున్న కంపెనీకి 900 టన్నుల సుగంధ ద్రవ్యాలు లభించాయి. వాటిని విక్రయించడం ద్వారా కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ మసాలా వ్యాపారంలో సుమారు 300% భారీ లాభాలను ఆర్జించింది.

భారతదేశంలో కంపెనీ పాలన ఈ విధంగా కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన మూలాలను స్థాపించడం ప్రారంభించింది. సర్ థామస్ రో మొఘల్ చక్రవర్తి నుంచి సంస్థ యొక్క వాణిజ్య హక్కులను పొందారు. కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా) నుంచి భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించారు. దీని తర్వాత చెన్నై నుంచి ముంబైకి వ్యాపారం విస్తరించింది. సంస్థ యొక్క మొదటి శాశ్వత కర్మాగారం 1613 సంవత్సరంలో సూరత్‌లో స్థాపించారు. 1764 AD నాటి బక్సర్ యుద్ధం ఈస్ట్ ఇండియా కంపెనీకి నిర్ణయాత్మకమైనదిగా నిరూపించబడింది. కంపెనీ క్రమంగా మొత్తం దేశంపై నియంత్రణను పొందింది. భారత్ లో సంవత్సరాల పాటు తన పాలనను కొనసాగించింది. అయితే.. 1857 తర్వాత భారత్ లో బ్రిటిష్ పాలన ప్రారంభమైంది.

భారత సంతతికి చెందిన వ్యక్తి చేతుల్లో కంపెనీ…
ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశపు మొదటి కంపెనీ. ఇది భారతీయ కాదు. బ్రిటన్ ది. ఈ సంస్థ భారతదేశాన్ని చాలాకాలం బానిసత్వపు సంకెళ్లలో బంధించింది. కంపెనీ పాలన ముగిసినప్పటికీ, దాని వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ కాలం మారిపోయింది. భారతదేశం మొత్తాన్ని పాలించిన కంపెనీని నేడు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి పాలిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన సంజీవ్ మెహతా 2010లో ఈస్ట్ ఇండియా కంపెనీని 15 మిలియన్ డాలర్లు అంటే రూ. 125 కోట్లకు కొనుగోలు చేశారు. సంజీవ్ మెహతా దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు ఈస్ట్ ఇండియా కంపెనీని పాలిస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ పూర్తిగా ఇ-కామర్స్ సంస్థగా రూపాంతరం చెందింది. భారతీయ సంతతికి చెందిన సంజీవ్ మెహతా నాయకత్వంలో వ్యాపారం చేస్తోంది. విశేషమేమిటంటే.. ఒకప్పుడు యుద్ధరంగంలోనూ తన సత్తాను చాటిన ఈ సంస్థ.. టీ, కాఫీ, చాక్లెట్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this