AP TS Rain Alert: బలంగా ద్రోణి.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

AP TS Rain Alert: బలంగా ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు 5 రోజులు వర్ష సూచన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Weather Report of Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల ఎండలు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది? వాన ఎక్కడ పడుతుందో తెలుసుకుందాం.

rain alert: బలంగా ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు 5 రోజులు వర్ష సూచన

వచ్చే 4 రోజులపాటూ కోస్తాంధ్రలో నైరుతీ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా.. మధ్య బంగాళాఖాతం వరకూ ఓ ద్రోణి ఉందని చెప్పింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో నేటి (14-6-2024) నుంచి 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, గాలి వేగం గంటకు 40 కిలోమీటర్లుగా ఉంటుందనీ, వాన పడే సమయంలో ఉరుములు, మెరుపులు వస్తాయని తెలిపింది.

శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పగటి వేళ కొంత ఎండ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు ఉంటాయి. ఇవాళ రోజంతా రాయలసీమలో మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 తర్వాత హైదరాబాద్, ఆ చుట్టుపక్కల వాన పడుతుంది. క్రమంగా ఇది పెద్దదవుతుంది. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. సాయంత్రం 4 తర్వాత తెలంగాణతోపాటూ.. కోస్తా, ఉత్తరాంధ్రలోనూ వాన పడుతుంది. రాత్రి 7 వరకూ ఈ వానలు పడతాయి. ఆ తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలు ఉంటాయి.

గాలి వేగం చూస్తే.. తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 11 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తరాంధ్రలో కంటే, రాయలసీమలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతంలో గంటకు 22 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాగ్జిమం 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీరప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది.

ఇవాళ తేమ బాగా ఉంది. ఏపీలో 51 శాతం, తెలంగాణలో 60 శాతం ఉంది. అందువల్ల పనులకు బయటకు వెళ్లాలి అనుకునేవారు.. మధ్యాహ్నం లోపే పని ముగించుకోవడం మేలు. మధ్యాహ్నం తర్వాత వానలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (All Images credit – IMD)


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this