Home Blog Page 64

Quality Geyser క్వాలిటీ గీజర్.. 4 వేల గీజర్ 2 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

Quality Geyser వర్షాకాలం ప్రారంభమవడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణం అంతా కూల్ అయిపోయింది. చల్లటి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే స్కూల్ పిల్లలు, ఉద్యోగులు చన్నీటితో స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. వేడి నీరు ఉంటే బాగుండు అని భావిస్తుంటారు. హాట్ వాటర్ కోసం హీటర్లు, గీజర్లు అందుబాటులో ఉన్నాయి. హీటర్ల కంటే గీజర్ల వాడకం ఈజీగా ఉంటుంది. మరి మీరు కూడా కొత్త గీజర్ ను కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే బ్రాండెడ్ ఇన్ స్టంట్ గీజర్ అందుబాటులో ఉంది.

Quality Geyser

వర్షాకాలం మొదలుకొని మళ్లీ సమ్మర్ ప్రారంభమయ్యే దాక వాతావరణం చల్లగానే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చల్లని నీటితో స్నానం చేయడానికి ఇబ్బందిపడుతుంటారు. మరి ఇలాంటి టైమ్ లో ఇంట్లో ఓ గీజర్ ను ఏర్పాటు చేసుకుంటే తక్షణమే వేడి నీటిని పొందొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్)పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ గీజర్ పై 38 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 4400గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 2748కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2 వేలకే దక్కించుకోవచ్చు.

క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ గీజర్ మూడు లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 3 వేల వాట్స్ తో వస్తుంది. రస్ట్ ప్రూఫ్ తో వస్తుంది. రస్ట్ ఫ్రీ బాడితో వస్తుంది. ఫాస్ట్ హీటింగ్ ఫంక్షన్ తో ఇన్ స్టంట్ గా హాట్ వాటర్ పొందొచ్చు. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. 4 లెవల్ సేఫ్టీతో వస్తుంది. గత నెలలో వెయ్యికి పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. మరి మీరు కూడా క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్) కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Viral Video : ఆఫీస్ మీటింగ్ కి మొదటిసారి హాజరైన యువతి.. సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్..

0

Viral Video ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకునేవి డ్యాన్స్ , సాంగ్స్ వీడియోలు. వీటికి బాషతో పని లేదు.. కంటెంట్ ఉంటె చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలు ప్రసిద్ది చెందుతున్నాయి. ఇందుకు సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆఫీస్ మీటింగ్‌లో ఓ యువతి భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని ఓ రంగ్రేజ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

Viral Video

ఈ వీడియోను అంజలి పట్వాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పట్వాల్ ఆఫీస్ మీటింగ్ రూమ్‌గా కనిపిస్తుంది. ఆ గదిలో చాలా మంది నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్ కోసం సహోద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఓ యువతి “ఓ రంగ్రేజ్” పాటకు మనోహరంగా డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేయడం ముసిగినప్పుడు ఆ యువతి చుట్టూ ఉన్న వారి చప్పట్లు కొట్టి అభినందించారు. వీడియోపై ఉన్న టెక్స్ట్ లో మీరు మీ రెజ్యూమ్‌లో ‘డ్యాన్స్’ చేయడం మీ అభిరుచి అని రాస్తే.. అప్పుడు మీ మొదటి టీమ్ మీటింగ్ ఇలా సాగుతుంది అని ఉంది.”

వీడియో చూడండి:

Viral Video పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో ఎనిమిది మిలియన్లకు అంటే 80 లక్షలకు పైగా వ్యూస్ ను అనేక లైక్‌లు సొంతం చేసుకుంది. అంతేకాదు వీడియోకు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మీటింగ్స్ లో మాకు మరింత సృజనాత్మకత అవసరం అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “ఇంక్రిమెంట్ కోసం వాడే టెక్నిక్… అయితే తాను బారాత్ సమయంలో మాత్రమే డ్యాన్స్ చేస్తానని అది కూడా నాగినీ సంగీతం ప్లే చేస్తేనే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. గతంలో తాను పని చేసిన సంస్థలో ఇలాంటివి జరిగినప్పుడల్లా.. తాను తన కుర్చీలో అతుక్కుని పోయి కూర్చునే వాడిని అని చెప్పారు. అసలు ఆఫీసు లో మీటింగ్ లో ఉద్యోగులు, ఆఫీసర్స్ ముందు ఇలా డ్యాన్స్ చేయాలంటే దైర్యం ఉండాలని కామెంట్ చేసారు మరొకరు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Paris Olympics Dhoni Inspiration : ధోనీ స్ఫూర్తి .. ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో ‘టికెట్ కలెక్టర్’!

