BusinessBankబ్యాంకు మేనేజర్ ఘరానా మోసం..! ఖాతాదారుల పేరుతో...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం..! ఖాతాదారుల పేరుతో రూ.5 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bank Scam : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్లు తెలిసింది. మేనేజర్ 5 కోట్ల రూపాయల రుణాలు దారి మళ్లించారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. 42 మంది ఖాతాదారుల పేర్లపై మేనేజర్ అజయ్ 5 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడీ పేరిట రుణాలు తీసుకున్నారని.. ఆ రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా బ్యాంకు ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులోని పలువురు ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకు మేనేజర్ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. రుణాలకు సంబంధించి ఈఎంఐ చెల్లించాలి అంటూ ఖాతాదారులకు మేసేజ్ లు వెళ్లాయి. దీంతో వారు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకుకి వెళ్లారు. నిజం తెలిసి కంగుతిన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట బ్యాంకు మేనేజర్ రుణాలు తీసుకున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. 42 మంది ఖాతాదారుల పేరిట బ్యాంకు మేనేజర్ అజయ్ కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్ అజయ్ తమ నుంచి చెక్కులు, బ్యాంకు ష్యూరిటీలు ఎంతో తెలివిగా కలెక్ట్ చేశారని బాధిత కస్టమర్లు వాపోయారు. వాటిని ఉపయోగించి తనకు అవసరమైన డబ్బును బ్యాంకు మేనేజర్ అజయ్ రుణాల రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు రావడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రస్తుతం బ్యాంకు మేనేజర్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇంత పెద్ద స్కామ్ జరిగినా అది బయటకు రాకుండా బ్యాంకు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వెంటనే మేనేజర్ అజయ్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this