NationalRailway Budget: ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ఎందుకు...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Railway Budget: ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ఎందుకు ఆపేశారో తెలుసా..? కారణాలు తెలిస్తే షాకవుతారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం భారతీయ వాణిజ్య మార్కెట్ మొత్తం కేంద్ర బడ్జెట్ గురించి కోటి ఆశలతో చూస్తున్నారు. ఇటీవల కాలంలో బడ్జెట్ అంటే అన్ని రంగాలకు కలిపి ఇస్తున్నారు. అయితే గతంలో రైల్వేకు ప్రత్యేకంగా ఓ బడ్జెట్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును మీరు వింటున్నది నిజమే 2016కు ముందు వరకు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవారు. 2016లో సాధారణ బడ్జెట్‌తో  రైల్వే బడ్జెట్ విలీనానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత భారతదేశం 2017లో ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సమర్పించడం ఆపేసింది. ఈ నిర్ణయం ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ను సమర్పించే 92 ఏళ్ల పద్ధతికి ముగింపు పలికింది. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్ ఏయే కారణాల నిలిపివేశారో? మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1924లోనే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. అయితే 92 ఏళ్ల తర్వాత 2017లో రైల్వే బడ్జెట్ మొదటిసారిగా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు ముగింపు పలకాలని నీతి ఆయోగ్ కమిషన్ సిఫార్సు చేసింది. అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు ఈ సిఫార్సును స్వీకరించి భారత ఆర్థిక వ్యవస్థకు, రైల్వేలకు మేలు చేసేలా రైల్వే, కేంద్ర బడ్జెట్‌లను కలపాలని అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ 2016లో రాజ్యసభలో లేవనెత్తారు, ఇది రెండు బడ్జెట్‌ల ఏకీకరణను ప్లాన్ చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 

అక్వర్త్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వ వలస పాలనా విధానం ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. మొదటి రైల్వే బడ్జెట్ 1924లో ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం అన్ని ఇతర పరిపాలనా విభాగాలపై ఖర్చు చేసిన దానికంటే రైల్వేల నిర్వహణకు ఎక్కువ డబ్బు అవసరం అయ్యేది. ఈ విధానం విదేశీ పెట్టుబడులను, ముఖ్యంగా భారతీయ రైల్వేలలో బ్రిటిష్ పెట్టుబడులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారు. అయితే ఆ విధానం ప్రస్తుత పాలనకు అవసరం లేదని భావించి ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విధానానికి స్వస్తి పలికారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this