Home Blog Page 401

గ్లోబల్ హాండ్ వాష్ డే కార్యక్రమం సూచనలు GLOBAL HAND WASH DAY ON 15.10.2020 INSTRUCTIONS

    0

    జిల్లా విద్యాశాఖాధికారులు / ఎక్స్-ఆఫీషియో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు మరియు రాష్ట్రంలోని సమగ్ర శిక్ష యొక్క అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు గ్లోబల్ హ్యాండ్ వాష్ దినోత్సవాన్ని 15.10.2020 న నిర్వహించాలని మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరియు వీడియోలను అప్‌లోడ్ చేయడానికి అన్ని హెడ్ మాస్టర్స్ / ప్రిన్సిపాల్స్‌కు అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

    డౌన్లోడ్

    [post_ads] 

    Facebook page: Samagra Shiksha Andhra Pradesh

    https://www.facebook.com/Samagra-Shiksha-Andhra-Pradesh-103751007738086/

    Use the hashtag: #handhygieneforall

    ఉపాధ్యాయుల బదిలీలు – వెబ్ కౌన్సెలింగ్ విధానం అవగాహన UNDERSTAND WEB BASED TRANSFERS

      0

      ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను రూపొందిస్తోంది. వాటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వానికి పంపనుంది. గతంలో పెట్టిన పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అవకాశం ఉంది.

      ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.

      రాష్ట్ర వ్యాప్తంగా 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.  

      కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.

       మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు.

      మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

      దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.

      MEO గారు DEO గారికి పంపుతారు.

      DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.

      ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు మీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.

      ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.

      క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.

      8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.

      బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.

      ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.

      ఒకసారి confirm చేసిన తర్వాత మీరు పనిచేస్తున్న పాఠశాల కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.

      8 & Rationalization ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.

      కంపల్సరీ కానివారు ఎన్ని ఆప్షన్లు అయినా  ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.

      ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.

      EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.

      అయితే ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.

      మీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగాను మరియు మీరు ఆప్షన్లు ఇచ్చిన places priority ఆధారంగా మీకు place allotment జరుగుతుంది.

      బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.

      మీకు Allotment place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.

      ప్రతి cycleలో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా…? అని చెక్ చేస్తుంది.

      ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్  కోరి ఉంటారో…? వారికే కేటాయిస్తుంది.

      మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(Presnt school)కేటాయించబడుతుంది.

      బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

      జగనన్న విద్యా కానుక డాష్ బోర్డు JAGANANNA VIDYA KANUKA DASH BOARD

        0

         జగనన్న విద్యా కనుక పంపిణీ లో భాగంగా విద్యార్థులకు అందచేసే కిట్ యొక్క డాష్ బోర్డు ను ఏర్పాటు చేశారు. ఈ డాష్ బోర్డు లో ఎంత మంది విద్యార్థులు తీసుకున్నారో అంశాల వారీగా చూపిస్తుంది. అదే విధంగా జిల్లాల వారీగా ఎన్ని కిట్స్ అందచేయ బడ్డాయి అనేది కూడా చూపిస్తుంది. ఈ క్రింది లింక్ ద్వారా మీరు జగనన్న విద్యా కనుక స్టేటస్ ను తెలుసు కోవచ్చు.

         ఇక్కడ క్లిక్ చేయండి

        [post_ads]

        కరువు భత్యం టేబుల్, వ్యక్తిగత ఎరియర్స్ టేబుల్ DA ARREARS READY RECKONER, INDIVIDUAL EARNINGS TABLE

          0

          మీ వ్యక్తిగత కరువు భత్యం ఏరియర్స్ ను ఈ క్రింది లింక్ పై లెక్క కట్టుకోవచ్చు. జనవరి 2018 కి మీ బేసిక్ పే సెలెక్ట్ చేసుకుని,  మీ ఇంక్రిమెంట్ నెల సెలెక్ట్ చేసుకుని, మీ హెచ్.ఆర్.ఏ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. జూలై 2018 నుండి అక్తోబర్ 2020 వరకు మీకు రావాల్సిన డి.ఏ బకాయి మొత్తం చూపిస్తుంది.

