Thursday, November 20, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SpiritualKrishnastami Specials శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన..వెరైటీ వంటకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Krishnastami Specials శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన..వెరైటీ వంటకాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Krishnastami Specials పండుగలకి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ వంటకాలు చేయడం సహజం. అయితే అదే పండుగకి పక్క రాష్ట్రాల్లో చేసే సంప్రదాయ వంటకాలను కూడా ట్రై చేస్తే బాగుంటుంది.అలాంటివే ఇవి కూడా.. రేపు అంటే ఆగస్టు 26న శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన ఈ వెరైటీ వంటకాలు వండి రుచి చూడండి.

krishnastami specials
november 20, 2025, 6:33 am - duniya360

Krishnastami Specials

వెన్న ఉండలు

కావాల్సినవి :

బియ్యప్పిండి – ఒక కప్పు
మినప్పిండి – ఒక టేబుల్ స్పూన్
వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
ఇంగువ – పావు టీస్పూన్
నీళ్లు – సరిపడా
నూనె – వేగించడానికి సరిపడా
నువ్వులు – ఒక టీస్పూన్  (ఇష్టపడితే)

తయారీ : ఒక పాన్​లో బియ్యప్పిండి వేసి రెండు నిమిషాలు వేగించి పిండిని ఒక ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో మినప్పిండి వేగించాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి వేసి కలపాలి. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్​ చేసిన కొబ్బరిని పాన్​లో వేసి తేమపోయేవరకు వేగించాలి. తరువాత దాన్ని కూడా బియ్యప్పిండి మిశ్రమంలో వేసి కలపాలి. అందులో వెన్న, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి కలిపి ముద్ద చేసి, ఉండలు చేయాలి. ఆ ఉండల్ని పొడి బట్ట​ మీద అరగంట ఆరబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో రెడీ చేసిన ఉండల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక పళ్లెం​లో టిష్యూ పేపర్ వేసి, వేగించిన ఉండలు దానిమీద వేసి చల్లారబెట్టాలి. 

గోపాలక​లా 

కావాల్సినవి :

పోహా (అటుకులు) – రెండు కప్పులు
పెరుగు – అర కప్పు
పాలు – ఒక కప్పు
ఉప్పు – సరిపడా
నెయ్యి – ఒక టీస్పూన్
ఆవాలు – పావు టీస్పూన్
మినప్పప్పు – అర టీస్పూన్
జీలకర్ర – పావు టీస్పూన్
ఇంగువ – చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
పచ్చిమిర్చి – ఒకటి
కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో పోహా వేసి అందులో పాలు, నీళ్లు పోయాలి. పెరుగు కూడా వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేగించాలి. ఆ తాలింపును పోహా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ వంటకాన్ని చల్లారాక తింటేనే టేస్టీగా ఉంటుంది. 

పోహా స్వీట్ పొంగల్​ 

కావాల్సినవి :

పోహా (అటుకులు) – ఒక కప్పు
పెసరపప్పు – పావు కప్పు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు – ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు – మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, మిరియాలు –  ఒక్కో టీస్పూన్
కరివేపాకు – కొంచెం
పచ్చిమిర్చి – రెండు

తయారీ : పాన్​లో ఒక టేబుల్ స్పూన్​ నెయ్యి వేడి చేయాలి. అందులో పెసరపప్పు వేసి ఒక నిమిషం వేగించాలి. అందులో నీళ్లు పోసి తెర్లాక తీసేయాలి. మరో పాన్​లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి పోహా వేగించాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి. అవి ఉడికాక, పెసరపప్పు వేసి కలపాలి. మరో పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేగించాలి. వాటిని పొంగల్​ మిశ్రమం పై పోసి, బాగా కలపాలి. పొంగల్​ బాగా ఉడికాక స్టవ్​ ఆపేయాలి.

మిక్స్​డ్​ఫ్రూట్ కేసరి

కావాల్సినవి :

బొంబాయి రవ్వ, నీళ్లు, పాలు – ఒక్కో కప్పు చొప్పున
చక్కెర – ఒకటిన్నర కప్పు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు – ఒక్కోటి పావు కప్పు
దానిమ్మ గింజలు, ద్రాక్షలు – ఒక్కోటి పావు కప్పు
బాదం, జీడిపప్పులు – ఒక్కోటి పది చొప్పున
ఎండుద్రాక్ష- రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – ఒక టీస్పూన్

తయారీ : ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పులు, కిస్​మిస్​ వేగించి ప్లేట్​లోకి తీయాలి. అదే నెయ్యిలో యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్షలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఒక పాలగిన్నెలో పాలు, నీళ్లు పోసి కాగబెట్టాలి. పాలు మరిగాక వేగించిన పండ్లన్నీ అందులో వేసి ఉడికించాలి. కావాలంటే ఫుడ్ కలర్​ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరో పాన్​లో బొంబాయి రవ్వ, చక్కెర వేగించాలి. అందులో పాలు, పండ్ల మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టి పడ్డాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి, బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. 

పెసర పాయసం

కావాల్సినవి :

పెసరపప్పు – ఒక కప్పు
బెల్లం – ఒక కప్పు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పాలు – మూడున్నర కప్పులు
జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష – రెండు టేబుల్ స్పూన్లు
యాలకులు – నాలుగు 

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్​లో పెసరపప్పును రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే కొబ్బరి పాలు పోసి అవి మరిగాక, యాలకులు వేసి పావుగంట పెసరపప్పును ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం వేసి ఐదు నిమిషాలు బాగా కలపాలి. అవసరం అనిపిస్తే మరికొన్ని కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత పెసర పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసి మిగిలిన నెయ్యితోపాటు జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి కలపాలి. వేడి వేడి పెసర పాయసం రెడీ. 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this