0

Paris Olympics Dhoni Inspiration పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు పతకాలు సాధించింది. ఆ రెండూ షూటింగ్‌లో వచ్చినవే. ఇప్పుడు షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో స్వప్నిల్ కుశాలె (Swapnil Kusale) ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో స్వప్నిల్  ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత షూటర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం 1గంటకు ఫైనల్‌ జరగనుంది. భారత్‌కు పతక ఆశలు రేపుతున్న స్వప్నిల్ కుశాలె గురించి తెలుసుకుందాం.

Paris Olympics Dhoni Inspiration

29 ఏళ్ల స్వప్నిల్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి, సోదరుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్‌లలో పోటీపడుతున్నాడు. అయితే, కెరీర్ ఆరంభించిన 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ షూటర్‌ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే భారత తరఫున వివిధ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు.

ధోనీని చూసి ప్రేరణ పొంది

క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని చూసి ప్రేరణ పొందానని స్వప్నిల్ చెప్పాడు. ధోనీ కూడా క్రికెటర్‌ కాకముందు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. తర్వాత టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ధోనీ బయోపిక్‌ను చాలాసార్లు చూశానని, అతడిలా గొప్ప విజయాలు సాధించాలనుకుంటున్నట్లు స్వప్నిల్  చెప్పాడు.

Paris Olympics Dhoni Inspiration ‘‘షూటింగ్‌లో  ప్రత్యేకంగా ఎవరినీ అనుసరించను. ఈ క్రీడాంశానికి సంబంధం లేని  ధోనీని ఆరాధిస్తాను. అతని జీవితానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది. నేను అతనిలాగే టికెట్‌ కలెక్టర్‌ని. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. షూటర్‌గా రాణించాలంటే ధోనీలా కూల్‌గా ఉండటం అవసరం. ప్రతి షాట్‌ను  జాగ్రత్తగా పేల్చాలి. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్ మొత్తం ఇదే విధంగా ఉండేలా చూసుకుంటున్నా. మనస్సులో స్కోర్‌ల గురించి ఆలోచిస్తూ కాకుండా ఓపికగా, ప్రశాంతంగా ఉంటూ షూట్‌ చేయాలి. ఒలింపిక్స్‌లో ఇక్కడి వరకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. మను బాకర్‌ పతకం సాధించడం మా కాన్ఫిడెన్స్‌ని పెంచింది. మేం కూడా విజయం సాధిస్తామనే నమ్మకముంది’’ అని వెల్లడించాడు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Donald Trump on Kamala Harris : కమలా హ్యారీస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా?.. డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్

0
  • కొన్నేళ్ల దాకా ఆమె నల్లజాతీయురాలని తెలియదన్న ట్రంప్
  • రాజకీయ ప్రయోజనం కోసం మారిపోయారంటూ విమర్శలు
  • భారతీయ వారసత్వాన్ని ప్రచారం చేసుకునేవారని వ్యాఖ్య

Donald Trump on Kamala Harris అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ కమలా హ్యారీస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారీస్ నిజంగా నల్లజాతీయురాలా?.. లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Donald Trump on Kamala Harris

‘‘కమలా హ్యారీస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు. భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచారం చేసుకున్నారు. నల్లజాతిగా మారిన కొన్నేళ్ల కిందటి వరకు ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు’’ అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు షికాగోలో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్‌’లోని జర్నలిస్టుల ప్యానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికైతే తనను నల్లజాతీయురాలిగానే పిలవాలని కమలా హ్యారీస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నల్లజాతి మహిళ, దక్షిణాసియా వారసత్వం కలిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడడంపై ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఎవరో ఒకరిగా ఉంటేనే తాను గౌరవిస్తానని, కానీ ఆమె స్పష్టంగా అలా ఉండడం లేదని ట్రంప్ విమర్శించారు. కమలా హ్యారీస్ భారతీయురాలిగా ఉండేవారని, అకస్మాత్తుగా ఆమె నల్లజాతి వ్యక్తి అయిందని ఆరోపించారు.

