Saturday, December 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NationalDelhi: కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

Delhi: కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‎లో ఉన్న కవిత స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్రమైన జ్వరంతో పాటూ, గైనిక్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు జైలు అధికారులు. చికిత్స నిమిత్తం మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు చికిత్సలో భాగంగా రక్తనమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందజేశారు ప్రత్యేక వైద్య బృందం. వైద్యపరీక్షలనంతరం ఆమెను తిరిగి తిహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈడీతో పాటూ సీబీఐ కేసుల్లో కూడా కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ సీబీఐ, ఈడీ తరఫు వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండుకు ఆదేశించింది. మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత ఏప్రిల్ 11న సీబీఐ కూడా ఈ కేసును దర్యప్తు చేపట్టేందుకు ముందుకు రావడంతో బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడింది.

ఇప్పటికే 120 రోజులకు పైగా ఆమె జుడీషియల్ రిమాండులో ఉన్నారు కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారామె. విచారణ జరిపిన కోర్టు.. కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్‌ విచారణను జులై 22కు వాయిదా వేసింది. జూలై 18 వరకూ జుడీషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. దీనికి కారణం ఆమెపై దాఖలు చేసిన చార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని వాదించారు కవిత తరఫు న్యాయవాది. దీనికి కౌంటర్ గా ఎలాంటి తప్పులు లేవని తెలిపారు సీబీఐ తరఫు న్యాయవాది. మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మాత్రమే కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు సీబీఐ తరఫు న్యాయవాదులు. అయితే క‌విత డిఫాల్ట్ బెయిల్‌, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనిపై స్పష్టమైన తీర్పు వస్తుందా లేదా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this