Thursday, August 28, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EducationCM Revanth Reddy: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు...

AP DSC 2025 Call Letter Download, AP DSC Hall Ticket, APDSC Certificate Verification, Mega DSC 2025 Call Letter, APDSC Login

సర్టిఫికెట్ verificationకి హాజరవ్వడానికి ముందు AP DSC 2025 Call Letter...

ఆంధ్రప్రదేశ్ Mega DSC 2025 Latest Press Note: మెరిట్ జాబితా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ Mega DSC 2025 కోసం అన్ని...

DSC Certificate Verification Process 2025 From 28.08.2025 : DSC Call Letter Download from Login

డిజిటల్ సెర్టిఫికేట్ (DSC Certificate) అభ్యర్ధులకు ధృవీకరణ (DSC Certificate Verification)...

CM Revanth Reddy: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. అలాగే.. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం తెలిపారు.

ఇదిలా ఉంటే.. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించనున్నామని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు.

దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా.. పదేళ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదని విద్యావేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని వారు కోరార. విద్యా, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this