MDM in Aided Schools Issue: ఎయిడెడ్‌...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

MDM in Aided Schools Issue: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • వంట కార్మికులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు ఆదేశాలు

న్యూస్ టోన్, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోనుంది. పేద విద్యార్థులకు ఇంతకాలం ఉచితంగా అందుతున్న పోషకాహారం ఇక లభించదు. ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు గ్రాంటు నిలిపివేయడంతో చాలావరకు ఎయిడెడ్‌ బడులు ప్రైవేటు పాఠశాలలుగా మారిపోయాయి. వీటిలో మధ్యాహ్నభోజన పథకాన్ని నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సమీపంలోని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా విద్యాధికారి ఇప్పటికే ఆదేశాలు విడుదల చేశారు. వంట కార్మికులను ఎవ్వరినీ  తొలగించకుండా నిబంధనల ప్రకారం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించాలని పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులకు ఒకరు, వంద మందికి ఇద్దరు, ఆపైన ప్రతి వంద మందికి ఒకరి చొప్పున ఎయిడెడ్‌లోని వంట కార్మికులను సర్దుబాటు చేయాలని సూచించారు.

ఆ పాఠశాలల్లో కొనసాగిస్తారా?

రాష్ట్రంలో 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కిచ్చేందుకు 1,214 విద్యాసంస్థలు సమ్మతి తెలిపాయి. సమ్మతి తెలిపిన విద్యాలయాలను ప్రైవేటుగా నిర్వహించుకోవాలంటూ జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొత్తం 1.97 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు వీరిలో కొంతమందిని ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసినా మిగతావారు అక్కడే కొనసాగే అవకాశం ఉంది. ప్రైవేటుగా మారిన ఎయిడెడ్‌ బడిలో చదివేవారికి ఇక మధ్యాహ్న భోజనం ఉండదు. ఇప్పటికే సమ్మతి తెలిపిన కొన్ని యాజమాన్యాలు అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖకు లేఖలు రాశాయి. రాష్ట్రంలో 400 ఎయిడెడ్‌ పాఠశాలలను నిర్వహిస్తున్న ఆర్‌సీఎం యాజమాన్యాలు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఈ లేఖలు పంపాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సందిగ్ధత నెలకొంది. వీటిలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుందా? లేదా అనేదానిపైనా స్పష్టత లేదు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this