Wednesday, December 10, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
PRC News: మూడు, నాలుగు రోజుల్లో పి.ఆర్.సి...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

PRC News: మూడు, నాలుగు రోజుల్లో పి.ఆర్.సి ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఎంత భారం పడుతుందన్న  దానిపై అధికారుల నివేదిక
  • 3, 4 రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చు
  • సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అమలు, ఫిట్‌మెంట్‌, తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ఉన్నతాధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు రావత్‌, శశిభూషణ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుపతి పర్యటనలో వారం, పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని చెప్పిన సీఎం గురువారం అదే అంశంపై సమీక్ష నిర్వహించారు.

అయితే ఈ సమావేశంలో నిర్ణయాలేవీ బయటకు వెల్లడి కాలేదు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, ఏ సమీకరణాల్లో వెళితే ఎంత భరించాల్సి వస్తుందనే అంశాలపై ఆర్థికశాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి, ముఖ్యమంత్రివద్ద ప్రజంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతిగా 27 శాతం ఇస్తోంది. మరోవైపు పీఆర్సీ నివేదిక బయటపెట్టి, ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ నివేదిక

మరోవైపు పీఆర్సీపై 3, 4 రోజుల్లో ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులు బుధవారం కసరత్తు చేసి, ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. దీనిపై సీఎం జగన్‌ గురువారం ఉన్నతాధికారులతో చర్చించారు. పీఆర్సీ ప్రకటనకు ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది’ అని వెల్లడించారు. పీఆర్సీ కోసం ఇన్నాళ్లు ఆగినవారు మరో 10 రోజులు ఆగలేకపోతున్నారా? అని ఆందోళనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘వారి మాజీ అధ్యక్షుడికి పదవి వచ్చే వరకు ఖాళీగా ఉన్నారు. పదవి వచ్చాక ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ‘మార్కెటింగ్‌ శాఖలో ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలివ్వాలని కోరుతున్నారు. మార్కెట్‌ కమిటీల్లో పని చేసే ఉద్యోగులు, పింఛనుదార్లకు 010 కింద వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు’ అని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this