Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోడానికి ఏప్రిల్‌ 30 చివరి తేదీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Railway Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇక రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై నోటిఫికేషన్స్‌ జారీ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా కేంద్రంగా పని చేస్తున్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే నుంచి పలు అప్రంటీస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పలు అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 716 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ఈనెల 30 చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులకు రేపటి వరకే అవకాశం ఉంది. మొత్తం 716 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో ఎలక్ట్రీషియన్‌ విభాగంలో 135, ఫిట్టర్‌ విభాగంలో 102, వెల్డర్‌ 43, పెయింటర్‌ 75, మేసన్‌ 61, కార్పెంటర్‌ విభాగంలో 73 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్లంబర్‌ విభాగంలో 58, బ్లాక్‌స్మిత్‌ 63, ఫైర్‌ మ్యాన్‌ 50, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో 10 ఖాళీలు, మెషినిస్ట్‌ విభాగంలో 5, టర్నర్‌ 2, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 2, క్రేన్‌ అసిస్టెంట్‌ 2, డ్రాఫ్ట్స్‌ మెన్‌ విభాగంలో 5 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది.

అయితే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఐటీఐ, పదో తరగతిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఫీజు రూ.170ని చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు పీజులో మినహాయింపు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులు కోటా డివిజన్‌లో పని చేయాలని నోఫికేషన్‌లో స్పష్టం చేశారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this