Home Blog Page 403

ఎం.డి.ఎం ఎం.ఐ.ఎస్ డేటా ఎంట్రీ చేయు విధానం – MIS Online Data Entry

    0

    Step-I. 

    ప్రతి స్కూల్ కి opening balance enter చేయాలి. తరువాత freeze చేయాలి.

    Step-II. 

    Annual Data Entry చేయాలి. Caste wise and Gender wise (ప్రస్తుతం ఉన్న Enrollment ప్రకారం. ఆ స్కూల్ ఉన్నటువంటి  basic details enter చేయాలి. 

    Step-III. 

    Monthly Data Entry చేయాలి, ఆ month లో స్కూల్ సాధారణ working days తీసుకొని (April-16, June-15, July,26, Aug,20 & Sept.25) days గా తీసుకొని మొత్తం Enrollment లేదా Dry ration తీసుకొన్న పిల్లలు X (Multiply) Days ప్రకారం Meals served నమోదు చేయాలి. 

    Cook cum Helper Honorarium ను ఏప్రిల్ మరియు మే నెలకు రూ 500 చొప్పున మిగిలిన నెలలకు (జూలై, ఆగష్టు, సెప్టెంబర్) రూ 1000/- చొప్పున data ను నింపాలి.

    Cooking Cost calculation: Meals Served X (Multiply) Primary స్టూడెంట్ కి రూ.4.75 చొప్పున లెక్కకట్టాలి. Upper Primary అయితే రూ. 7.45 చొప్పున లెక్కకట్టాలి. Data ను నింపాలి.

    Details of Foodgrains: ఆ month లో స్కూల్ సాధారణ working days ద్వారా Primary 100 Grms / Upper Primary 150 Grms X Days ప్రకారం Rice indent నమోదు చేయాలి.

    [post_ads]

    Step-IV.

    Organization Master Entry : SHG / NGOs Monthly Data Enter చేయాలి 

    ముందుగా SHG ను నమోదు చేయాలి. 

    Bank detail వంటి నింపాలి.

    తరువాత ఆ స్కూల్ కి అనుసంధానం చేయాలి.

    Step-V. 

    Aadhar Enrollment data Entry:

    ఏ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ ఉన్నది లేనిది నమోదు చేయాలి.

    Step-VI. 

    School Health Data ను quarter wise నమోదు చేయాలి. (Quarter Wise)

    ఆ quarter సంబంధించిన / జరిగిన School Health Data ఎంటర్ చేయాలి

    జగనన్న విద్యా కానుక తాజా ఆదేశాలు JVK KIT LATEST GUIDELINES 07.10.2020

      0

      ★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలి

      ★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలి

      ★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలి

      ★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.

      డౌన్లోడ్

      [post_ads]

      సంపాదిత శలవుల వినియోగాన్ని నమోదు చేయని/చేయించుకొని వారి పై చర్యలు EL ENCASHMENT SR NOT ENTRY ACTIONS

        0

        రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు తమ సంపాదిత సెలవులను సరెండర్ చేసినపుడు (నగదుగా మార్చుకొనినపుడు) సదరు విషయాన్ని SR లో రికార్డు చేయడంలేదని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో 2014 -15 విద్యాసంవత్సరం నుండి  MRC లోగాని/హైస్కూల్స్ లోగాని  ఎవరైనా ఉపాధ్యాయులు/HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని/చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు ఆర్.జే.డీ  లను  , జిల్లా విద్యాశాాధికారు లను కోరుతూ సి.ఎస్.ఈ వారు మెమో జారీ చేసారు

        All RJDs and DEOs of School Education in the state are requested to immediately get all the leave encashment orders of all of all from the year 2014-15. Memo.No.66-CSE-Peshi-2020(Sub file).  Dated: 06-10-2020.

        డౌన్లోడ్

        [post_ads]

        పూర్వాపరాలు

        అనంతపురం జిల్లాలో ఇరువురు ఉపాధ్యాయుల మధ్య సంపాదిత సెలవుని నగదుగా మార్చుకొని కూడా సేవాపుస్తకంలో రికార్డు చేయని వైనంపై పరస్పర ఆరోపణల పర్యవసానం…. రాష్ట్రం మొత్తం అట్టి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా?….  అని విద్యాశాఖ విచారణ.

        మధ్యాహ్నభోజన కార్మికుల కు కేంద్ర విద్యాశాఖ నిబంధనలు CONDITIONS TO MDM WORKERS

        0

        సూచనలు:

        ◙ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

        ◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.

        ◙ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ 

        [post_ads]

        మార్గదర్శకాలివే:

        ◙ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.

        ◙ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.

        ◙ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.

        ◙ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

        ◙ నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.

        ◙ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.

        ◙ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.

        ◙ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.

        ◙ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.

        ◙ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.

        ◙ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.

        ◙ భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

        మళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC VOTE

        0

         తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

        గతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దు

        ఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు

        ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. 

        గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు.

        అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఈవో ఆంధ్ర.ఎన్ ఐసీ.ఇన్ వెబ్ సైట్లో ఇప్పటికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. 

         ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

        [post_ads]

        ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

        2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. 

        అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపొయారు. ఈ దఫా కూడా ఇంచుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

        ఉపాధ్యాయ స్కూల్ అసింట్ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది.

        జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది.

        ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొందవచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు.

        ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

        ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటిల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది.

        ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్నస్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యాయులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు.

