Home Blog Page 399

ఫ్యాప్టో ప్రాతినిధ్యాలకు సమాధానాలు ఇచ్చిన కమీషనర్

    0
    • దాదాపు అన్ని ప్రాతినిధ్యాలకు నో
    • ప్రాతినిధ్యం చేసేటపుడు సరైన భాష ఉపయోగించాలని హితవు

    అమరావతి: బదిలీలకు సంబంధించి ఫ్యాప్టో తరపున ఇచ్చిన అన్ని దాదాపు ప్రాతినిధ్యాలకు విద్యాశాఖ కమీషనర్ నో చెప్పారు. ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చి క్రమ బద్దీకరణ కసరత్తు పూర్తి అయినందున ఎలాంటి మార్పులు ఉండబోవు అని ప్రతి లేఖ గా ఉత్తర్వుల రూపం లో తెలియ చేశారు. ఫ్యాప్టో కొన్ని సందర్భాలలో వారు ఉపయోగిస్తున్న భాష సరిగా ఉండడం లేదనీ, ఆ విధమైన భాషా ప్రయోగం మానుకోవాలని ఘాటు గా బదులు ఇచ్చారు. ప్రాతినిధ్యం చేసేటపుడు సరైన భాష ఉపయోగించాలని హితవు పలికారు. వెబ్ కౌంసిలింగ్ డెమో ని ప్రదర్శిస్తామనీ, త్వరలోనే తేదీ, సమయం తెలియ చేస్తామని తెలిపారు.

    బడికి ఎందుకు రావట్లేదు..?

      0

      • నేటి నుంచి ఇంటింటి సర్వే

      సత్తెనపల్లి: పాఠశాలలు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్నా 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు అత్యంత తక్కువగా ఉండడంపై విద్యాశాఖ అంతర్మథనంలో ఉంది. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా బడుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అభ్యసనకు ఎందుకు విద్యార్థులు రావట్లేదని తెలుసుకునే ప్రయత్నం చేయబోతోంది. ఈ నెల 2వ తేదీ నుంచి జిల్లాలో ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు 67,232 మంది, పదో తరగతి విద్యార్థులు 63,955 మంది బడులకు రావాల్సి ఉన్నా 30 శాతం మంది కూడా రావట్లేదు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లోనూ రెండు తరగతుల పిల్లల హాజరు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బడిమొఖం ఇప్పటివరకు చూడని వేలాదిమంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకునే సర్వేను శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్నారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించారు. వారు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులతో మాట్లాడి బడులకు హాజరయ్యేలా చూడనున్నారు.

      బదిలీల పై సూచనలు జారీ చేసిన ప.గో డిఈవో

        0
        • బదిలీలకు ఎన్ని సార్లు అయినా అప్ప్లికేషన్లు పెట్టుకోవచ్చు
        • తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు

        ఏలూరు: ఉపాధ్యాయ బదిలీల విధానం పై ఎం.ఈ.వో, డీవైఈవో లకు ప.గో డి.ఈ.వో శ్రీమతి సి.వి.రేణుక సూచనలు జారీ చేశారు. ఉపాధ్యాయులు తప్పుగా నమోదు చేసి సబ్మిట్ చేసే దరఖాస్తు లని ఆన్లైన్ లో తిరస్కరించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు బదిలీలకు ఎన్ని సార్లు అయినా అప్ప్లికేషన్లు పెట్టుకోవచ్చు అయితే వారు ముందుగా వారు సబ్మిట్ చేసిన దరఖాస్తులని డిలీట్ చేయాలి. షెడ్యూల్ లోపు కొత్త దరఖాస్తు ను సబ్మిట్ చేయాలి. ఉపాధ్యాయులు తప్పుడు సమాచారం ఇచ్చి దరఖాస్తు సమర్పిస్తే చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. స్పౌజ్ కోటా లో దరఖాస్తు చేసే వాళ్ళు వారి స్పౌజ్ కి దగ్గరగా ఉండే పాఠశాల ను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, స్పౌజ్ కి దూరంగా ఉండే ఎక్కువ హెచ్.ఆర్.ఏ ఉండే ప్రాంతాల లోని పాఠశాల ను కోరుకోవడానికి వీలు లేదని తెలిపారు.

        మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు

          0

          మచిలీపట్నం : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం బదిలీల అంశపై జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీలపై ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు ప్రకటించాలని పలువురు నాయకులు కోరగా ఖాళీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఛైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలను నమోదు చేసే సమయంలో ఇంగ్లీషు మాధ్యమం అని నమోదు చేస్తే వేరే మాధ్యమాలుగా తీసుకుంటున్నట్లు డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం ఖాళీలను ప్రదర్శించాలని కొన్ని సంఘాల నాయకులు కోరారు. హేతుబద్ధీకరణ, బదిలీల జీవోలో ఉన్న కొన్ని అంశాలను తొలగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇలా వివిధ అంశాలపై సమీక్షించారు. వివిధ సంఘాల నాయకులు లెనిన్‌బాబు, మనోహర్‌, నాగరాజు, కొమ్ముప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

          బదిలీలకు ప్రస్తుత సర్వీసు మాత్రమే పరిగణన లోకి తీసుకొనుట వీలు కాదు

            0
            • బదిలీలకు ప్రస్తుత సర్వీసు మాత్రమే తీసుకోవాలని కోరిన డైరెక్ట్ ఎస్.ఏ లు
            • అది సాధ్యం కాదని ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టర్

            అమరావతి : ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీలలో ప్రస్తుత సర్వీసు ను మాత్రమే పరిగణన లోకి తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కొంత మంది డైరెక్ట్ ఎస్.ఏ లు కోర్టు ద్వారా విద్యా శాఖ ను కోరారు. అయితే వారి అభ్యర్ధన ను విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ చిన వీరభద్రుడు తిరస్కరించారు. ఈ మేరకు కోర్టు ను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు డైరెక్టర్ వారు ఉత్తర్వుల ద్వారా సమాధానం పంపారు. మొత్తం సర్వీసు ను పరిగణన లోకి తీసుకుంటూ సంవత్సరానికి 0.5 పాయింట్లు చొప్పున ఇవ్వనున్నట్టు మరియు కేవలం ప్రస్తుత సర్వీసు మాత్రమే లెక్క లోకి తీసుకోవడం సాధ్య పడదని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

            ఈ హాజరు టాబ్ నిర్వహణ పై సూచనలు

              0

              ఈ హాజరు కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది విషయాలు గమనించగలరు.

              ఐరిష్ టాబ్ నందు వాట్సాప్ మరియు యూ ట్యూబ్ లను వెంటనే అన్ ఇన్ స్టాల్ లేదా డిసేబుల్ చేయాలి
              మై ఫైల్స్ నందు డివైజ్ స్టోరేజ్ లో SIMS మొదలగు తాత్కాలిక ఫైల్స్, విడియో ఫైల్స్, ఫొటో లను డిలీట్ చేయండి
              ఉపయోగంలో / వినియోగంలో లేని పాత అప్లికేషన్లు అన్ ఇన్ స్టాల్ చేయగలరు
              హోమ్ స్క్రీన్ ఎపుడూ టచ్ విజ్ హోమ్ ను ఎంపిక చేసుకోవాలి
              ఒక వేళ లాంచర్ ఏక్టివేట్ అయినట్లయితే ఈ క్రింది పాస్ కొడ్ లలో ఏదో ఒక దాని ని ఉపయోగించి అన్ లాక్ చేయ గలరు.
              4545 లేదా 1212 లేదా 2525 లేదా 0852
              టైం ఫార్మాట్ ను 24 గంటలకు తగిన విధంగా సెట్టింగ్స్ లో సరిచేసుకోవాలి

              టీచర్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ క్యాలిక్యులేటర్

                0

                టీచర్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ప్రస్తుతం జరగబోయే బదిలీ లలో ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.

                http://s2.newstone.in/transfers/calculate.php

                లేదా

                http://s1.newstone.in/transfers/calculate.php

                లేదా

                http://s3.newstone.in/transfers/calculate.php

                ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం – ముఖ్యాంశాలు

                  0

                  1) ప్రాథమిక పాఠశాలలు – 1:20 -34 వేల పాఠశాలలకు ఉన్న 76 వేల పోస్టులను సర్దుబాటు చేయాలని, ఒక వేళ పోస్టులు మిగిలితే సర్దుబాటు చేస్తామని, విషయాన్ని సి.యం. దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
                  2) మేన్యువల్ కౌన్సిలింగ్ – పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ. అంగీకరించే అవకాశం
                  3) ఖాళీలు – బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
                  4) అడ్ హాక్ పదోన్నతులు – సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
                  5) సర్వీస్ పాయింట్లు – 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
                  6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
                  7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
                  8) యం. ఎ (తెలుగు) కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి. 3rd మెథడాలజీకి అంగీకారం
                  చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

                  ఈ రోజు FAPTO CSE, AP వారితో చర్చించబోయే అంశాలు

                    0

                    ఫ్యాప్టో రేషనలైజేషన్ పై కింది అంశాలను ప్రతిపాదించింది..

                    1 ) ప్రాథమిక పాఠశాలలకు 1:20 అమలు చేయాలి . 41 రోలు వద్ద 3 , 61 రోలు వద్ద 4 , 80 పై బడిన మోడల్ పాఠశాలలను 2 + 1 LFL , తో కొనసాగించాలి .

                     2 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలి . 

                    3 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక ఆంగ్ల ఉపాధ్యాయుల పోస్టు మంజూరు చేయాలి . 

                    4 ) అవసరమైన నూతన పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి . 

