తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్టుడే: పాఠం చెబుతుండగానే ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతిచెందిన సంఘటన తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. తాడేపల్లిగూడెం హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన సమసాని వెంకటేశ్వరరావు(50) పట్టెంపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రోజూమాదిరిగానే సోమవారం ఆయన పాఠశాలకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారకస్థితికి చేరిన ఆయన్ను తోటి ఉపాధ్యాయులు తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని ప్రధానోపాధ్యాయుడు రంగారావు, ఎంఈవో వి.హనుమ తెలిపారు. వెంకటేశ్వరరావు భార్య పరమేశ్వరి తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం పాఠశాల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
Very Unfortunate: పాఠం చెబుతూ ప్రాణాలొదిలిన ఉపాధ్యాయుడు
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.