NEP: 3,4,5 తరగతులు ఇక హైస్కూలుకే!

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

NEP: 3,4,5 తరగతులు ఇక హైస్కూలుకే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం
  • కొత్త విద్యావిధానంపై కార్యాచరణ సిద్ధం చేయండి

NEP: ఆంధ్రప్రదేశ్ లో 3, 4, 5 తరగతులను హైస్కూలు లో కలపాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు నిర్దేశించారు. కొత్త విద్యావిధానం అమలు చేసేందుకు తక్షణమే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొత్త విద్యావిధానంపై సీఎం గురువారం సమీక్షించారు.  రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు  చేయాలని అన్నారు. దీనికోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని జగన్ అధికారులకు సూచించారు.నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, ఎంతో  మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.   ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే  మార్పులు చేస్తున్నామని చెప్పారు. 

 రెండు రకాల స్కూళ్లు 

రెండు రకాల స్కూళ్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని జగన్ చెప్పారు. పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగా ఉంటాయి.  వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది. 

మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి.  ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశమని ఆయన ప్రకటించారు.  నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు.  ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదని చెప్పారు. ఫౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరమన్నారు.  3 కిలోమీటర్ల లోపు హైస్కూల్‌ పరిధిలోకి  3,4,5 తరగతులను తీసుకువెళ్లే విధానాన్ని ఎవరూ వేలెత్తి చూపేలా ఉండకుండా చూసుకోవాలన్నారు. నూతన విద్యావిధానంలో ఒక స్కూల్‌ మూతపడ్డం లేదని చెప్పారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this