Wednesday, July 2, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
TTD Rooms: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.....

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

TTD Rooms: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్ధు.. ఎందుకోసమంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Tirumala Accommodation: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Tirumala Tirupati Devasthanam: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీ‌వారి ఆల‌యంలో 2022 జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, జ‌న‌వ‌రి 14న వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వదినాల‌ను పుర‌స్కరించుకొని జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. శ్రీ‌వారి ద‌ర్శనానికి వచ్చే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టీటీడీ నిర్ణయించింది.
ఎమ్‌బీసీ 34, కౌస్తుభం విశ్రాంతి భ‌వ‌నం, టీబీసీ కౌంట‌ర్‌, ఎఆర్‌పీ కౌంట‌ర్లలో 2022 జ‌న‌వ‌రి 11వ తేదీ తెల్లవారు జామున 12 గంట‌ల నుంచి 14వ తేదీ అర్థరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు గ‌దులు కేటాయింపు రద్దు చేశారు. జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖుల‌కు వెంకట కళానిల‌యం, రామరాజ నిల‌యం, సీతా నిల‌యం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్‌ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు. ప్రముఖుల‌కు గ‌రిష్టంగా 2 గ‌దులు మాత్రమే కేటాయిస్తారు. సామాన్య భక్తుల‌కు సీఆర్‌వో జనరల్‌ కౌంటర్‌ ద్వారా గదులు మంజూరు చేస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయం గుర్తించాలని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు, తిరుమలలో శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కాంట్రాక్ట్ కార్మికులు టీటీడీ కార్పొరేషన్‌లో కలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టీటీడీ అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ సంస్థలు గదులను ఒరకొరగా శుభ్రం చేయిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా గదులు కేటాయించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గదుల కేటాయింపుపై భక్తులు దాదాపుగా రెండు గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, నిరసనలో ఉన్న కార్మికులు వెంటనే విధుల్లో చేరకపోతే వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని ఆ ప్రైవేటు సంస్థను టీటీడీ ఆదేశించింది.
ttd rooms: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్ధు.. ఎందుకోసమంటే?

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this