నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మృత్యువాతపడ్డారు.
Dichpally Triple Murder: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మృత్యువాతపడ్డారు. ముగ్గురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. డిచ్పల్లిలో మండల కేంద్రంలోని హార్వెస్టర్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. నాగపూర్ గేట్ సమీపంలోని మెకానిక్ షాపులో నిద్రిస్తున్నవారిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను పంజాబ్ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.