Wednesday, June 18, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NewsTelangana Students విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Telangana Students విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఆ విషయంపై మరింత ఫోకస్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Telangana Students గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభించారు. త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

Telangana Students

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతపై ప్రభుత్వం మరింత ఫోక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పాఠశాలల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పరిశ్రభుత బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ కి అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతపై దృష్టి సారించిన నేపథ్యంలో పారిశుద్ద్య పనుల కోసం ప్రభుత్వం గ్రాంట్ ని మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది.

పది నెలలకు కలిపి ఒకేసారి ఆయా పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.3 వేల, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.12 వేలు, 750 విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు రూ.20 వేల చొప్పన ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.ఇకపై పాఠశాలల్లో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని, పిల్లలు చక్కటి వాతావరణంలో విద్యనభ్యసించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా.. అపరిశుభ్ర వాతావరణం కనిపించినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this