Friday, October 3, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Telanganaనార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు.....

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు.. వెలుగులోకి మరిన్ని షాకింగ్‌ విషయాలు..! – Narsingi Case Updates

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. రోజు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. డ్రగ్స్ సేవిస్తున్న బడా పారిశ్రామిక వేత్తలను గుర్తించారు పోలీసులు. ఏడు పబ్‌లకు యజమానిగా ఉన్న నిఖిల్‌ ధావన్‌, సిస్టల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని మధురాజుతోపాటు మరో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల యజమానులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. కేసులో A14గా హీరోయిన్.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్‌ని చేర్చారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ…. కన్జుమర్లను చార్జ్‌షీట్‌లో పెడతామన్నారు. మరోసారి నిందితుల శాంపిల్స్‌ తీసుకున్నామని చెప్పారు.

అమన్‌తో పాటు పాజిటివ్‌ వచ్చినవారికి నోటీసులిచ్చామని చెప్పారు. అమన్‌ను హైదరాబాద్‌లోనే పట్టుకున్నామని, పాజిటివ్‌ వచ్చినవారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, DPS 27 ప్రకారం కన్జుమర్లు కూడా నిందితులని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

రాజేంద్రనగర్ డివిజన్‌లో నార్కొటిక్ బ్యూరో, ఎస్‌వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. ఈకేసులో ఐదుగురు నిందితులను డ్రగ్స్ పెడ్లర్లుగా తేల్చారు నార్సింగి పోలీసులు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం.. ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ ఐదుగురు నిందితులకు 14రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.

అయితే డ్రగ్స్ కేసులో A1గా నైజీరియన్ మహిళ అనోహా బ్లెస్సింగ్ గా గుర్తించిన పోలీసులు.. మొత్తం 18 మందిపై కేసు నమోదుచేశారు. వీరిపై సెక్షన్ 22(C), 27(A)తో పాటు .. Ndpc యాక్ట్ 27 కింద కేసు నమోదు చేశారు. ఇక డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎబుకా సుజి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this