Wednesday, May 21, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Third wave: అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

AP Government: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన – కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో...

Third wave: అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అమరావతి: రాష్ట్రములో కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందోస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.

చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్‌ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్‌ లోని కాన్ఫరెన్స్‌ హల్‌ లో మంగళవారం కోవిడ్‌ నివారణ గ్రూప్‌ అఫ్‌ మిమిస్టర్స్‌ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు వైద్య చికిత్స అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 5సంవత్సరాల లోపు తల్లులకు టీకా వేసే కార్యక్రమం ముమ్మరం చేయాలని అన్నారు. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్‌ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని వారు తెలిపారు. థర్డ్‌ వేవ్‌ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలుకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని హాస్పిటల్స్‌ లో బెడ్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కమిటీ సభ్యులు, మంత్రులు బత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాధ్‌ రెడ్డి, కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకఅష్ణ రెడ్డి, డాక్టర్‌ సిదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this