స్పందించిన వైట్‌హౌస్..

డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారీస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైట్‌హౌస్ కార్యాలయం తక్షణమే స్పందించింది. ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. ‘‘వాళ్లు అది.. వీళ్లు ఇది.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు’’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వ్యాఖ్యానించారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Fastag August Rules : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయ్.. మీ ఫాస్ట్‌ట్యాగ్‌ ఐదేళ్లదైతే ఇలా చేయండి

Fastag August Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంకోసం వీలుంటుంది.

Fastag August Rules

  • ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం..
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ మూడు నుండి ఐదు సంవత్సరాల క్రితం జారీ చేయబడినది అయితే వారు కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి.
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐదు సంవత్సరాల క్రితం జారీచేయబడినది అయితే వారు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలి.
  • కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు 90 రోజుల్లో వాహన నెంబర్ ను పాస్ట్ ట్యాగ్ డేటాబేస్ లో నమోదు చేయించుకోవాలి.
  • వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌లు ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడి ఉన్నాయాలేదా అని నిర్ధారించుకోవాలి.
  • వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫొటో అప్లోడ్ చేయాలి.
  • ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ తో కనెక్ట్ చేసుకోవాలి.
  • ప్రతి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కు కనెక్ట్ చేసి ఉండాలి.
  • కొత్తరూల్స్ కు రవాణా శాఖ అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది.
  • ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే టోల్ గేట్ వద్ద వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IND vs SL : భార‌త్‌లో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్‌.. ఏకంగా ఇద్ద‌రు..

0

IND vs SL : టీమ్ఇండియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌తోను 3-0 తేడాతో ఓడిపోయిన శ్రీలంక, క‌నీసం వ‌న్డే సిరీస్‌లోనైనా స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అయితే.. భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్లు దిల్షాన్ మ‌ధుశంక‌, మ‌తీషా ప‌తిర‌ణ గాయాల‌తో వ‌న్డే సిరీస్‌కు దూరం అయిన‌ట్లుగా స్థానిక మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌ట్టు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే స‌మ‌యంలో మ‌ధుశంక ఎడమ కాలికి గాయమైంది.

IND vs SL

మ‌రో వైపు భార‌త్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో బంతిని ఆపే క్ర‌మంలో ప‌తిరాన భుజానికి గాయ‌మైంది. వైద్యులు అత‌డికి రెండు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు. దీంతో భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు వీరిద్ద‌రు దూరం అయిన‌ట్లుగా లంక క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి స్థానాల్లో ఎషాన్ మ‌లింగ‌, మ‌హ్మ‌ద్ షిరాజ్‌ల‌కు తీసుకున్న‌ట్లుగా తెలిపింది. స్టాండ్ బైలుగా కుశాల్ జ‌నిత్‌, జెఫ్రీ వాండ‌ర్సే, ప్ర‌మోద్ మ‌ధుష‌న్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది.

IND vs SL టీమ్ఇండియాతో లంక జ‌ట్టు మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆగ‌స్టు 2 నుంచి వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగ‌స్టు 2, 4, 7 తేదీల్లో మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు వ‌న్డేలు కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.

భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు : చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్‌, అసిత ఫెర్నాండో.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Kohli Stylish Shot : కోహ్లీ కొట్టిన షాట్‌ చూసి.. షాకైన గంభీర్‌! ఆ రియాక్షన్‌ చూడండి

0

Kohli Stylish Shot శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం భారత క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా.. ఇటీవలె శ్రీలంకను మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో లంకను వాళ్లగడ్డపైనే క్లీన్‌ స్వీప్‌ చేసి.. కెప్టెన్‌గా సూర్య, హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ సూపర్‌ స్టార్ట్‌ అందుకున్నారు. ఇక రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భాతర జట్టు ఆటగాళ్లు గట్టి పట్టదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నెట్స్‌లో ముమ్మరంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.

