NationalMicrosoft Error No Effect on Railways...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Microsoft Error No Effect on Railways మైక్రోసాఫ్ట్ ప్రభావం భారతీయ రైల్వేస్ పై ఎందుకు పడలేదో తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. అంతర్జాతీయంగా విమాన సేవలు, బ్యాంకింగ్, షేర్ మార్కెట్ సేవలు సహా అనేక సేవలు నిలిచిపోయాయి. అమెరికా సహా అనేక దేశాల్లో ఈ సమస్యలు తలెత్తాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ కి సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ అనే సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్ వేర్ అప్డేట్ లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఈ కారణంగా క్రౌడ్ స్ట్రైక్ భారీ నష్టాన్నే చవి చూడాల్సి వచ్చింది. అనేక కంపెనీలు, విమానాశ్రయాల్లో తలెత్తిన అంతరాయం వల్ల క్రౌడ్ స్ట్రైక్ షేర్లు భారీగా పడిపోయాయి.

దాదాపు 16 బిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం రూ. 1.34 లక్షల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పని చేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కానీ భారతీయ రైల్వేస్ మాత్రం ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. బ్యాంకింగ్, మీడియా, విమానయాన సేవలు, హాస్పిటల్ సేవలు అన్నీ నిలిచిపోయాయి. భారతదేశంలో కూడా విమానయాన సేవలు సహా అనేది సేవలు నిలిచిపోయాయి. కానీ ఇండియన్ రైల్వేస్ సేవల్లో మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు. దీనికి కారణం భారతీయ రైల్వేస్ లో బుకింగ్ కౌంటర్లలో టికెట్లు ఇవ్వడానికి వాడే సాఫ్ట్ వేరే అని సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు.

టికెట్లు ఇవ్వడానికి ఇంకా 1999లో డెవలప్ చేసిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంనే (సీఆర్ఐఎస్) వాడుతున్నామని అన్నారు. 1999 నుంచి సీఆర్ఐఎస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంనే వాడుతుండడం వల్ల మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ ఇండియన్ రైల్వేస్ పై పడలేదని అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి అదే సిస్టంను అప్డేట్ చేస్తూ వాడుతున్నామని.. కొత్త సాఫ్ట్ వేర్ కి అప్ గ్రేడ్ అవ్వలేదని అన్నారు. అదన్నమాట విషయం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన కంపెనీలు సమస్యను ఎదుర్కుంటే భారతీయ రైల్వేస్ మాత్రం ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this