Tuesday, January 6, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Examinations: ప్రతిపాదిత పదవ తరగతి పరీక్షల షెడ్యూల్...జూలై...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Examinations: ప్రతిపాదిత పదవ తరగతి పరీక్షల షెడ్యూల్…జూలై 26 నుండి పదవ తరగతి, జూలై 7 నుండి ఇంటర్ పరీక్షలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాం -మంత్రి సురేశ్‌ 

Examinations: కరోనా కేసులు తగ్గుతుండడంతో జులైలో పది, ఇంటరు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై మొదటి వారంలో ఇంటరు, చివరి వారంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా లేకపోతే పరీక్షలకు ఇబ్బందులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డీఎస్సీ-2008 అభ్యర్థులతో కలిసి సీఎం జగన్‌ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.. ‘డీఎస్సీ-2008 అభ్యర్థుల సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. 2,193 మందికి సీఎం జగన్‌ న్యాయం చేశారు. వీరిని ఎస్జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేర్చారు. త్వరలో నియామక ఉత్తర్వులు ఇస్తాం. 

 ప్రభుత్వానికి చేరిన షెడ్యూల్‌ 

రాష్ట్రంలో ఈనెల 20 వరకు కర్య్ఫూ ఉన్నందున ఆ తర్వాత విద్యార్థులకు 15 రోజుల సమయం ఇచ్చి పరీక్షలను నిర్వహించేందుకు ఇంటరు విద్యామండలి షెడ్యూలు రూపొందించింది. అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. జులై 7నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు 10లక్షలకుపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. వీటి అనంతరం ఆగస్టులో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల(ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this