        అన్లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన ఏ.పి ప్రభుత్వం UNLOCK 5.0 GUIDLINES RELEASED BY GOVT OF AP

          0

          HM&FW Department

          Containment, Control and Prevention of COVID – 19 – The Epidemic Disease Act, 1897- Disaster Management Act, 2005 –“Unlock 5.0” Guidelines for Phased Reopening in the State of Andhra Pradesh – Orders-Issued.

          Download Orders

          [post_ads]

          అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక” JAGANANNA VIDYAA KANUKA ON OCTOBER 8TH

          0

          సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి

          ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్న విద్యాకానుక” కార్యక్రమాన్ని అక్టోబర్ 8న (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

          ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ, విద్యార్ధులకు  దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు పంపిణి చేస్తారని వెల్లడించారు.

           ప్రభుత్వ యాజమాన్యం లోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యారినీ, విద్యార్థులందరికీ స్టూడెంట్  కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 

          ప్రతి స్టూడెంట్ కిట్ లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు. 

          బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే 

          ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ విజయకుమార్ రెడ్డి తెలిపారు.

          జారీ చేసినవారు: సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, విజయవాడ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

          నిశితా శిక్షణ అవగాహన UNDERSTAND NISHITHA TRAINING

            0

            నిశితా శిక్షణ అవగాహన కొరకు

            • 06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి
            • దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి
            • యూజర్నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి
            • ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది
            • మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది
            • ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు
            • రెండవది 11 నుండి 15 వరకు
            • ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది
            • ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.

            ఈ 5 రోజులలో

            • మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
            • రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది. మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు
            • మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
            • నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
            • ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.

            దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు

            ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.

            ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.

            వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.

            శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.

            ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO’S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

            ఏపీ స్కూల్ రెగ్యులేటరీ మిషన్ తనిఖీలు APSERMS VISITS TO SCHOOLS TO VERIFY UDISE DATA

              0

              ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమిషన్ APSERMC  ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు గారి ఉత్తర్వుల సారాంశం

              [post_ads]

              👉 రాష్ట్రంలో మొత్తం 62413 పాఠశాలలుండగా , అందులో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య  44778 , ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 15044 , ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య  2591.

              👉 UDISE డేటా మూల్యాంకనం చేయుటకు రాష్ట్రంలో  పాఠశాల విద్యా శాఖ తరపున 4 గురు RJD SE లు  , 13 మంది DEO లు , 66 మంది DyEO లు , 666 మంది MEO లు కలరు. పై గణాంకాల ప్రకారం ప్రతి అధికారి సాలీనా/సగటున 83 పాఠశాలలు సందర్శన/తనిఖీ చేయవలసి ఉంటుంది.

              👉 APSERMC కి సంక్రమించిన అధికారాల మేరకు  మరియు DSE AP వారితో చర్చల అనంతరం, UDISE లో పొందుపరచబడిన ఉపాధ్యాయ సిబ్బంది యొక్క లభ్యత , మౌలిక సదుపాయాలు , ఇతర వివరాల నమోదును సరిచూడాలని/తనిఖీ చేయాలని  నిర్ణయించబడినది.

              👉 ది.05.10.2020 నుండి ది.17.10.2020 వరకు రెండు దశలలో 2591 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలను, 15044 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలను  తనిఖీ చేయాలి  మరియు ది.17.10.2020 నుండి ది.31.10.2020 వరకు మూడవ దశలో భాగంగా 44778 ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయవలసి ఉన్నది.

              👉 తనిఖీ  చేయు బృందాలు

              హైస్కూల్ : గ్రేడ్ 2 HM (1), SGT(1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

              ప్రైమరీ స్కూల్ : గ్రేడ్ 2 HM లేదా SA (1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

              👉 ఈ బృందాలకు తాము పనిచేయు మండలాలలో తనిఖీ  బాధ్యతలు కేటాయించరాదు.

              👉 డా శ్రీమతి ఏ. విజయ శారదా రెడ్డి , వైస్ ఛైర్ పర్సన్ , APSERMC మరియు ఇతర APSERMC సభ్యులు సదరు తనిఖీని పర్యవేక్షణ చేస్తారు.

              👉 కావున తనిఖీ చేయు క్షేత్రస్థాయి అధికారులకు/సిబ్బందికి  పై సూచనలు పాటించేలా తగు మార్గదర్శనం చేయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను , APC SS లను కోరుతూ APSERMC ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు  ఉత్తర్వులు జారీచేశారు.

              జగనన్న విద్యా కానుక పంపిణీ వాయిదా. మరి ఎప్పుడు ఉండొచ్చు ? JVK KIT DISTRIBUTION POSTPONED

              0

              Dear all RJDs/DEOs,

              Please make note that the scheduled launch of JAGANANNA VIDYA KANUKA on 5/10/2020 is post poned.Please inform the same to all Dy.E.Os/M.EOs/and HMs.

              Further date will be informed very soon.

              Regards – IT CELL

              రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి  పోస్ట్ పోన్ చేయబడినది.
              తరువాత  రెండు మూడు రోజుల్లో  నిర్వహించబడును.
              కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు స్టాక్  పాయింట్ నందు ఉన్న జగనన్న కానుకలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయవలెను.
              అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకొనవలెను.
               మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక app డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండవలెను అని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనంతపురము వారు తెలియజేస్తున్నారు
              ఇట్లు
              సీఎం ఓ విభాగము 
              ఏపీ సమగ్ర శిక్ష