Friday, December 12, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
BusinessScholarship in Lakhs విద్యార్థులకు గుడ్ న్యూస్.....

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

Scholarship in Lakhs విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Scholarship in Lakhs విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్! సరస్వతీ దేవీ కటాక్షం ఉన్నా లక్ష్మీ దేవీ కటాక్షం లేక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోవాలనే తమ కోరికను చంపుకుంటున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా ఎంతో మంది విద్యార్థులు చదువుకు నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వాలే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి ఏకంగా రూ. 1.5 లక్షల స్కాలర్ షిప్ అందించనుంది. ఇంతకీ అర్హులు ఎవరంటే?

Scholarship in Lakhs

ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు అవసరం పడుతుంది. చదువుకు అయ్యే ఖర్చును భరించలేక కొంత మంది విద్యార్థులు చదువును ఆపేస్తుంటారు. ఇలాంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కొటక్ కన్యా స్కాలర్ షిప్ 2024-25 పేరిట ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ అందిస్తోంది. విద్యార్థినులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహిచి వారి ఉన్నతికి తోడ్పడేందుకు ఈ స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ స్కాలర్ షిప్ అందించనున్నది.

ఇంటర్లో 75శాతం మార్కులు ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. ఇన్ కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు), బీఫార్మసీ, బీఎస్సీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this