Tuesday, September 9, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NationalNipah Virus నిఫా వైరస్ కలకలం.. రావడం...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

Nipah Virus నిఫా వైరస్ కలకలం.. రావడం రావడమే 14 ఏళ్ల పిల్లాడిని పొట్టనపెట్టుకుంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Nipah Virus కోజికోడ్: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాలో 14 ఏళ్ల వయసున్న ఒక బాలుడు నిఫా వైరస్ సోకి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10 రోజుల క్రితం ఈ బాలుడు నిఫా వైరస్ లక్షణాలతో అనారోగ్యం పాలయ్యాడు. కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచి చికిత్సందించారు. ఆదివారం ఈ బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడి శాంపిల్స్ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ శాంపిల్స్ను పరీక్షించగా ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు శనివారం నాడు నిర్ధారించారు. దీంతో.. ఆ బాలుడిని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి చికిత్సలో భాగంగా ఇవ్వాల్సిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ డోసులు పుణె నుంచి కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం చేరుకునే అవకాశం ఉంది. ఈలోపే నిఫా వైరస్ బాలుడి ప్రాణాలు తీసింది.

Nipah Virus

నిఫా వైరస్ మరణం నమోదు కావడంతో కేరళలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మలప్పురంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. నిఫా వైరస్ పొట్టనపెట్టుకున్న బాలుడి స్వగ్రామమైన పాండిక్కడ్ పంచాయతీలో లాక్డౌన్ విధించారు. కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నిఫా వైరస్ కేసులపై మీడియాకు వివరాలు వెల్లడించారు. నలుగురిలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించాయని, ఒకరికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆ నలుగురి శాంపిల్స్ను టెస్టింగ్కు పంపినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నిఫా వైరస్ సోకి చనిపోయిన బాలుడితో అప్పటికి 240 మంది కాంటాక్ట్లో ఉండటంతో వారిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.

కేరళలో 2018 నుంచి నిఫా వైరస్ కలకలం మొదలైంది. పాజిటివ్ వచ్చిన పేషంట్స్లో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2018లో కోజికోడ్లో ఒకరు, 2019లో కొచ్చిలో ఒకరు, 2023లో కోజికోడ్లో నలుగురు మాత్రమే నిఫా నుంచి కోలుకున్నారు. కేరళలో 2018లో 18 మందికి నిఫా వైరస్ సోకితే 17 మంది చనిపోయారు. 2021లో ఒకరు, 2023లో ఇద్దరు నిఫా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పుడు బాలుడు చనిపోవడం కేరళ ప్రజల్లో కలవరపాటుకు కారణమైంది.

Source:V6 News Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this