Tuesday, August 19, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
BusinessBankబ్యాంకు మేనేజర్ ఘరానా మోసం..! ఖాతాదారుల పేరుతో...

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ హ్యాండ్ బుక్: క్లాస్ & సబ్జెక్ట్ వారీగా Model filled diary | AP Teachers Handbook

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా AP Teachers handbook మరియు model...

1st Class Telugu Month Wise Model Filled Teacher Diary

1st Class Telugu Month Wise Model Filled Teacher DiaryFilled...

1st Class English Month Wise Model Filled Teacher Diary

1st Class English Monthly Model Filled Teacher DiaryFilled Teacher...

భారతదేశం గణితంతో మళ్లీ ప్రేమలో పడాలి: మంజుల్ భార్గవ | Manjul Bhargava mathematics

ప్రపంచ ప్రసిద్ధ ఫీల్డ్స్ మెడలిస్ట్ Manjul Bhargava mathematics భారతదేశం గణితంతో...

బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం..! ఖాతాదారుల పేరుతో రూ.5 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bank Scam : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్లు తెలిసింది. మేనేజర్ 5 కోట్ల రూపాయల రుణాలు దారి మళ్లించారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. 42 మంది ఖాతాదారుల పేర్లపై మేనేజర్ అజయ్ 5 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడీ పేరిట రుణాలు తీసుకున్నారని.. ఆ రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకుకి వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా బ్యాంకు ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులోని పలువురు ఖాతాదారులకు తెలియకుండా బ్యాంకు మేనేజర్ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. రుణాలకు సంబంధించి ఈఎంఐ చెల్లించాలి అంటూ ఖాతాదారులకు మేసేజ్ లు వెళ్లాయి. దీంతో వారు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకుకి వెళ్లారు. నిజం తెలిసి కంగుతిన్నారు. తమకు తెలియకుండానే తమ పేరిట బ్యాంకు మేనేజర్ రుణాలు తీసుకున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. 42 మంది ఖాతాదారుల పేరిట బ్యాంకు మేనేజర్ అజయ్ కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్ అజయ్ తమ నుంచి చెక్కులు, బ్యాంకు ష్యూరిటీలు ఎంతో తెలివిగా కలెక్ట్ చేశారని బాధిత కస్టమర్లు వాపోయారు. వాటిని ఉపయోగించి తనకు అవసరమైన డబ్బును బ్యాంకు మేనేజర్ అజయ్ రుణాల రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు రావడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ప్రస్తుతం బ్యాంకు మేనేజర్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఇంత పెద్ద స్కామ్ జరిగినా అది బయటకు రాకుండా బ్యాంకు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వెంటనే మేనేజర్ అజయ్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this