Konijeti Rosaiah:కొణిజేటి రోశయ్య అరుదైన రికార్డు.. 16సార్లు...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Konijeti Rosaiah:కొణిజేటి రోశయ్య అరుదైన రికార్డు.. 16సార్లు ఆ ఘనత, దేశంలోనే తొలి వ్యక్తి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కొణిజేటి రోశయ్యకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అందుకే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

  • మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత
  • దేశంలోనే అరుదైన రికార్డు ఆయనకే సొంతం
  • ఏకంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత
కొణిజేటి రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్ల లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రాజకీయ నేతగా ఎన్నో పదవుల్లో పనిచేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి చివరి వరకు విధేయుడిగా నిలిచారు.. కష్ట సమయాల్లో అధిష్టానానికి అండగా ఉన్నారు. ఆయనకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అందుకే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
రోశయ్య 1989లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1990లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను దాదాపు 16 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఒక అరుదైన రికార్డ్ అంటున్నారు. అంతేకాదు ఆయన 1995-97 మధ్యలో ఏపీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్‌లోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆయన మరణానికి రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.
కొణిజేటి రోశయ్య అరుదైన రికార్డు.. 16సార్లు ఆ ఘనత, దేశంలోనే తొలి వ్యక్తి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this