Wednesday, January 28, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ స్కూళ్ల...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు.. పాఠశాలలో 3 లక్షల సీలింగ్ ఫ్యాన్‌ల ఏర్పాటు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నెలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల కోసం పాఠశాలలలో సుమారు 3 లక్షల సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నాడు-నేడు లో భాగంగా తొలిదశలో 15,715 స్కూళ్లలో ఇప్పటి వరకు రూ. 2,580 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఓ వైపు పనులన్నీ శరవేగంగా పూర్తవుతుండగా.. ఇప్పటికే పనులు పూర్తయిన పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు-నేడు పనులకు రూ. 3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులోగా తొలిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పాదయాత్ర సమయంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను స్వయంగా చూసిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. నేడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు అభివృద్ధికి నడుం బిగించారు. స్కూళ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ. 826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. తొలదిశలో భాగంగా 14,293 మరుగుదోడ్ల పనులు మంజూరు అయ్యాయి. ఇక నాడు-నేడు తొలిదశ పనుల్లో భాగంగా రూ. 325 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు తొలిదశ నాడు-నేడు పనులను పూర్తి చేయాలని ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమం సమీక్ష సమావేశంలో కలెక్టర్లు, జేసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this