          ఈ అరియర్ టేబుల్ లో మీ పేరు కూడా చేర్చుకోవచ్చు. పి.డి.ఎఫ్. రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. టేబుల్ చివరన నవంబర్ 2020 నుండి పెరిగే జీతం కూడా చూపిస్తుంది.

          http://s1.newstone.in/da/individual.php

          లేదా

          http://s2.newstone.in/da/individual.php

          లేదా

          http://s3.newstone.in/da/individual.php

          జూలై 2018 నుండి రావాల్సిన కరువు భత్యం (DA) రెడీ రెక్నోర్ టేబుల్ ను వివిధ హెచ్.ఆర్.ఏ ల పై క్రింది లింక్ పై తెలుసుకోండి.

          మీ పేరు కూడా ఈ టేబుల్ లో ఎంటర్ చేసుకోవచ్చు. పి.డి.ఎఫ్ రూపంలో డౌన్లోడ్ కు బటన్ ఇవ్వబడింది.

          http://s1.newstone.in/da/

          లేదా

          http://s2.newstone.in/da/

          లేదా

          http://s3.newstone.in/da/

          బదిలీల సమాచారం TRANSFERS NEWS 11.10.2020

            0

             బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు మార్గం సుగమమైంది.

            66 రోజుల కిందటే సిద్ధమైన బదిలీల ఫైల్‌పై సీఎం జగన్‌ శనివారం సంతకం చేశారు. ఆ వెంటనే సంబంధిత ఫైలు పాఠశాల విద్య శాఖ ముఖ్యకార్యదర్శికి చేరింది. బదిలీలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ఉత్తర్వులు వచ్చే వారంలో విడుదల కానున్నాయి. తొలుత ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్‌, తర్వాత బదిలీలకు వీలుగా షెడ్యూల్‌ విడుదల కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు. అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్‌ పాయింట్లకు బదులు సర్వీస్‌ పాయింట్లను (ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.

            టీచర్ల బదిలీలకు ఓకే!

            • ఎనిమిదేళ్లున్న ఉపాధ్యాయులకు, ఐదేళ్లున్న హెచ్‌ఎంలకు తప్పనిసరి
            • రెండేళ్లు పూర్తి చేసుకున్నా అర్హులే
            • ఫిబ్రవరి 29 కటాఫ్‌.. పెర్ఫార్మెన్స్‌ పాయింట్ల స్థానంలో సర్వీసు
            • సీఎం సంతకం, త్వరలో ఉత్తర్వులు
            • ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, కౌన్సెలింగ్‌

            అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 66 రోజుల కిందటే సిద్ధమైన బదిలీల ఫైల్‌పై సీఎం జగన్‌ శనివారం సంతకం చేశారు. ఆ వెంటనే సంబంధిత ఫైలు పాఠశాల విద్య శాఖ ముఖ్యకార్యదర్శికి చేరింది. బదిలీలు చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ఉత్తర్వులు వచ్చే వారంలో విడుదల కానున్నాయి. తొలుత ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్‌, తర్వాత బదిలీలకు వీలుగా షెడ్యూల్‌ విడుదల కానుంది.

            కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు. అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్‌ పాయింట్లకు బదులు సర్వీస్‌ పాయింట్లను(ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

            40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు. టీచర్లు, విద్యార్థుల 1:30 నిష్పత్తిలో పోస్టులను కేటాయించారు. గతంలో 80 మంది విద్యార్థులకు 4 పోస్టులు, 100 మంది విద్యార్థులకు 5 పోస్టులు, 120 మంది విద్యార్థులకు 6 పోస్టులు ఇచ్చారు. అప్పుడు నిష్పత్తి 23గా ఉండగా ప్రస్తుతం దాన్ని 1:30గా నిర్ణయించారు. మొత్తం మీద కొన్ని మార్పులతో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

            నాడు నేడు ఖర్చుల వివరాలు తెలుసుకొనే విధానం KNOW NADU NEDU SCHOOL EXPENSES

            0

            మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తి డేటా

            ఏ విధమైన కోడ్ లేకుండా మొత్తం ఖర్చుల వివరాలు చూడవచ్చు.