Kohli Stylish Shot

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీ తర్వాత.. రోకో జోడి తొలిసారి గ్రౌండ్‌లోకి దిగనుంది. అందుకే భారత క్రికెట్‌ అభిమానులు ఈ సిరీస్‌పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత.. ఇద్దరి ఆటను చూసేందుకు ఎగ్జైట్‌గా ఉన్నారు. అయితే.. విరాట్‌ కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌లో అంత మంచి ప్రదర్శన చేయని విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడిన కోహ్లీ.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ఒక్క ఫైనల్‌లో మాత్రమే అదరగొట్టాడు.

Kohli Stylish Shot ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌తో తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పర్యవేక్షణలో నెట్స్‌లో కోహ్లీ భారీ భారీ షాట్లు ఆడాడు. కోహ్లీ కొడుతున్న షాట్లు చూసి.. గౌతమ్‌ గంభీర్‌ ఆశ్చర్యపోయాడు. కోహ్లీ కొట్ట బాల్‌ అలా గాల్లోకి వెళ్తుంటే.. గంభీర్‌ ఆ బాల్‌ను అలాగే చూస్తుండి పోయాడు. ప్రస్తుతం కోహ్లీ షాట్‌కు గంభీర్‌ ఇచ్చిన షాకింగ్‌ రియాక్షన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Ransomware Attack : రాన్సమ్‌వేర్ సైబర్ ఎటాక్.. 300 భారతీయ బ్యాంకులపై ప్రభావం!

0
  • చిన్న బ్యాంకుల టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ- ఎడ్జ్ టెక్నాలజీస్‌పై సైబర్ దాడి
  • 300 చిన్న బ్యాంకుల డిజిటల్ చెల్లింపులు తాత్కాలికంగా షట్ డౌన్
  • సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌ని తాత్కాలికంగా ఐసోలేట్ చేసినట్టు ఎన్‌పీసీఐ ప్రకటన

Ransomware Attack భారత్‌లోని పలు చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై రాన్సమ్ వేర్ దాడి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితంగా దాదాపు 300 చిన్న బ్యాంకుల్లో చెల్లింపుల వ్యవస్థలను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఈ విషయమై సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్‌బీఐ కూడా ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Ransomware Attack

భారత్‌లో చెల్లింపుల వ్యవస్థలను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం కీలక ప్రకటన చేసింది. సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌కున్న రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యాక్సెస్‌ను తొలగించినట్టు వెల్లడించింది. సీ-ఎడ్జ్ కస్టమర్లు ప్రస్తుతానికి సంస్థ చెల్లింపుల వ్యవస్థలను వినియోగించుకోలేరని ఆర్బీఐ పేర్కొంది. సమస్య మరింత ముదరకుండా 300 చిన్న బ్యాంకులకు భారత్ రిటైల్ పేమెంట్ వ్యవస్థలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసినట్టు పేర్కొంది. భారత డిజిటల్ చెల్లింపుల్లో ఈ బ్యాంకుల వాటా కేవలం 0.5 శాతమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Ransomware Attack భారత్‌లో ప్రస్తుతం 1,500 కోఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో కొన్నింటిపై సైబర్ దాడి ప్రభావం పడినట్టు తెలుస్తోంది. సమస్య మరింత విస్తరించకుండా పరిస్థితిని ఎన్‌పీసీఐ సమీక్షిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులపై సైబర్ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు, భారత సైబర్ భద్రతా విభాగాలు కొన్ని వారాల క్రితమే వివిధ బ్యాంకులను హెచ్చరించినట్టు కూడా తెలిసింది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Farmer Friendly Snakes : ఈ పాము రైతు నేస్తం..ఎందుకో తెలుసా..

