NationalIncome Tax Returns : ఐటీ రిటర్న్‌లో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Income Tax Returns : ఐటీ రిటర్న్‌లో అల్‌టైమ్ రికార్డు.. ఇప్పటివరకు 7 కోట్ల దాటిన దరఖాస్తులు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Income Tax Returns ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, ఇది నేటితో ముగిసింది. అంతకుముందు, బుధవారం రాత్రి 7 గంటల వరకు 7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. వీటిలో జూలై 31న ఒక్కరోజే 50 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. ప్రజలందరూ వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ రిటర్న్‌లు దాఖలైనట్లు ఐటీ అధికారులు తెలిపారు. అలాగే ఈ మైలురాయిని సాధించినందుకు పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు.

Income Tax Returns

మరోవైపు ఇవాళ 24 గంటలూ ప్రజలకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ సిద్ధంగా ఉంది. అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే, వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయండి అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ మందగమనంపై ప్రజలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ప్రజలకు 24×7 సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఏదైనా సమస్య ఉంటే, ఫోన్ కాల్, లైవ్ చాట్, వెబ్ సెషన్ మరియు X ద్వారా మా హెల్ప్‌డెస్క్ నుండి సహాయం తీసుకోవచ్చు.

ఐటీఆర్‌ ఫైలింగ్‌లో సరికొత్త రికార్డు

Income Tax Returns ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. గతేడాది జూలై 31 వరకు 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 7 కోట్లు దాటింది. జూలై 31, 2024 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. దీని తర్వాత, పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. కానీ, అందుకు రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this