                    5 ) ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే సందర్భంలోనూ 1:20 అమలు చేయాలి .. ! 

                    6 ) ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నత తరగతుకు 1:35 గా ఉండాలి .

                    7 ) ఉన్నత పాఠశాలలకు రోలు వారి కాకుండా మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయాలి .

                    8 ) ఉన్నత పాఠశాలలకు సెకప్ 1:35 గా ఉండాలి . 

                    9 ) ఆప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టుతో పాటు ఇతర అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి .

                    10 ) కటాఫ్ తేదీ అక్టోబర్ 1 గా ఉండాలి .

                    బదిలీలు అంశాలలో సవరించ వలసినవి :

                     1 . 2019 జూస్ నుండి భర్తీ చేసిన పదోన్నతులు , అప్ గ్రేడేషన్ పాఠశాలలను ఖాళీలు గా చూపాలి . పదోన్నతులు పొంది 2 సర్వీసు ఉన్న వారిని మినహాయించాలి . 2018 DSC నియామకాల పోస్టులను ఖాళీలుగా చూపాలి . 

                    2 ) పోస్టలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాలీలను బదిలీలకు చూపాలి . 

                    3 ) ప్రభుత్వ , జిల్లా పరిషత్ పాఠశాలల మధ్య బదిలీలకు అవకాశం ఇవ్వాలి .

                     4 ) ఏజన్సీ నుండి ప్లేస్ ఏరియాకు అవకాశం కల్పించాలి . 

                    5 ) ఆగస్టు 31 కటాఫ్ గా ఉపాధ్యాయులకు 8 , ప్రధానోపాధ్యాయులకు 5 పూర్తి సంవత్సరాలుగా ఉండాలి . 

                    6 ) సర్వీసు పాయింట్లు ఏడాదికి 1 చొప్పున ఉండాలి . 

                    7 ) కేటగిరి , సర్వీసుకు గరిష్ట పాయింట్ల పరిమితిని తీసివేయాలి . 

                    8 ) పదవీ విరమణ కు 3 సంవత్సరాల లోపు ఉన్న వారిని తప్పని సరి బదిలీ నుండి మినహాయించాలి . 

                    9 ) స్పాట్ విషయంలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా అనుమతించాలి . 

                    కౌన్సెలింగ్ గురించి….

                    1 ) ప్రధానోపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ పెట్టవచ్చు . 

                    2 ) స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . 

                    3 ) తప్పని సరిగా SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . సుమారు 2000 ఖాళీలను ఎంపిక చేసుకోడం వల్ల తీవ్రనష్టం జరుగుతుంది .

                     4 ) ప్రస్తుతం అన్ లాక్ 5.0 లో అన్నింటిపై నియంత్రణ ఎత్తివేస్తున్నందున మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి . 

                    5 ) జూలై 1 వ తేదీన జరిపిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో అంగీకరించిన అంశాలనూ పొందు పర్చలేదు . పై అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

                    బదిలీలు క్రమబద్దీకరణ పై గుంటూరు డిఈవో వారి ప్రకటన

                      0

                        పత్రికా ప్రకటన

                      శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారు బదిలీలు, పోస్ట్‌ల సర్దుబాటు మరియు పదోన్నతుల షెడ్యూలు మరియు సూచనలు ప్రకటించినారు. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారు శ్రీమతి ఆర్‌.ఎస్‌.గంగా భవాని గారు జిల్లాలొని అందరూ ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు షెడ్యూలు మరియు సూచనలుప్రకారము నిర్జీత ప్రొఫార్మాలలో అన్నీ రకాల ఖాళీలను మరియు తప్పనిసరిగా బదిలీ అగు ఉపాధ్యాయ వివరములను సేకరించవలెనని కోరినారు. ఇందుకోసం వారు విషయ పరిజ్ఞానము ఉన్న వారితో కమిటీలను ఏర్పరచుకొని సమాచారమును పరిశీలించి మరియు ధృవీకరించి ఈ కార్యాలయమునకు సమర్చించవలసినదిగా కోరినారు.

                      పోస్టుల సర్ధుబాటుకు ది.29-2-2020నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొనడమైనది. ఈ విషయంలో ది.]4-10-2020 నాటికి విద్యార్ధుల సంఖ్యలో ఏమైనా పెరుగదల ఉన్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారులద్వారా వివరములు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ది.19-10-2020 లోపు సమర్ప్చించవలెనని తెల్పినారు.

                      పేరెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లోకి బదిలీలు కోరుకొనే ఉపాద్యాయులు కూడా సంబంధిత తనిఖీ అధికారులద్వారా వివరములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్ప్చించవలెనని తెల్పినారు.

                      గమనిక: ఈ ప్రకటనను అని రూరల్‌ ఎడిషన్లనందు ప్రచురించవలసినదిగా కోరడమైనది.