Farmer Friendly Snakes పాము పేరు వింటే చాలామంది భయపడతారు. కనిపిస్తే చంపడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషపూరిత పాముల వల్ల మనుషులకు హానికలిగే అవకాశం ఉంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే జనావాసాల్లోకి పాము వచ్చిందంటే వెంటనే చంపేస్తుంటారు. పాముల వల్ల రైతులకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Farmer Friendly Snakes

మనం చాలా రకాల పాములు చూసే ఉంటాం. అందులో కొన్ని విషపూరితమైనవైతే.. మరికొన్నింటిలో విషయ ఉండదు. ఆ జాబితాలో ఒకటి ధమన్ పేరుగల పాము. ఈ పాము రైతు నేస్తమని చెప్పాలి. ఎందుకంటే ఈ ధమన్‌ పామును ఎలుక పాము అంటారు, ఇది తన జీవితకాలంలో 25 వేల ఎలుకలను తింటుందంట. నిపుణుడు డాక్టర్ డిఎస్ శ్రీవాస్తవ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పాము గురించి చాలా అపోహలు వ్యాపించాయన్నారు. వాటిలో ఒకటి ధమన్ పాములు. ఇవి ఆవు పాలను ఫిల్టర్ చేసి తాగుతాయి. ఇది పాములకు పాలను జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనాలు ఉండవు అనేది అపోహ మాత్రమే.

Farmer Friendly Snakes రైతులకు వరం. దమ్మన్ పాము తన జీవితకాలంలో సుమారు 25 వేల ఎలుకలను తింటుంది. దీని కారణంగా పంటలు నష్టం నుంచి రక్షించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ధమన్ పామును చంపితే 25 వేల ఎలుకల ప్రాణాలు కాపాడినట్లే. ఇది రైతులకు చాలా నష్టం కలిగిస్తుంది. 25 వేల ఎలుకలను విడుదల చేయడం. వాటి సంఖ్య పెరగడం వల్ల భారీ పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ధమన్ ఎప్పుడూ పామును చంపకూడదు. పాములను వాటంతట వాటిని వదిలేయడం మేలు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Ashwin Bating వన్‌డౌన్‌లో వచ్చి.. ఉతికారేసిన అశ్విన్‌! 35 బంతుల్లోనే..

0

Ashwin Bating పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకున్నావా? ఫైరు.. అనే సినిమా డైలాగ్‌లా రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటే చాలా మంది స్పిన్నర్‌ మాత్రమే అనుకుంటారు.. కానీ, అతనో నిఖార్సయిన ఆల్‌రౌండర్‌. టీమిండియాకు ఆడే సమయంలో బ్యాటింగ్‌లో అశ్విన్‌కు సరైన అవకాశాలు రాలేదు కానీ, వచ్చిన తక్కువ సమయాల్లో కూడా తన బ్యాటింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించాడు అశ్విన్‌. తాజాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో అయితే అరివీర భయంకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా కూడా ఆడిన అశ్విన్‌.. బుధవారం చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో 57 పరుగులు చేసి తన టీమ్‌ దిండిగల్‌ డ్రాగన్స్‌ను క్వాలిఫైయర్‌-2కు తీసుకెళ్లాడు.

Ashwin Bating

159 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో ఓపెనర్‌ విమల్ ఖుమార్‌ కేవలం 3 పరుగులకే చేసి అవుట​ అవ్వడంతో డ్రాగన్స్‌ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. శివమ్‌ సింగ్‌తో కలిసి, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి.. అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ శివమ్‌ సింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. ఆల్‌మోస్ట్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ రెండో బంతికి ప్రేమ్‌ కుమార్‌ బౌలింగ్‌లో జగదీషన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. క్వాలిఫైయర్‌-2లో దిండిగల్‌ డ్రాగన్స్‌ తిరుప్పూర్ తమిజన్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది.

ashwin bating

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ అపరాజిత్‌ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లలో జగదీషన్‌ 25, అభిషేక్‌ తన్వర్‌ 22 పరుగులు చేశాడు. ఇక 159 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన దిండిగల్‌ డ్రాగన్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ శివమ్‌ సింగ్‌ 64, కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 57 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.