            జిల్లా, మండలము,గ్రామము,పాఠశాల పేరును సెలక్ట్ చేసి నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు, మొదలైనవి పరిశీలించవచ్చును.

            http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx

            [post_ads]

            బాలికే భవిష్యత్తు వినూత్న కార్యక్రమం GIRL IS FUTURE PROGRAMME

            0

            అనంతపురం కలెక్టర్ వినూత్న కార్యక్రమం

            అక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన  అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యం తో  అంతర్జాతీయ బాలికా దినోత్సవాన బాలికలకు అపురూపమైన అవకాశం కల్పించిన కలెక్టర్

            అక్టోబర్ 11 వ తేదీన ప్రతి కార్యాలయంలో  ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం

            కార్యాలయపు అధికారిగా ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో  ఏదైనా అమలు చేయాలనుకుంటే నిర్ణయం  తీసుకునే  అవకాశాన్ని కల్పించిన కలెక్టర్

            కార్యాలయపు అధికారిగా బాలిక తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్

            రేపు  కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు..ఇలా  అన్ని స్థాయిల్లోనూ  కార్యాలయపు అధికారులుగా  ఒక్క రోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బాలికలు

            శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

            జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం  సందర్భంగా ఒకరోజు బాలికా అధికారులు పదవుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

            ఉపాధ్యాయ బదిలీల ఫైల్ పై సీ.ఎం సంతకం CM SIGNED TEACHER TRANSFERS FILE

              0

              జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు శుభవార్త – బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ 

              ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

              29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు.

              ఉపాధ్యాయులకు శుభవార్త
              రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు

              ఎట్టకేలకు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన ఫైలు పై ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారు. దీనిపై ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయని . ఏపిజిఈఎఫ్‌ ఛైర్మన్ ‌వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 29 , 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ ‌కౌన్సిలింగ్‌ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఇది శుభవార్తే.

              బదిలీల హై లైట్స్

              • రేషన్ లైజేషన్ కు కటాఫ్ 29.2.2020, స్టాఫ్ పాటర్న్ లో ఏ‌మార్పు లేదు. 
              • 60 రోలు వరకు 2 ఎస్.జీ.టీ పోస్టులు
              • బదిలీలకు 1.9.2020 కటాఫ్.
              • కనీసం రెండు సంవత్సరాల సర్వీస్, 5/8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి అయిన వారు తప్పని సరి బదిలీ
              • వెబ్ కౌన్సెలింగ్
              • సర్వీస్, స్టేషన్ పాయింట్స్ మాత్రమే. వేరే ఏ విధమైన స్పెషల్ పాయింట్స్ ఉండవు.
              • వ్యాధి గ్రస్తులు, వికలాంగులకు ప్రిఫరెన్స్
              • రెండేళ్ళలో రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు

              యూ డైస్ వెరిఫికేషన్ ఇన్స్పెక్షన్ ప్రోఫార్మ UDISE VERIFICATION INSPECTION PROFORMA

                0

                తనిఖీ కి వచ్చే అధికారి https://udise.ap.gov.in నుండి

                పాఠశాల డి.సి.ఎఫ్ ఫార్మాట్ ను డౌన్లోడ్ చేసుకుని సరి పోల్చు కుంటారు.

                1) యూడైస్ లో నింపిన వివరాలు భౌతికంగా పోల్చి చూసినప్పుడు సరిగా ఉన్నాయా? ఒకవేళ లేని పక్షంలో ఆ తేడాలను నమోదు చేస్తారు. 

                2) ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ వారి ప్రొఫార్మాను కూడా నింపుతారు.

                డౌన్లోడ్ ఇన్స్పెక్షన్ ప్రోఫార్మ

                [post _ads]