జగనన్న విద్యా కానుక పంపిణీ లో వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ డైరెక్టర్ వారు తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి
[post_ads]
యూ డైస్ 2019-20 డేటా వెరిఫికేషన్ సమగ్ర వెరిఫికేషన్ కి సంబంధించి న మార్గదర్శకాలను డైరెక్టర్ గారు విడుదల చేశారు. ఉత్తర్వుల కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.
[post_ads]
Lr.Roc.No.11021/190/2019-J SEC(2738412/2019-J3), dated 30/09/2020
Sub:MA & UD Dept., – Sanction of Notional increments to the Special Teachers/ Special
LPs/ PET who are appointed on fixed pay of Rs. 398/- p.m. during the period from 1983 to 1996 with prospective effect to Municipal Teachers on par with School Education Department – Certain information – Called for – Regarding.
[post_ads]
ప్రతి స్కూల్ కి opening balance enter చేయాలి. తరువాత freeze చేయాలి.
Annual Data Entry చేయాలి. Caste wise and Gender wise (ప్రస్తుతం ఉన్న Enrollment ప్రకారం. ఆ స్కూల్ ఉన్నటువంటి basic details enter చేయాలి.
Monthly Data Entry చేయాలి, ఆ month లో స్కూల్ సాధారణ working days తీసుకొని (April-16, June-15, July,26, Aug,20 & Sept.25) days గా తీసుకొని మొత్తం Enrollment లేదా Dry ration తీసుకొన్న పిల్లలు X (Multiply) Days ప్రకారం Meals served నమోదు చేయాలి.
Cook cum Helper Honorarium ను ఏప్రిల్ మరియు మే నెలకు రూ 500 చొప్పున మిగిలిన నెలలకు (జూలై, ఆగష్టు, సెప్టెంబర్) రూ 1000/- చొప్పున data ను నింపాలి.
Cooking Cost calculation: Meals Served X (Multiply) Primary స్టూడెంట్ కి రూ.4.75 చొప్పున లెక్కకట్టాలి. Upper Primary అయితే రూ. 7.45 చొప్పున లెక్కకట్టాలి. Data ను నింపాలి.
Details of Foodgrains: ఆ month లో స్కూల్ సాధారణ working days ద్వారా Primary 100 Grms / Upper Primary 150 Grms X Days ప్రకారం Rice indent నమోదు చేయాలి.
[post_ads]
Organization Master Entry : SHG / NGOs Monthly Data Enter చేయాలి
ముందుగా SHG ను నమోదు చేయాలి.
Bank detail వంటి నింపాలి.
తరువాత ఆ స్కూల్ కి అనుసంధానం చేయాలి.
Aadhar Enrollment data Entry:
ఏ స్కూల్ ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ ఉన్నది లేనిది నమోదు చేయాలి.
School Health Data ను quarter wise నమోదు చేయాలి. (Quarter Wise)
ఆ quarter సంబంధించిన / జరిగిన School Health Data ఎంటర్ చేయాలి
★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలి
★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలి
★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలి
★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
[post_ads]
రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయులు తమ సంపాదిత సెలవులను సరెండర్ చేసినపుడు (నగదుగా మార్చుకొనినపుడు) సదరు విషయాన్ని SR లో రికార్డు చేయడంలేదని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో 2014 -15 విద్యాసంవత్సరం నుండి MRC లోగాని/హైస్కూల్స్ లోగాని ఎవరైనా ఉపాధ్యాయులు/HM లు సంపాదిత సెలవును నగదుగా మార్చుకొని కూడా SR లో రికార్డు చేయని/చేయించుకోని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఆ వివరాలను ది.20.10.2020 లోపు తమ కార్యాలయమునకు పంపవలసిందిగా అందరు ఆర్.జే.డీ లను , జిల్లా విద్యాశాాధికారు లను కోరుతూ సి.ఎస్.ఈ వారు మెమో జారీ చేసారు
[post_ads]
◙ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.
◙ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్లైన్స్ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్
[post_ads]
◙ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.
◙ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.
◙ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.
◙ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్ ధరించాలి.
◙ నెయిల్ పాలిస్(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.
◙ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.
◙ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.
◙ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.
◙ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్ క్లోరిన్తో కడగాలి.
◙ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్లలో భోజనం వడ్డించాలి.
◙ సీటింగ్ అరేంజ్మెంట్లో మార్కింగ్ ఉండాలి.
◙ భోజనం 65డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది.
గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు.
అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఈవో ఆంధ్ర.ఎన్ ఐసీ.ఇన్ వెబ్ సైట్లో ఇప్పటికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు.
ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
[post_ads]
ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు.
అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపొయారు. ఈ దఫా కూడా ఇంచుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఉపాధ్యాయ స్కూల్ అసింట్ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది.
జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది.
ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొందవచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు.
ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటిల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్నస్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యాయులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ, విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు పంపిణి చేస్తారని వెల్లడించారు.
ప్రభుత్వ యాజమాన్యం లోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యారినీ, విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ప్రతి స్టూడెంట్ కిట్ లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు.
బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
జారీ చేసినవారు: సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, విజయవాడ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం