Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Corona Virus in Water: తాగునీటిలో వైరస్.....

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Corona Virus in Water: తాగునీటిలో వైరస్.. మరింత ప్రమాదకరం కానుందా ? కీలక విషయాలను చెప్పిన సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Corona Virus in Water: దేశవ్యాప్తంగా కరోనా మారణ హోమం సృష్టిస్తుంది. ఈ
నేపథ్యంలో కరోనా వైరస్ ఉండే స్థితి గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల తాగేనీటిలో కరోనా వ్యాప్తి చెందుతుందని వార్తలు వస్తున్నాయి.
దీనిపై సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)
డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర వివరణ ఇచ్చారు. తాగేనీటిలోనూ కరోనా రెండు
రోజుల పాటు బతికే ఉంటుందని తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర
పదార్థాలపై ఆధారపడి వైరస్ బతికి ఉంటుందని అన్నారు. కొవిడ్ వైరస్ పై అవగాహన
కల్పించేందుకు జూమ్ లో శనివారం ఆయన సీసీఎంబీలో కరోనా వైరస్ జన్యుక్రమ
ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్వతేజ్ కార్తీక్ లతో కలిసి
మాట్లాడారు.

4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‏కు ఇన్‏ఫెక్షన్
కలిగించే సామర్థ్యం ఉంటుంది. వేడి నీళ్ళలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల
వ్యవధిలోనే చనిపోతుంది. నీటిలోని వైరస్ ఒక్కటే ఇన్‏ఫెక్షన్ కలిగించలేదు..
అది శరీరంలోకి వెళ్ళాలంటే ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి
ఉంటుంది. అయితే తాగిన నీరు నేరుగా పొట్టలోకి వెళ్తుంది. కాబట్టి ప్రమాదమేమి
లేదు. తాగునీటి ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందిన కేసులు మన దేశంలో ఎక్కడా
నమోదు కాలేదు. కాబట్టి అదేమంత ఆందోళన కలిగించే విషయం కాదు. ముందుజాగ్రత్తగా
వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్థాలనే తీసుకోవడం మంచిది.
ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు గాలి ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి
చెందుతోంది అని తెలిపారు.

అలాగే కరోనా వైరస్ ఎప్పటికి అంతమవుతుందనేది చెప్పలేం. అందరూ టీకాలు
వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని రెండు నెలల్లో
నియంత్రించగలుగుతామన్నారు. అలాగే రాబోయే రోజులలో మరిన్ని ఔషదాలు
అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్లినికల్ గా చెప్పాలంటే మొదటి వేవ్ తో
పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పెద్దగా మార్పులు ఏమి లేవు. అవే లక్షణాలు, మరణాల
రేటు కూడా అదే విధంగా ఉంది. ఈసారి వేగంగా వ్యాపిస్తుందని, పిల్లలకు
ఎక్కువగా సోకుందనే ప్రచారం జరుగుతోంది. దీని గురించి కచ్చితమైన అధ్యయనాలు
లేవు. పెళ్ళిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలి. జనసమ్మర్థం ఉండే
ప్రదేశాలకు వెళ్ళవద్దు. గాలి, వెలుతురు లేని గదులలో ఎక్కువ సేపు ఉండకూడదు.
దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదు అని రాకేశ్ మిశ్ర తెలిపారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this